తాజా వార్తలు
Visakhapatnam: గిన్నెలు కడగలేదని కూతురుపై తల్లి దాడి, బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaవిశాఖపట్నంలో అమానుషం చోటు చేసుకుంది. గిన్నెలు కడగ లేదనే నెపంతో ఓ తల్లి దారుణానికి తెగబడింది. విశాఖపట్నం సింహాద్రి నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 సంవత్సరాల బాలికపై తన తల్లి తీవ్రంగా దాడి చేయగా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతోంది బాలిక.
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య యత్నం, ట్యాంక్ బండ్ శివ సాయంతో యువతి సేఫ్..వీడియో
Arun Charagondaహైదరాబాద్ - ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్యకు యత్నించింది మహిళ. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు.. ట్యాంక్ బండ్ శివ సహాయంతో ఆమెను బయటకుతీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Arshad Nadeem: అర్షద్ నదీమ్పై కాసుల వర్షం, ఒలింపిక్ స్వర్ణం గెలవడంతో బహుమతిగా కోట్ల రూపాయల నగదుతో పాటు కార్లు
Vikas Mఒలింపిక్స్లో పాకిస్థాన్ జెండాను సగర్వంగా ఎగురవేసిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem) స్వదేశంలో హీరో అయ్యాడు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్పై కాసుల వర్షం కురుస్తోంది.
TikTok Layoffs 2024: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన టిక్టాక్, ఎక్కడ ప్రభావితం అయ్యారంటే..
Vikas Mగ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ప్లాట్ఫారమ్ ప్రయత్నాల మధ్య టిక్టాక్ తొలగింపులు ఇప్పుడు ఆఫ్రికన్ శ్రామిక శక్తిని ప్రభావితం చేశాయి. ఈ సంవత్సరం, TikTok న్యాయ పోరాటాలు, వ్యాపార పునర్వ్యవస్థీకరణ మధ్య వందల మంది వ్యక్తులను తొలగించింది.
Salt And Sugar Contain Microplastics:షాకింగ్..మీరు వాడుతున్న ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్, సంచలన నివేదిక, ఒక్కసారి ఆలోచించండి?
Arun Charagondaవంటింట్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనవి ఒకటి ఉప్పు, మరొకటి చక్కెర. ఈ రెండు ప్రతీ మనిషి జీవితంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు, టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్న చక్కెర కావాల్సిందే. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది.
Itel A50, Itel A50C: ఐటెల్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లు, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..
Vikas Mయూనిసోక్ టీ603 ప్రాసెసర్తో వస్తున్న ఈ ఫోన్లలో 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, ఐటెల్ ఏ50 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఐ-ఫోన్లలో మాదిరిగా డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంటుంది.
Google Down: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డౌన్, జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్న నెటిజన్లు
Vikas Mప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికా సమయం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు అంతరాయం ఏర్పడింది.
India's Population: 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనున్న భారత జనాభా, విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికలో షాకింగ్ విషయాలు
Vikas Mభారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది.
Your Tongue Can Now Predict Strokes: నాలుక రంగు ఆధారంగా మీకు ఏమి వ్యాధి ఉందో వెంటనే తెలుసుకోవచ్చు, రోగ నిర్ధారణలో విప్లవాత్మక ఆవిష్కరణ
Vikas Mఒక వ్యక్తి యొక్క నాలుక రంగును విశ్లేషించడం ద్వారా, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ (MTU) మరియు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (UniSA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
Kolkata Doctor Case: సీబీఐకి బెంగాల్ డాక్టర్ అత్యాచార కేసు, సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్ కతా హైకోర్టు
Arun Charagondaబెంగాల్ వైద్య విద్యార్థి హత్యాచార కేసును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు కలకత్తా పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, దస్త్రాలన్నింటిని రేపు 10 గంటల లోపు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది
TRAI on Promotional Calls: ప్రమోషనల్ కాల్స్పై టెల్కోలకు ట్రాయ్ కీలక ఆదేశాలు, తాజా నిర్ణయంతో స్పామ్ కాల్స్ నుంచి కస్టమర్లకు ఉపశమనం
Vikas Mటెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మంగళవారం టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే అలాంటి నెంబర్ను రెండేళ్లు బ్లాక్ చేయాలని టెల్కోలను ఆదేశించింది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు పెద్ద ఎత్తున కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని పేర్కొంది.
Stree 2: అడ్వాన్స్ బుకింగ్లో రికార్డులు తిరగరాసిన స్త్రీ-2, మొదటి రోజు రూ.6.87 కోట్లు రాబట్టిన శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు మూవీ
Vikas Mఈ ఆగస్టు 15కు బాలీవుడ్లో మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు జంటగా నటించిన 'స్త్రీ-2', జాన్ అబ్రహం 'వేదా', అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే'. అయితే, అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం 'స్త్రీ-2' దూసుకెళ్తోంది. ఈ రేసులో మిగిలిన రెండు చిత్రాలను పూర్తిగా వెనక్కి నెట్టేసింది.
Independence Day 2024: ఇది 77వ లేదా 78వ స్వాతంత్ర్య దినోత్సవమా? మీ గందరగోళానికి ఇక్కడ సమాధానం ఉంది
Vikas Mస్వాతంత్ర్య దినోత్సవం 2024: పాఠశాలలు నుండి కార్యాలయాలు మరియు హౌసింగ్ సొసైటీలు, భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో దేశభక్తి ఉత్సుకతతో నిండిన సంవత్సరం ఇది.
Congress Party On Nationwide Protest: ఆగస్టు 22న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన, అదానీ కుంభకోణంలో మోడీ పాత్ర, సెబీ చీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్
Arun Charagondaఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని, సెబీ చీఫ్ మాధబి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
Astrology: ఆగస్టు 23 బహుళ చతుర్థి ఈ మూడు రాశుల వారికి అపార ధనవర్షం కురుస్తుంది..
sajayaఆగస్టు 23 న గణపతికి ఎంతో ఇష్టమైన చతుర్థి ఈరోజు వినాయకుని పూజించుకుంటే అన్ని శుభయోగాలు జరుగుతాయి. ఆగస్టు 23వ తేదీ ఉదయం10 గంటలకు మొదలవుతుంది. 24 తారీకు ఉదయం 11 గంటలకు ముగుస్తుంది.
Astrology: ఆగస్టు 16 సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ ఐదు రాశు ల వారికి నష్టాలు.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఒక బలమైన గ్రహం. ఇది ఆత్మవిశ్వాసానికి నాయకత్వ లక్షణాలకు పేరుగాంచిన గ్రహం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి సూర్యగ్రహం చాలా కారణమవుతుంది.
Fire Accident At Vishakapatnam Beach: విశాఖ బీచ్లో అగ్నిప్రమాదం, డైనో పార్కులో చెలరేగిన మంటలు, లక్షల రూపాయల ఆస్తి నష్టం
Arun Charagondaవిశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏపీ మంత్రులు, నిర్వహణ లోపంపై చర్చ
Arun Charagondaభారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్లోని 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోగా 70 ఏండ్ల డ్యామ్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Astrology: వినాయక చవితి న పుష్య యోగం, సిద్ధియోగం కలయిక.. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaభారతదేశంలో అతిపెద్ద పండుగలలో ఒకటి వినాయక చవితి ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది. సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ముఖ్యమైనది. వినాయక చవితి పండగ రవిపుష్యయాగం, సర్వాంతసిద్ధి యోగం కలిసి వస్తుంది.
Health Tips: కాల్షియం లోపం సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి తినండి చాలు మీ క్యాల్షియం లెవెల్ అమాంతం పెరుగుతాయి.
sajayaక్యాల్షియం మన శరీరానికి ఎంతో కావాల్సిన ముఖ్యమైనది. ఈ క్యాల్షియం లోపం వల్ల మనకు శరీర ఎదుగుదల ఉండదు. దీనివల్ల క్యాల్షియం లోపం వల్ల కండరాల దృఢంగా ఉండవు, ఎముకలు బలోపేతంగా ఉండవు.