Technology

Bharti Airtel-TCS Collaboration: 5జీపై కన్నేసిన భారతీ ఎయిర్‌టెల్‌, 5జీ విస్తరణ కోసం టీసీఎస్‌తో జతకట్టిన మొబైల్‌ నెట్‌వర్క్‌ దిగ్గజం, పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌

Hazarath Reddy

భారత్‌లో 5జీ టెక్నాలజీని అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారతీ ఎయిర్‌టెల్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను (5G networks in India) విస్తరించడం కోసం దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌(టీసీఎస్‌)తో (Bharti Airtel-TCS Collaboration) జతకట్టనుంది.

Reliance Home Finance: అప్పుల ఊబిలో అనిల్ అంబాని, రూ. 2,900 కోట్లకు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ అమ్మకం, అతి పెద్ద బిడ్డర్‌గా అవతరించిన ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కొంత మేర తీరనున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కష్టాలు

Hazarath Reddy

అప్పుల భారంతో కుదేలైన అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకి ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (Authum Investment and Infrastructure) అతి పెద్ద బిడ్డర్‌గా నిలిచింది. రూ. 2,900 కోట్ల ఆఫర్‌తో ఈ బిడ్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్‌ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభించనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.

IRCTC-iPay: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, బుకింగ్ టికెట్ రద్దయిన వెంటనే రీఫండ్, యూజర్ ఇంటర్ ఫేస్ అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్​సీటీసీ, IRCTC-ipay ద్వారా టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

రైల్వే ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్తను అందించింది. ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్, యాప్ IRCTC iPayలో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.

CIBIL Score Check on Paytm App: ఇప్పుడు మీ CIBIL స్కోరు నిమిషంలో తెలుసుకోవచ్చు, పేటీఎం నుంచి కొత్త ఫీచర్, క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి తెలుసుకోవడం ఎలాగో పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

పేటియం తెచ్చిన సదుపాయంతో క్రియాశీల క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్‌లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును.

Advertisement

Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం

Team Latestly

టెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...

Twitter Loses Intermediary Status: ట్విట్టర్‌పై భారత్‌లో కేసు నమోదు, ఇప్పటికే చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను ఎత్తివేసిన కేంద్రం, ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ

Hazarath Reddy

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో (India) గట్టి షాక్‌ తగిలింది. ట్విట‌ర్‌కు ఇండియాలో ఉన్న చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వం (Center) ఎత్తేసింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ (Twitter) తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి.

HDFC Bank Mobile App:హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ క్రాష్, సమస్యను పరిష్కరించామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ

Hazarath Reddy

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ గంట పాటు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. ఎట్టకేలకు సమస్యను పరిషర్కించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి యథావిధిగా మొబైల్ యాప్ సేవలు పనిచేస్తాయని ఆయన అన్నారు.

Boycott Chinese Products: చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారతీయులు, గత 12 నెలల్లో 43 శాతం మంది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడి, గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల బహిష్కరణపై ఊపందుకున్న ఉద్యమం

Hazarath Reddy

సరిహద్దులో చైనా, ఇండియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి విదితమే. లడఖ్‌లోని గల్వాన్‌ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ (Galwan valley escalation) తర్వాత ఈ వాతావరణం మరింతగా వేడెక్కింది. అయితే ఈ ప్రభావం ఇండియాలోని చైనా వ్యాపారాలపై పడింది

Advertisement

WhatsApp Voice Calls on Jio Phone: జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త, వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి, KaiOS ఓఎస్‌లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ త‌ప్ప‌ని స‌రి

Hazarath Reddy

లయన్స్‌ జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై జియో ఫోన్ల‌లో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ (WhatsApp Voice Calls on Jio Phone) చేసుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

New Income Tax E-Filing Portal: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త, కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన ఆదాయపు పన్నుశాఖ, మొబైల్‌ యాప్‌ కూడా విడుదల, కొత్త ఫీచర్లు గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆదాయపు పన్ను శాఖ ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax.gov.in) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ రూపొందించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది.

PF withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు తీసుకునే వెసులుబాటు, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. భవిష్యత్ నిధి అనేది ఇప్పుడు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది చెప్పుకోవాలి. అయితే కోవిడ్ కల్లోలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారికి పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటును కంపెనీ ఈపీఎప్ సంస్థ కల్పించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Online Payments Charges: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా.. అయితే వివిధ బ్యాంకుల్లో చార్జీలు తప్పక తెలుసుకోవాలి, ఏటీఎం లావాదేవీలకు పడే ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే పడే ఛార్జీల గురించి కూడా ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కొన్ని బ్యాంకులు అయితే నిర్ణీత పరిమితి దాటిన తర్వాత డబ్బులు డిపాజిట్ చేయాలని చార్జీలు వసూలు (Online Payments charges in banks) చేస్తున్నాయి. వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్టీ) (National Electronic Funds Transfer (NEFT) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి.

Advertisement

New IT Rules: ట్విట్టర్‌కు ఆఖరి ఛాన్స్, భారత నిబంధనల్ని అనుసరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నోటీసుల్లో హెచ్చరించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ మధ్య వార్ మరింత తీవ్రమవుతోంది. కొత్త డిజిటల్‌ (ఐటీ) నిబంధనల (New IT Rules) ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Fact Check: కేంద్రం మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రికార్డు చేస్తుందనే వార్త అబద్దం, ఆ వాట్సాప్ మెసేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి, వార్త నిజమా? కాదా? చెక్​ చేసుకొని షేర్​ చేయాలని కోరిన పీఐబీ ఫ్యాక్ట్​చెక్​

Hazarath Reddy

సోషల్ మీడియా విషయంలో ఇప్పుడు ఓ సందేశం తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ లో రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే మీ మెసేజ్​ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మీ కాల్స్, సందేశాలను రికార్డు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని (Is govt now able to record your messages, calls) ఒక మెసేజ్ వైరల్ అవుతోంది.

New Rule for PF Account Holders: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి, చేయకుంటే యజమాని వాటా ఇక పొందలేరు, జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్, ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా..

Hazarath Reddy

కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాను (PF Account) ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయలేని పక్షంలో పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. కాగా ఉద్యోగుల ఖాతాలను (PF account holders) ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, ​​యజమానులకు అప్పగించింది.

Kia India Private Limited: కియా మోటార్స్‌ ఇకపై కియా ఇండియా, లోగో, పేరును మార్చినట్లు వెల్లడించిన కియా, అనంతపురం తయారీ ప్లాంటులో కొత్త కార్పొరేట్‌ లోగో, అంతర్జాతీయ బ్రాండ్‌ స్లోగన్

Hazarath Reddy

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటర్స్ (Kia Motors India) తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్‌ పేరు.. కియా ఇండియాగా (Kia India Private Limited) మారినట్లు వివరించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) నుండి ఆమోదం పొందిన తరువాత కార్ల తయారీదారు దాని మునుపటి పేరు నుండి ‘మోటార్స్’ (Kia Motors India as now Kia India) అనే పదాలను తొలగించారు.

Advertisement

WhatsApp's Privacy Policy: వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు, కొత్త ప్రైవసీ పాలసీ ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక, నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల గడువు

Hazarath Reddy

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసు పంపించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని (Centre asks WhatsApp to withdraw New privacy policy ) ఈ నోటీసులో స్పష్టం చేసింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా ఈ పాలసీ ఉందని పేర్కొంది.

Reliance Jio: జియో మరో భారీ ప్రాజెక్ట్, భారత్ నుంచి ప్రపంచమంతా కేబుల్ వ్యవస్థ, ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌, సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం

Hazarath Reddy

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశం కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్ వ్యవస్థను (Jio to construct largest international submarine cable system) నిర్మిస్తోంది.

Fake CoWin Vaccine Registration Apps: ఈ ఫేక్ కోవిన్ యాప్స్‌తో చాలా జాగ్రత్త, డౌన్లోడ్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయండి, మీ డేటా మొత్తం తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించిన ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం

Hazarath Reddy

ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ యాప్స్ నుంచి ఫేక్ మెసేజెస్ వస్తుంటాయని వాటిని నమ్మవద్దని కోరింది.

Jio Covid Offers: జియో యూజర్లకు పండగే..300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌, రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనున్న జియో

Hazarath Reddy

కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ను (Jio Phone Users to Get 300 Minutes of Free Calling) అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌(రోజుకు10 నిమిషాలు) ఉచితంగా ఇవ్వనుంది.

Advertisement
Advertisement