తాజా వార్తలు

Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్‌ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్‌ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Vinesh Phogat Mother: వినేశ్ ఫోగట్ ఎప్పుడూ మాకు ఛాంపియనే, ప్రజల హృదయాలను గెలచుకుందన్న తల్లి ప్రేమలత

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరి అధిక బరువు కారణంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫొగట్ తల్లి ప్రేమలత స్పందించారు. వినేశ్‌ ఎప్పటికి మాకు ఛాంపియనే, ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చారన్నారు. బంగారం పతకం సాధించకపోయినా అంతకంటే ఎక్కువ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు.

Kolkata Doctor Rape-Murder: కోల్‌ కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్.. హతురాలి శరీరంలో దొరికిన ఆ 150 గ్రాములు వీర్యం కాదట.. ఫోరెన్సిక్ నిపుణులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ కథనం

Rudra

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లైంగిక దాడికి గురైన ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందంటూ ఇటీవల పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

Hyderabad Shocker: భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేసిన భర్త, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం.. కత్తితో దాడి చేశాడు ఓ శాడిస్టు భర్త. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని హుడా కాలనీలో భార్య జ్యోతి(30)ను కత్తితో పొడిచాడు భర్త. తీవ్ర గాయాలతో బాధితురాలు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Feathers in Chicken Curry: కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ లో బయటపడిన నిర్లక్ష్యం (వీడియో)

Rudra

ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేసి, జరిమానాలు వేసినా, హోటల్స్ లైసెన్స్ రద్దు చేసినా మిగతా హోటల్స్ నిర్వాహకుల తీరు మారట్లేదు.

Accident in Nirmal: ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పసిపాప సహా ముగ్గురికి తీవ్ర గాయాలు.. భైంసా పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది.

Viral Video: ముంబై - అటల్‌ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

Rudra

ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారినట్టు కనిపిస్తున్నది. చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో

Rudra

మానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు.

Advertisement

Attack on Harish Rao Office: సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్

Rudra

మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన రుణమాఫీ సవాళ్లు ఫ్లెక్సీలను దాటి దాడుల వరకూ చేరుకున్నది.

Sabarmati Express Derailed: సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం.. ఇంజిన్‌ ను ఢీకొన్న వస్తువు.. పట్టాలు తప్పిన 22 బోగీలు.. ప్రయాణికులు సేఫ్.. ట్రాక్ మీదకు ఆ మిస్టరీ వస్తువు ఎలా వచ్చింది?

Rudra

వారణాసి-అహ్మదాబాద్ మధ్య నడుస్తున్న సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ కు పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఉత్తర ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పై ఉన్న ఓ వస్తువును సబర్మతి ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఇంజిన్ ఢీకొట్టింది.

Muhammad Yunus Dials PM Modi: బంగ్లాదేశ్ లో హిందువులపై జ‌రుగుతున్న దాడులపై స్పందించిన‌ తాత్కాలిక ప్ర‌భుత్వం. దాడులు జ‌రుగ‌కుండా చూస్తాం! ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన యూనుస్ ఖాన్

VNS

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతకు అన్ని చర్యలూ చేపడతామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) భరోసా ఇచ్చారు. మహ్మద్‌ యూనస్‌ తనకు ఫోన్‌ చేసి ఈ మేరకు హామీ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ITR Refund Scam: ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేశారా? అయితే మీరు మోస‌పోయే అవ‌కాశ‌ముంది, ఆ మెసేజ్ వ‌స్తే రిస్క్ లో ప‌డ్డ‌ట్లే

VNS

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు (Tac returns) పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్‌ రీఫండ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.

Advertisement

Bengal CM Mamata Banerjee: మహిళా డాక్టర్ హత్యాచారంపై సీఎం మమతా బెనర్జీ నిరసన, నిందితులను ఉరి తీయాలని డిమాండ్

Arun Charagonda

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

Hanumakonda: అమెరికాలో మ‌రో తెలుగు యువ‌కుడు మృతి, గుండెపోటుతో మ‌ర‌ణించిన హ‌న్మ‌కొండ వ్య‌క్తి, కొద్దిరోజుల‌ క్రిత‌మే తండ్రి...ఇప్పుడు కొడుకు మ‌ర‌ణంతో విషాదం

VNS

అమెరికాలో మరో తెలుగు యువకుడు (Young Man Died) మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్‌(32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్‌ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్‌ ఉద్యోగం చేస్తున్నాడు

Rahul Gandhi Indian Citizenship Issue: రాహుల్ గాంధీ భార‌త పౌర‌సత్వాన్ని ర‌ద్దు చేయండి! కోర్టును ఆశ్ర‌యించిన బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

VNS

లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత పౌరసత్వం (citizenship) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ (BJP) నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టు కు వెళ్లారు. రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందింగా కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) కు ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

Redmi A3x: రూ. 7 వేల ధరలో రెడ్ మీ ఏ3ఎక్స్ మార్కెట్లోకి వచ్చేసింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రెడ్‌మీ (Redmi) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X) ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999 పలుకుతుంది.

Advertisement

Manu Bhaker: ఒలింపిక్స్ అల‌స‌ట నుంచి రిలాక్స్ అవుతున్న మ‌నూ భాక‌ర్, షూటింగ్ ప‌క్క‌న పెట్టి ఏం చేస్తుందో చూడండి

VNS

పారిస్ ఒలింపిక్స్‌ షూట‌ర్ మ‌ను భాక‌ర్ (Manu Bhaker) కెరీర్‌ను మ‌రో మెట్టు ఎక్కించాయి. విశ్వ క్రీడ‌ల్లో రెండు కాంస్య ప‌త‌కాల‌(Bronze Medals)తో చ‌రిత్ర సృష్టించిన ఆమె యావ‌త్ దేశం గ‌ర్వ‌ప‌డేలా చేసింది. ఒలింపిక్ విజేత‌గా స్వ‌దేశంలో అడుగుపెట్టిన మ‌ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది.

Brahma Anandam: పంచెక‌ట్టులో అదరగొడుతున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం, బ్రహ్మ ఆనందం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్

Vikas M

ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ (బ్రహ్మానందం – రాజా గౌతమ్‌) ఆన్ స్క్రీన్‌లో తాతామనవళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.

Devara Update: దేవర నుంచి భైరా గ్లింప్స్ విడుద‌ల, మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తున్న సైఫ్ అలీ ఖాన్, వీడియో ఇదిగో..

Vikas M

నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేకర్స్ సైఫ్‌కి విషెస్ తెలుపుతూ.. దేవ‌ర నుంచి భైరా గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ వీడియోలో యోధుడిలా కనిపిస్తున్న బైరా మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తునట్టుగా వీడియోలో చూపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది

Telangana LRS Scheme 2024: రుణమాఫీ తరహాలోనే ఎల్‌ఆర్‌ఎస్‌, వారికే వర్తింపు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెల్ప్‌లైన్‌లను సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ చెక్‌చేసుకోండి

Arun Charagonda

లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్(LRS)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది.

Advertisement
Advertisement