తెలంగాణ
Union Budget 2022-23 Highlights: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త, త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం, భారత్‌లో సొంత డిజిటల్ కరెన్సీ, నిర్మల బడ్జెట్ 2022 ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..
Hazarath Reddyనాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ 2022 ను (Union Budget 2022-23 Highlights) ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు
Corona in TS: తెలంగాణలో కొత్తగా 2,861 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి.
TRS Boycotts Presidential Speech: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు, పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ ఎంపీలు నిరస‌న
Hazarath Reddyపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేప‌థ్యంలో ఈ రోజు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ‌ సీఎం కేసీఆర్ నిర్దేశం మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు.
Karimnagar Road Accident: వయసు 16.. అయినా 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి నలుగురి మృతికి కారకుడయ్యాడు, కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి
Hazarath Reddyకరీంనగర్‌ పట్టణణంలో కారు ఆదివారం ఉదయం బీభత్సం సృష్టించిన సంగతి విదితమే. వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి (Karimnagar Road Accident) చెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాపై సంచలన విషయాలు, డ్రగ్స్‌ ఇంటర్నేషనల్‌ పెడ్లర్‌ టోనీ నుండి కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని పలు చోట్ల ఎక్సైజ్, పోలీసులు ( Hyderabad Police) ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మల్లెపల్లి అత్తాపూర్, గోపనపల్లిలో దాడులు జరిగాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
Covid in TS: తెలంగాణలో కొత్తగా 2,484 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా... 2,484 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డి జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 108, ఖమ్మం జిల్లాలో 107 కేసులు గుర్తించారు.
TRS Parliamentary Party meeting: కేంద్రంపై ఇక యుద్ధమే! తెలంగాణకు రావాల్సిన వాటాకోసం గట్టిగా పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం
Naresh. VNSటీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ (TRS Parliamentary Party meeting) స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ (Praghathi Bhavan) లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. దీనికి టీఆర్ఎస్ ఎంపీలు హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌తో చ‌ర్చించారు.
Cold wave In Telanagana: తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్, చలికి గజగజ వణుకుతున్న హైదరాబాద్ వాసులు, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం
Naresh. VNSతెలంగాణలో చలి పంజా (Cold Wave) విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవగా.. చలికి జనం వణుకుతున్నారు. మరో రెండు రోజుల పాటూ ఇదే తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Telangana Schools Open From Feb 1st: ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు ప్రారంభం, కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడంతో నిర్ణయం..
Krishnaతెలంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల 31వ తేదీ వరకూ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,877 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,877 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 348, రంగారెడ్డి జిల్లాలో 241, హనుమకొండ జిల్లాలో 140, నల్గొండ జిల్లాలో 133 కేసులు గుర్తించారు.
Road Accident in Bhadradri Kottagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి,
Krishnaభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు.
New National Highway Between TS-AP: తెలుగు రాష్ట్రాల మధ్య ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ ఆమోదం, రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో కొత్త జాతీయ రహదారి నిర్మాణం
Hazarath Reddyతెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 3,944 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 పాజిటివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డి జిల్లాలో 259, ఖమ్మం జిల్లాలో 135, సంగారెడ్డి జిల్లాలో 120, హనుమకొండ జిల్లాలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్దిపేట జిల్లాలో 104, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 101 కేసులు గుర్తించారు.
Republic Day Celebrations at Raj Bhavan: రాజ్‌భవన్‌లో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, రాష్ట్ర ప్రజలకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
Hazarath Reddyతెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.
Republic Day Celebrations in TS: యుద్ధ వీరులకు అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి, ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ సీం కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Padma Awards 2022: భీమ్లా నాయక్ పాట పాడిన జానపద కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ, భీమ్లానాయక్ పాటతో జాతీయ స్థాయలో గుర్తింపు, పాట వెనుక పవన్ కళ్యాణ్ పట్టుదల
Krishnaమొగిలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దర్శనం మొగిలయ్య అలియాస్ 12 మెట్ల కిన్నెర వాయిద్య కారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
Telangana: 14 ఏళ్ల బాలిక ఖరీదు రూ. 3 లక్షలు, 61 ఏళ్ళ ముంబై వృద్ధుడికి బేరం పెట్టిన తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, తొమ్మది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyభాగ్య నగరంలో బాలికల దినోత్సవం రోజే దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌లో 14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు. బాలికను విక్రయించేందుకు ( selling minor girl) రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు.
Hyderabad: భర్తను నిద్రపుచ్చి పక్కరూంలో ప్రియుడితో భార్య రాసలీలలు, భర్త చూశాడని తీగతో మెడకు ఉరి బిగించి చంపేశారు, ఈ కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు విధించిన మేడ్చల్ కోర్టు
Hazarath Reddyజీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్ మండలంలో ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన మహిళకు కోర్టు జీవిత ఖైదు (Woman, paramour jailed for murder) విధించింది. దీంతో పాటు ఇద్దరికీ రూ. 3 వేల జరిమానా (imposed fine of Rs.3,000 on each of them) కూడా విధించింది.
CM KCR Writes to PM Modi: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ, అఖిల భారత సర్వీసుల కేడర్‌ రూల్స్‌–1954కు సవరణలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీకి లేఖ (CM KCR Writes to PM Modi) రాశారు. అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవరణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు లేఖలో ధ్వజ మెత్తారు.