Technology

Illegal E-Ticket Booking Racket: ఐఆర్‌సీటీసీకి హ్యాకింగ్ సెగ, పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అక్రమంగా తత్కాల్ టికెట్లు బుకింగ్, అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

Hazarath Reddy

ఇండియన్ రైల్వే కి హ్యాకింగ్ సెగ తగిలింది. ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు (IRCTC Tatkal System Faces Hack) ఇల్లీగల్ ఆపరేటర్స్, హ్యాకర్స్ (Pakistani Hackers) ప్రయత్నిస్తున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-RPF గుర్తించింది. ఇందుకోసం వారు పాకిస్తానీ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇండియన్ రైల్వేస్‌తో పాటు, బ్యాంకు ఓటీపీలను బైపాస్ చేసి మరీ తత్కాల్ టికెట్లు బుక్ (Illegal E-Ticket Booking Racket) చేస్తున్నట్టు బయటపడింది.

Jio Fiber Plans Revamped: జియో కొత్త వ్యూహం, రూ. 399కే జియో ఫైబర్ ప్లాన్, ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ పేరిట కొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించిన జియో

Hazarath Reddy

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్‌కు (JioFiber) సంబంధించి కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం (new broadband plans) అవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో తెలిపింది. ఇందులో భాగంగా ట్రూలీ అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌' పేరిట సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్టు రిలయన్స్‌ జియో (Reliance Jio) ప్రకటించింది. డాటా వినియోగం, వేగంపై ఎలాంటి పరిమితి లేకుండా నెలవారీ ప్లాన్లు రూ.399 నుంచే ప్రారంభం అవుతాయని జియో తెలిపింది.

Digital Transactions Row: పేమెంట్ దారులకు గుడ్ న్యూస్, భీమ్‌–యూపీఐ చెల్లింపు ఛార్జీలను వాపస్ చేయాలని బ్యాంకులకు సూచించిన సిబిడిటి, జనవరి 1, 2020 నుంచి అదనపు ఛార్జీల విధించకూడదని ఆదేశాలు

Hazarath Reddy

ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా జరిగే లావాదేవీలపై బ్యాంకులు ఎటువంటి అదనపు ఛార్జీలు (Extra charge) విధించలేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (SBDT) ఆదివారం (ఆగస్టు 30) తెలిపింది. కొత్త నియమం జనవరి 1, 2020 నుండి వర్తిస్తుంది. "... చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల చట్టం 2007 లోని సెక్షన్ 10 ఎ ఆధారంగా, MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) తో సహా ఏదైనా ఛార్జ్ 2020 జనవరి 1 న లేదా తరువాత వర్తించదు. సూచించిన ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా చెల్లింపు జరుగుతుంది ”అని సిబిడిటి (Central Board of Direct Taxes (CBDT)) ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

Reliance-Future Group Deal: రిలయన్స్ రూ.24,713 కోట్ల డీల్, ప్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను సొంతం చేసుకున్న రిల్, ఈ–కామర్స్‌ రంగంలో పట్టు సాధించేందుకు కొత్త వ్యూహం

Hazarath Reddy

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన వ్యూహలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ప్రపంచ వ్యాప్త దిగ్గజ కంపెనీగా దానిని తీసుకువెళుతున్నాడు. తాజాగా రిలయన్స్ కిషోర్‌ బియానీ (Kishor Biyani) ప్రమోట్‌ చేస్తున్న ప్యూచర్‌ గ్రూప్‌ను కొనుగోలు (Reliance-Future Group Deal) చేసినట్లు శనివారం రిలయన్స్‌ ప్రకటించింది. ప్యూచర్‌ గ్రూప్‌కు (Future Group) చెందిన వేర్‌హౌస్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది.

Advertisement

TikTok-Triller Deal Rumors: దూసుకొస్తున్న అమెరికా గడువు, టిక్ టాక్‌పై కన్నేసిన మరో అమెరికా దిగ్గజం, 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో ట్రిల్లర్ సంప్రదింపు, అలాంటిదేమి లేదని తెలిపిన టిక్ టాక్

Hazarath Reddy

ఇండియాలో బ్యాన్ అయిన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ (TikTok) కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ (Triller) చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను (ByteDance) సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో (TikTok-Triller Deal) సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది.

Nokia Phones Launched: నోకియా నుంచి ఒకేసారి 4 కొత్త ఫోన్లు, నోకియా 5.3, నోకియా సీ3, నోకియా 150, నోకియా 125 ఫోన్లను లాంచ్ చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్, ధర,ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు (Nokia Phones Launched) విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, అలాగే ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, దీంతో పాటు రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. కాగా 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.ఇందులో నోకియా సీ3ని ఇండియాలొ తొలిసారి లాంచ్ చేసింది.

Sunil Mittal: మొబైల్ యూజర్లకు భారీ షాక్, త్వరలో మోగనున్న మొబైల్ ఛార్జీల ధరలు, రాబోయే ఆరు నెలల్లో డేటా ధరలు పెరుగుతాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్

Hazarath Reddy

త్వరలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. రానున్న ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరలు పెరగనున్నాయని (mobile services rate hike) టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Bharti Airtel chairman Sunil Mittal) సంకేతాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత (mobile services prices) తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు.

Best Prepaid Plans: రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి

Hazarath Reddy

ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్-ఐడియా కస్టమర్లను నిలుపుకోవటానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను (Best Prepaid Plans) అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారీ డేటా మరియు SMS లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రతి ధర బ్రాకెట్‌లోని చాలా ప్లాన్‌లు ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్రణాళికలు డబుల్ డేటా, బండిల్ చేసిన అనువర్తనాలు, కాంప్లిమెంటరీ సేవలు మరియు మరిన్ని వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి.

Advertisement

Jio Cricket Plans: జియో నుంచి రెండు సరికొత్త ప్లాన్లు, క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితం, ఆఫర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్‌లను (Jio Special Prepaid Recharge Plans) విడుదల చేసింది. ఐపీఎల్ 2020 సందర్భంగా క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. జియో క్రికెట్ ప్లాన్స్ (Jio Cricket Plans) పేరుతో రూ. 499 , రూ. 777 ప్యాక్ లను లాంచ్ చేసింది. 399 రూపాయల గల ప్లాన్‌లో విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది.

Jio Free Data offer: జియో 5 నెలల ఉచిత డేటా ఆఫర్, జియో టూ జియో ఉచిత కాల్స్, జియోఫై 4జీ వైర్‌లెస్‌ హాట్‌స్పాట్‌ కొనుగోలు దారులకు మాత్రమే

Hazarath Reddy

రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌ (Jio Bumper Offer) ప్రకటించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్‌ కాల్స్‌ను (Jio to Jio free Calls) ఇస్తున్నట్లు ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌ లెస్‌ హాట్‌స్పాట్‌ కొనుగోలు దారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియోఫైని జియో స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ కొనుగోలు చేయాలి. దీని ధర రూ.1,999గా ఉంది. అది కొన్న తరువాత జియోఫైకి సంబంధించిన ప్లాన్లలో ఏదో ఒక దానితో సిమ్‌ను యాక్టివేట్‌ చేయించుకోవాలి. ఒకసారి సిమ్‌ యాక్టివేట్‌ అయిన తరువాత దానిని జియోఫైలో (Jiofi) వేసి ఉపయోగించుకోవచ్చు. సిమ్‌ యాక్టివేట్‌ అయ్యిందో లేదో అన్న విషయాన్ని మై జియో యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

TikTok-Reliance Jio Deal: రిలయన్స్ చేతికి టిక్ టాక్ ? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త, అధికారికంగా స్పందించేందుకు నిరాకరించిన రిలయన్స్ గ్రూపు

Hazarath Reddy

ఇండియాలో చైనాకు చెందిన బైట్ డాన్స్ అనుబంధ సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను (TikTok) నిషేధించిన తరువాత, ఆ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ (mukesh ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా వార్త (TikTok-Reliance Jio Deal) ఆసక్తికరంగా మారింది.

China Apps Ban Row: మళ్లీ 15కు పైగా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్, భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాని అధికారిక ప్రకటన

Hazarath Reddy

భారత ప్రభుత్వం కొద్ది వారాల క్రితం నిషేధిత 59 చైనా యాప్‌లను (China Apps Ban) పోలిన క్లోన్‌లను బ్యాన్ చేసిన సంగతి విదితమే. మొత్తం 47 క్లోన్ యాప్‌లపై వేటు వేసింది. తాజాగా మరో 15పైగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో నిషేధానికి గురైన యాప్‌లకు చెందిన ప్రో, లైట్ వర్షెన్లు కూడా ప్రస్తుతం బ్యానయ్యాయని అనధికార సమాచారం. వీటిల్లో షియోమి కార్ప్ బ్రౌజర్ (Xiaomi’s Mi Browser Pro), బైదూ సెర్చ్ (Baidu Search) కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Redmi 9 Prime: రూ. 9,999లకే నాలుగు కెమెరాల స్మార్ట్‌ఫోన్, రెడ్‌మి 9 ప్రైమ్‌ను ఇండియాలో లాంచ్ చేసిన షియోమి, ఆగస్టు 6వ తేదీన ఫస్ట్ సేల్

Hazarath Reddy

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. రెడ్‌మి 9 ప్రైమ్ (Redmi, Redmi 9) పేరుతో రెండు వేరియంట్లలో భారత మార్కెట్లలో మంగళవారం సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇది ఆగస్టు 17వ తేదీ నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నాలుగు రంగుల్లో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ (Redmi 9 Prime India) లభ్యమవుతోంది. అలాగే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా ఆగస్టు 6 న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో (Redmi India smartphone) తొలిసారి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Microsoft Plan to Buy TikTok: టిక్‌టాక్‌పై మైక్రోసాఫ్ట్‌ కన్ను, అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు పావులు, ట్రంప్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం

Hazarath Reddy

చైనా వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు సంబంధించిన అమెరికా హక్కులు సొంతం (Microsoft Plan to Buy TikTok) చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ధ్రువీకరించింది. సెప్టెంబరు 15, 2020 నాటికి టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో (ByteDance) ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది.

Samsung Galaxy M31s: శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ విడుదల, సింగిల్‌ టేక్‌ కెమెరా ప్రధాన ఆకర్షణ, 6జీబీ ర్యామ్..128జీబీ స్టోరేజ్ ధర రూ.19,499, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

సౌత్‌కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ (Samsung Galaxy M31s) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఆగస్టు 6 నుంచి భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అమెజాన్‌ ఇండియా (Amazon Prime Day Sale 2020), శాంసంగ్‌ డాట్‌కామ్‌ల ద్వారా ఆసక్తి ఉన్న యూజర్లు ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ ఎం31ఎస్ ఫోన్‌ ప్రారంభ ధర రూ.19,999 కాగా టాప్‌ ఎండ్‌ మోడల్‌ ధర రూ.21,999గా నిర్ణయించారు.

Google Work From Home: గూగుల్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌, వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు పొడిగింపు, భారతదేశంలో గూగుల్ రూ.75,000 కోట్ల డిజిటల్‌ పెట్టుబడులు

Hazarath Reddy

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో గూగుల్ సంస్థ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను (Google Work From) పొడిగించింది. త‌మ ఉద్యోగుల కోసం ఇంటి నుంచి ప‌నిచేసే సౌల‌భ్యాన్ని వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు గూగుల్ సంస్థ (Google) వెల్ల‌డించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ సంస్థ‌.. ఆఫీసులో ప‌ని అవ‌స‌రం లేని వారికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. వాస్త‌వానికి ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాల‌నుకుంటున్న‌ట్లు మొద‌ట్లో గూగుల్ ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్క్ హోమ్ కాన్సెప్ట్‌ను (Google India Work From Home) ఎంక‌రేజ్ చేసింది. ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు తమ ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను వ‌చ్చే ఏడాది జూన్ చివ‌ర వ‌ర‌కు పెంచేసింది.

Advertisement

India Bans 47 Chinese Apps: పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్‌ బ్యాన్‌, 275 యాప్‌ల‌పై నిషేధం దిశగా అడుగులు

Hazarath Reddy

జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లకు అనుసంధానంగా ఉన్న మరో 47 చైనా యాప్స్‌ను బ్యాన్‌ (India Bans 47 Chinese Apps) చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బ్యాన్‌ చేసిన వాటిలో టిక్‌టాక్‌ లైట్‌, హెలో లైట్, షేర్‌ఇట్‌ లైట్‌, బిగో లైవ్‌ లైట్‌, వీఎఫ్‌ఐ లైట్‌ (Helo Lite, ShareIt Lite, TikTok, Tiktok Lite, UC Browser) ఉన్నాయి.

Galaxy M01 Core: రూ.6 వేలకే శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ఎం01 కోర్‌ను విడుదల చేసిన దక్షిణ కొరియా దిగ్గజం, ఈ నెల 29 నుంచి సేల్స్

Hazarath Reddy

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా రూ. 6 వేల లోపు ధరతో ‘గెలాక్సీ ఎం01 కోర్’ను (Galaxy M01 Core) విడుదల చేసింది. భారత్‌లో లభ్యమయ్యే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత చవకైన ఫోన్. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీలతో రెండు వేరియంట్లు తీసుకొచ్చింది. ఇందులో మొదటి దాని ధర ( Galaxy M01 Core Price) రూ. 5,499 కాగా, రెండో దాని ధర రూ. 6,499 మాత్రమే. ఈ నెల 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

OnePlus Nord 5G: రూ.25 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ నార్డ్‌ను విడుదల చేసిన కంపెనీ, ఆగస్టు 4 నుంచి ఇండియాలో అమ్మకాలు

Hazarath Reddy

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్‘నార్డ్’ (OnePlus Nord 5G) 5జీ ఫోన్ ఎట్టకేలకు ఇండియన్‌ మార్కెట్లో విడుదల అయింది. తన కొత్త మొబైల్‌ OnePlus Nord 5జీ ఫోన్ ను కంపెనీ ఇండియాలో లాంచ్‌ చేసింది. 5జీ కనెక్టివిటీ, పంచ్ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌, క్వాడ్ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా (OnePlus Nord Features) ఉన్నాయని వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది. అంతేకాదు "ఫాస్ట్ అండ్ స్మూత్" అనుభవాన్ని అందించడానికి వన్‌ప్లస్ నార్డ్‌కు దాదాపు 300 ఆప్టిమైజేషన్లను అందించినట్లు కంపెనీ పేర్కొంది.

Bitcoin Scam in Twitter: రెండు గంటలు..రూ.90ల‌క్ష‌లకు పైగా సంపాదన, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లే లక్ష్యంగా రెచ్చిపోయిన బిట్ కాయిన్ హ్యాకర్లు, చరిత్రలో చీకటి రోజని తెలిపిన ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే

Hazarath Reddy

నిన్నంతా ట్విట్టర్ హ్యాకింగ్ తో (Twitter Accounts Hack) వణికిపోయింది. అమెరికాలో రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నుల అకౌంట్లే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయారు. ధనవంతుల అకౌంట్లను హ్యాక్ (US Twitter accounts) చేసి భారీ మొత్తంలో హ్యాకర్లు సంపాదనను పోగేసుకున్నారు. హ్యాక్ అయిన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (US Former president Barack Obama), డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (Joe Biden), టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, మీడియా మొఘల్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్ (Mike Bloomberg), అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్ (Amazon CEO Jeff Bezos), మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో (Bill Gates) పాటు యాపిల్, ఉబర్‌ వంటి సంస్థల అకౌంట్లు ఉన్నాయి. నిన్న మూడు నాలుగు గంటల పాటు వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగాక్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

Advertisement
Advertisement