ప్రపంచం
MLA Blows Flying Kiss To Speaker: స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, కృతజ్ఙతతోనే ఇలా చేశానని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..
Hazarath Reddyఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు(Odisha Assembly) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో(Speaker Surjya Narayan Patro)కు చిత్రమైన అనుభవం ఎదురయింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి (Congress MLA Taraprasad Bahinipati) తన నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తుండగా స్పీకర్ ఆయన్నిప్రశంసించారు.
One Nation-One Pay Day: ఇక జీతాల ఆలస్యం జరగదు, దేశమంతటా ఉద్యోగస్తులందరికీ ఒకే రోజు జీతాలు చెల్లించేలా 'ఒకే దేశం- ఒకే రోజున వేతనం' పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కార్
Vikas Mandaదేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డ్ విధానాన్ని కూడా అమలు చేసే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా గల 23 కోట్ల మంది రేషన్ కార్డు దారులందరికీ లబ్ది చేకూరేలా జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా....
KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2
Hazarath Reddyవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.
Sanjay Raut: దూకుడు పెంచిన సంజయ్ రౌత్, రైతుల సమస్యలతో ప్రధాని వద్దకు.., శరద్ పవార్ పై మాకు అనుమానమే లేదు, డిసెంబర్ మొదటివారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాలు కొత్త కొత్త సస్పెన్స్‌లకు చోటు ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 28 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. నవంబర్‌ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.
Mamata Banerjee vs Asaduddin: బెంగాల్‌లో తీవ్రవాదులుగా మారుతున్న మైనారిటీలు, సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దీదీ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్ర‌వాదం పుట్టుకువ‌స్తోంద‌న్నారు.
Agra To Be Called Agravan?: ఆగ్రా పేరు మళ్లీ మారబోతుందా?, అగ్రావన్‌గా మార్చాలంటూ అంబేడ్కర్‌ వర్సిటీకి లేఖ రాసిన యోగీ ప్రభుత్వం, ఇప్పటికే పేర్లు మార్చుకున్న అలహాబాద్‌, ఫైజాబాద్
Hazarath Reddyదేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Yogi Adityanath government)అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆగ్రా (AGRA) కూడా చేరనుంది.
Vizag Man Arrested In Pakistan: ప్రేమ విఫలం, పాకిస్థాన్‌లో ప్రత్యక్షం. ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ పోలీసులు, అందులో ఒకరు విశాఖ వాసిగా గుర్తింపు
Vikas Mandaబాబూరావు కుటుంబం 5 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వాడు. అయితే రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. దీనిపై ఏప్రిల్ 29, 2017న బాబూరావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు....
Onions Price @ Rs.220: కిలో ఉల్లి ధర రూ. 220, బంగ్లాదేశ్‌లో కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి, ధరల పెరుగుదలతో వాడకాన్ని ఆపేసిన బంగ్లా ప్రధాని హసీనా, పలుచోట్ల వినియోగదారులు ఆందోళన
Hazarath Reddyఆనియన్ ధరలు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది.
International Men's Day: మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి
Vikas Mandaసమాజంలో మగవారు నిర్వహించే కుటుంబ బాధ్యత, కుటుంబ సభ్యుల పోషణ మరియు వారి సంరక్షణ కోసం మగవారు చేసే కృషిని, త్యాగాలను గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం ....
Cartosat-3: ఉగ్ర కదలికలను పసిగట్టనున్న కార్టోశాట్-3, చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో ప్రయోగం, దీంతో పాటుగా కక్ష్యలోకి మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ు, నవంబర్ 25న అమెరికా నుంచి ప్రయోగం
Hazarath Reddyచంద్రయాన్-2 ప్రయోగం తరువాత భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.
Rajinikanth VS CM K Palaniswami: రేపు సీఎం ఎవరైనా కావచ్చు, తమిళనాడు సీఎం ఎడపాటి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రజినీకాంత్, మరో శివాజీ గణేశన్‌లా తలైవార్ మిగిలిపోతారన్న తమిళనాడు సీఎం
Hazarath Reddyతమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె పళనిస్వామి(Palaniswami) వ్యాఖ్యలకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కౌంటర్ వేశారు. రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని తమిళనాడు సీఎం ఎడపాడి (Tamil Nadu Chief Minister K Palaniswami) వ్యాఖ్యానించిన సంగతి విదితమే.
Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స, అధ్యక్ష పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో గోటబయ సారత్యంలోని ఎస్‌ఎల్‌పిపి పార్టీ ఘన విజయం
Vikas Mandaఅధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన గోటబయ గతంలో రిటైర్డ్ సైనికుడు. తన అన్నయ్య మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న (2005-2015) కాలంలో ఆయన శ్రీలంక రక్షణ మంత్రి పదవిని చేపట్టారు. కాగా, ప్రస్తుతం...
Abdul Jabbar Passes Away: భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత, తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు, ఆయన వైద్య ఖర్చులను భరిస్తామన్న కాంగ్రెస్, అంతలోనే విషాదం
Hazarath Reddyభోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ కిరణం నేలరాలింది. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ అనారోగ్యం(Abdul Jabbar passes away)తో మరణించారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Earthquake In Nicobar Islands: నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైన భూకంప తీవ్రత, భయాందోళనకు గురయిన ప్రజలు
Hazarath Reddyబంగాళాఖాతానికి దక్షిణాన హిందూ మహసముద్రంలో ఉన్న నికోబార్ దీవుల్లో శుక్రవారం భూప్రకంపనలు (major earthquake) సంభవించాయి. నికోబార్ దీవుల్లో(Nicobar Islands region) గురువారం అర్దరాత్రి దాటాక భూమి ప్రకంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. నికోబార్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు( India Meteorological Department) చెప్పారు.
Musharraf Says ‘Laden Our Hero’: పాక్ ప్రజలకు ఒసామా బిన్ లాడెన్ హీరో, సంచలన వ్యాఖ్యలు చేసిన పర్వేజ్ ముషారఫ్, భారత్ సైన్యంపై పోరాట కోసం పాక్‌లో శిక్షణ పొందిన కశ్మీరీలు, వీడియో విడుదల చేసిన పాక్ నేత
Hazarath Reddyపాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ మరోసారి తన బుద్ధిని చూపించారు. కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తమ హీరో అని పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్‌ వైఖరిని ఈ విధంగా ముషారఫ్‌ బహిర్గతం చేశారు.
ISRO Chandrayaan-3: చంద్రయాన్-3 వచ్చేస్తోంది, ఈ సారి గురి తప్పదు, సాఫ్ట్ ల్యాడింగ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో, వచ్చే ఏడాది చివరలో ప్రయోగం ఉండే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయిన్-3ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాడింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. నాసా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొనలేకపోయారు.
Farmers Protest In Maharashtra: మహారాష్ట్రలో రైతుల నిరసనలు, దెబ్బతిన్న పంటతో రోడ్డెక్కిన రైతులు, రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నం, రైతులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
Hazarath Reddyమహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దయనీయమవుతోంది. నిన్నటిదాకా రాజకీయాలు మహాను కుదిపేస్తూ ఇప్పుడు రైతు సమస్య ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రపతి పాలనతో ఉన్న మహారాష్ట్ర ఇప్పుడు రైతుల ధర్నాలతో దద్దరిల్లుతోంది. అక్కడ రైతులు రోడ్లెక్కారు.
Karnataka Politics: తీర్పు వచ్చిన కొద్ది గంటలకే..కాషాయం కండువా కప్పుకున్న 15 మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు
Hazarath Reddyఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించి అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది కర్ణాటక సీఎం బీఎస్ యడ్డ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Rafale Case Verdict: రాఫేల్ కేసులో కేంద్రానికి క్లీన్ చిట్, సమీక్ష పిటిషన్లన్నింటిని తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఎలాంటి అక్రమాలు జరగలేదన్న దేశ అత్యున్నత న్యాయస్థానం, రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
Hazarath Reddyగత కొంత కాలం నుంచి దేశ రాజకీయాల్లో మారు మోగుతున్న రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసు(Rafale Deal Case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) కీలక తీర్పును వెలువరించింది. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై దాఖలైన సమీక్ష పిటిషన్లన్నింటిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Sabarimala & Rafale: మూడు కీలక తీర్పులు నేడే, శబరిమల, రాఫేల్, చౌకీదార్ చోర్ హై పిటిషన్లపై తుది తీర్పు, శబరిమలలో భద్రత కట్టుదిట్టం, అందరి కళ్లు ఈ తీర్పు పైనే..
Hazarath Reddyయ తీర్పు( historic verdict on the Ayodhya )ను వెలువరించిన సుప్రీంకోర్టు (Supreme Court ) రాజ్యాంగ ధర్మాసనం నేడు మరో మూడు కీలక తీర్పులను(Sabarimala & Rafale Review Petitions) ఇవ్వనుంది. వీటిలో ఒకటి హిందువుల మత విశ్వాసానికి చెందిన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించే అంశం కాగా. మిగతా రెండు రాజకీయ దుమారం రేపిన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినవి, వీటితో పాటు రాఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని మోడీపై రాహుల్‌ చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలు. ఈ మూడు పిటిషన్లపై దేశ అత్యన్నత న్యాయస్థానం తుది తీర్పును ఇవ్వనుంది.