Technology

Jio Fiber Preview offer: కొత్త కస్టమర్లకు జియో షాక్, వారికి జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కట్, ఇప్పటికే వినియోగించుకుంటున్న వారిని పెయిడ్ ప్లాన్లకు మార్చుతున్న జియో

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) మొదట ఉచిత ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో షాక్ ఇస్తూ వచ్చింది. టారిఫ్ రేట్లను పెంచుతూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ (Jio Fiber Preview offer) ఉచితంగా వాడాలనుకునే కొత్త కస్టమర్ల(New users)కు ఝలక్ ఇచ్చింది.

Jio Free Offer: జియో యూజర్లకు మరో బంపరాఫర్, ఇకపై సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫాం కంటెంట్ ఉచితంగా వీక్షించవచ్చు, సన్ గ్రూపుతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ జియో, ఇప్పటికు డిస్నీసంస్థతో ఒప్పందం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో(Reliance Jio) యూజర్ల కోసం మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది. ఇకపై సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్ట్స్(Sun Nxt) ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌(sun nxt content)ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితం(Reliance Jio Free Offer)గా వీక్షించవచ్చు. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్

Vikas Manda

భారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ ....

Indian Army Advisory: వాట్సప్ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి, సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసిన ఇండియన్ ఆర్మీ, వాట్సప్ లో ఎటువంటి సమాచారం పంపొద్దని హెచ్చరిక

Hazarath Reddy

ఇండియాకు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్తాన్ గూఢాచారి సంస్థ (Pakistani Intelligence Operatives) ఐఎస్ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ( Indian Army) తమ సిబ్బందికి కీలక సూచనలను జారీ చేసింది. ఇందులో భాగంగా సత్వరమే వాట్సప్ సెట్టింగ్స్ (Whatsapp settings) మార్చుకోవాలని సూచించింది.

Advertisement

Redmi Note 7S Explodes: పేలిన రెడ్‌మీ నోట్ 7ఎస్, కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలిందన్న కస్టమర్ కేర్, కనీసం ఛార్జింగ్ కూడా పెట్టలేదన్న కస్టమర్

Hazarath Reddy

చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటిదే మరొక ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

Vikas Manda

2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు....

Realme Smartphones: రియల్‌మి నుంచి ప్రీమియం రేంజ్‌లో 'రియల్‌మి ఎక్స్ 2 ప్రో' మరియు బడ్జెట్‌లో 'రియల్‌మి 5 ఎస్' స్మార్ట్‌ఫోన్లు విడుదల, వీటి ధరలు, ఫీచర్లు మరియు ఇతర విశేషాలు తెలుసుకోండి

Vikas Manda

బడ్జెట్ ధరలో 'రియల్‌మి 5 ఎస్' (Realme 5s) అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేశారు. రియల్‌మి 5 ఎస్, 4 జీబీ, 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 9,999కి లభిస్తుండగా....

Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

Hazarath Reddy

గత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Advertisement

Reliance Jio Call Rates: జియో యూజర్లకు ముకేష్ అంబానీ ఝలక్, త్వరలోనే ఛార్జీల పెంపు, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే, పెరుగుదల ఎంతనేది సస్పెన్స్..

Hazarath Reddy

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ రిలయన్స్‌ జియో(Reliance Jio) త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్‌ ఫోన్‌ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని (Reliance Jio to raise prices) ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Mobile Tariff Hike: వినియోగదారులకు షాకిచ్చిన టెల్కోలు, డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు, ఇప్పటికే కాల్ రేట్లు వసూలు చేస్తున్న రిలయన్స్ జియో

Hazarath Reddy

టెలికామ్ వినియోగదారులకు వోడాఫోన్-ఐడియా (Vodafone-Idea), ఎయిర్‌టెల్ (Airtel) సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 1 నుండి మొబైల్ సేవా రేట్లను పెంచనున్నామని (Mobile call, data to cost more) ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ టెలికాం కంపెనీలు మొబైల్ సర్వీసు రేట్లను డిసెంబర్ 1 నుంచి పెంచాలని నిర్ణయించాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Panason Eluga Ray 810: ఆకర్శణీయమైన ఫీచర్లతో పానసోనిక్ ఎలుగా రే 810 భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర రూ. 16,990/-, ఈ ఫోన్‌‌కు సంబంధించిన విశేషాలు

Vikas Manda

16MP + 2MP డ్యూయల్ వెనక కెమెరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమెరాతో పాటు రెండు వైపులా ఫ్లాష్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 6.2-అంగుళాల HD + (720 x 1500 పిక్సెల్స్) తో అంచుల వరకూ కనిపించే 'నాచ్' డిస్ల్పే....

Aadhaar Card: కేవైసీ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, వలసదారులకు ఊరట, ఇకపై వలసదారులు ఎక్కడినుంచైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు

Hazarath Reddy

మీరు వలసదారులా.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే మీకోసం ప్రభుత్వం శుభవార్తను తీసుకువచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంతోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.

Advertisement

ISRO Chandrayaan-3: చంద్రయాన్-3 వచ్చేస్తోంది, ఈ సారి గురి తప్పదు, సాఫ్ట్ ల్యాడింగ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో, వచ్చే ఏడాది చివరలో ప్రయోగం ఉండే అవకాశం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయిన్-3ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాడింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. నాసా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొనలేకపోయారు.

IRCTC New Rule: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త, అమల్లోకి ఓటీపీ ఆధారిత టిక్కెట్‌ రద్దు విధానం, రీఫండ్ వివరాలు నేరుగా మీ మొబైల్‌‌కే, ఏజెంట్ల మోసాలకు ఇకపై అడ్డుకట్ట

Hazarath Reddy

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (Indian Railways and Indian Railways Catering And Tourism Corporation) ప్రయాణికులకు శుభవార్తను అందించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఏజెంట్ల ద్వారా బుకింగ్‌ అయిన టిక్కెట్లను వివిధ కారణాలతో రద్దు చేసుకొన్నప్పుడు రీఫండ్‌ నగదు ఎంత అనేది ప్రయాణికుడికి తెలిసిపోతుంది.

TRAI MNP's New Rule: మొబైల్ వినియోగదారులకు శుభవార్త, ఎంఎన్‌పీ ఇకపై రెండు రొజుల్లోనే పూర్తి, డిసెంబర్ 16వ తేదీ నుంచి అమల్లోకి, ట్రాయ్ ప్రకటనలో వెల్లడి

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ (TRAI) శుభవార్తను అందించింది. ఇకపై ఎంఎన్‌పీ( Mobile Number Portability) ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతోంది.

Reliance Jio Good News: కేబుల్ కనెక్షన్ లేకుండా 150 ఛానళ్లు చూడొచ్చు, జియో సెటప్ బాక్స్‌లో ఆఫర్, జియో సెట్ టాప్ బాక్స్‌లో ప్రత్యేకంగా జియో టీవీ+ యాప్

Hazarath Reddy

న వినియోగదారులకు సెట్ టాప్ బాక్సు(Jio Set-top Box)లను పంపిణీ చేయడం ప్రారంభించింది.ట్రయల్ పీరియడ్ ముగిసి జియో సర్వీసులకు నగదు చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి కంపెనీ సెట్ టాప్ బాక్సులను అందిస్తోంది.

Advertisement

AP Sand Online Booking Process: ఇకపై ఇసుక కొరత తీరినట్లే, ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ, బుకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.

Reliance Jio: యూజర్లకు జియో ఝలక్, రూ.149 ప్లాన్‌లో స్వల్ప మార్పులు, ఇకపై వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే, మిగతా ప్రయోజనాలు యథాతథం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.149 ప్లాన్ బెనిఫిట్స్‌కు పలు మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి.

Nokia Smart TVs: నోకియా నుంచి స్మార్ట్‌టీవీలు,ఇండియాలో విడుదల చేయనున్న ఫ్లిప్‌కార్ట్, అదిరిపోయే ఫీచర్లతో ఇతర స్మార్ట్‌టీవీలకు పోటీ ఇవ్వనున్న నోకియా

Hazarath Reddy

ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ( e-commerce major Flipkart) ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియా(Nokia)తో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి ఇండియా(India)లో లాంచ్ చేయ‌నుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది.

Airtel RS.4 Lakh Insurance Plan: ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఎయిర్‌టెల్ బంపరాఫర్, రూ.599 ప్లాన్‌ మీద రూ.4 లక్షల బీమా సౌకర్యం, భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం, ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

భారతి ఎయిర్‌టెల్‌ (Airtel) తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల (prepaid plan Users) కోసం బంపర్‌ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్‌ (Rs 599 prepaid plan) రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(Bharti AXA Life Insurance)తో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement
Advertisement