తాజా వార్తలు

Boxer 'Brain Dead': బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లుండి కుప్పకూలిన యువ బాక్సర్, ఆస్పత్రికి వెళితే బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు

Vikas M

బాక్సింగ్‌నే కెరీర్‌గా, ప్రాణంగా భావించిన ఓ యువ‌కుడి జీవితం విషాదంగా ముగిసింది. ఎన్నో ఆశ‌లతో బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టిన అత‌డికి అదే ఆఖ‌రి రోజు అయింది. ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్‌లు కురిపించే క్ర‌మంలో అత‌డు ఆ రింగ్‌లోనే కుప్ప‌కూలాడు.

2007 T20 World Cup: తొలి టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ భారత్ గెలిచి నేటికి 17 ఏళ్లు, జ‌య‌హో టీమిండియా అంటూ పోస్టులు పెడుతున్న నెటిజన్లు, వీడియోలు ఇవిగో..

Vikas M

2007లో ఒక ప్రయోగంగా మొదలైనది ఇప్పుడు టీ20 క్రికెట్ చరిత్రలో చాలా ముఖ్యమైన తేదీగా గుర్తుండిపోయింది. 17 సంవత్సరాల క్రితం ఇదే రోజు సెప్టెంబర్ 24న, ICC 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది.

Case against YouTuber Harsha Sai: వీడియో ఇదిగో, పెళ్లి చేసుకుంటానంటూ మోసం, యూట్యూటర్ హర్షసాయిపై యువతి పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

ప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి,ఇప్పుడు మొహం చాటేశాడని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిపై, ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Jio New Plan: జియో నుంచి అన్‌లిమిటెడ్‌ 5జీ డాటాతో సరికొత్త ప్లాన్‌, రీఛార్జ్ చేసుకున్న వారికి 98 రోజుల పాటు జియో సేవలు ఉచితం

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా, కాలింగ్‌తో కూడిన రూ.999 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలికంగా డాటా, కాలింగ్‌ను కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చింది సంస్థ.

Advertisement

Tecno POP 9 5G: రూ. 10 వేలకే టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్‌ఫోన్, అక్టోబర్ ఏడో తేదీ నుంచి ఫస్ట్ సేల్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం టెక్నో (Tecno) తన టెక్నో పాప్ 9 5జీ (Tecno Pop 9 5G) స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఎన్ఎఫ్‌సీ మద్దతుతో 48-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తోంది. రూ.499 టోకెన్ సొమ్ముతో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

Tata Nexon iCNG: నెక్సాన్‌ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌, ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) తన నెక్సాన్‌ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెక్సాన్‌ ఐసీఎన్‌జీ (Nexon iCNG) ఎస్‌యూవీ ధర రూ.8.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది.

Astrology: అక్టోబర్ 3న శని గ్రహం శతభిషా నక్షత్రంలోనికి ప్రవేశం.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహం అక్టోబర్ 3 మధ్యాహ్నం 12 గంటలకు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా 12 రాశుల పైన అనుకూల ప్రభావాలు ఉంటాయి.

Centipede Found in Dal: వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్

Hazarath Reddy

హైదరాబాద్ అబిడ్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఓ కస్టమర్ పప్పు ఆర్డర్ చేయగా, అందులో జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పప్పు తిన్న వారి పరిస్థితి ఏంటని అడిగారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

R Krishnaiah Resigns: ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య, పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా

Hazarath Reddy

వైఎస్సార్​సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు.

Tirupati Laddu Dispute: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్‌ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.

Astrology: అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

ఈ సంవత్సరం లో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తేదీన వస్తుంది. సూర్యగ్రహణం అక్టోబర్ రెండో తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 3 తెల్లవారుజామున వరకు ఉంటుంది.

Astrology: అక్టోబర్ 6 న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

అక్టోబర్ రెండున బుధాదిత్య యోగం ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు రెండు గ్రహాలు, కన్యారాశిలోకి ప్రవేశిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడు ,బుధ గ్రహ సంయోగాన్ని బుధాదిత్య యోగం అని అంటారు.

Advertisement

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.

Health Tips: ప్రతిరోజు ఎన్ని బాదం గింజలు తినాలి..ఎక్కువ తినడం వల్ల కలిగే నష్టాలు.

sajaya

డ్రై ఫ్రూట్స్ లో మొదటి స్థానంలో బాదం ఉంటుంది. బాదం పోషకాహారంలో మొదటి స్థానంలో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు నుండి మనం బయటపడవచ్చు.

‘Siddaramaiah Should Resign as CM’: ముడా స్కాం, సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలి, డిమాండ్ చేసిన కర్ణాటక బీజేపీ

Hazarath Reddy

స్థలం కేటాయింపు కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కర్ణాటక బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది.

Health Tips: ప్రయాణాలలో వాంతులతో ఇబ్బంది పడుతున్నారా..ఈ చిట్కాలతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

sajaya

కొంతమందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు, తల తిరగడం, వికారం వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు.

Advertisement

Health Tips: మీ కళ్ళు పసుపు రంగులో ఉన్నాయా..అయితే B-12 విటమిన్ లోపం కావచ్చు.

sajaya

మన శరీరానికి విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరానికి అనేక రకాలైన అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది. దీని లోపం వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి

Health Tips: ప్రతిరోజు నారింజ పండును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.

sajaya

నారింజపండు రుచికి పుల్లగా ఉంటూ ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా మన శరీరానికి ఎంతో శక్తిని అందిస్తుంది.

MUDA Land Scam: ముడా కుంభకోణంలో క‌ర్నాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌కు షాక్, విచారణకు కర్ణాటక హైకోర్టు ఆమోదం, చట్ట ప్రకారం విచారించవచ్చని తీర్పు

Hazarath Reddy

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు.ఈ కేసులో విచార‌ణ‌నను నిలిపివేయాల‌ని ఆయ‌న వేసిన పిటీష‌న్‌ను హైకోర్టు కొట్టిపారేసింది.

Hyderabad: మల్లంపేటలో దారుణం, మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లిన దొంగ, సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఏసీపీ

Hazarath Reddy

హైదరాబాద్ మల్లంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో మహిళను హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శారద (50)ను గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై నగలు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు దొంగ.

Advertisement
Advertisement