తాజా వార్తలు

Megastar Chiranjeevi: కేరళ సీఎం పినరయి విజయన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ, కేరళ వరద బాధితులకు సాయంగా రూ. కోటి చెక్ అందజేత

Arun Charagonda

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనవంతు సాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు చిరంజీవి, రామ్ చరణ్. ఈ నేపథ్యంలో స్వయంగా చెక్‌ను అందజేసేందుకు కేరళకు వచ్చారు చిరంజీవి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిశారు. అనంతరం ఆయనతో ముచ్చటించి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.

Pawan Kalyan: స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారు..?, పవన్ కామెంట్స్ బన్నీని ఉద్దేశించినవేనా?

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కర్ణాటకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.

Kancheepuram: ఇదేం చోద్యం, దేవాలయం హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో, తమిళనాడులో మండిపడుతున్న భక్తులు

Hazarath Reddy

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు.

Vinesh Phogat: పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్‌ నుండి వైదొలగగా ప్రతి ఒక్కరిని ఈ నిర్ణయం నిరాశ పర్చింది.

Advertisement

Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు

Hazarath Reddy

మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.

Pawan Kalyan on Movies: వీడియో ఇదిగో, ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యింది, టాలీవుడ్ సినిమా హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, ఆ హీరోని టార్గెట్ చేశారా..

Vikas M

సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు.

Fahadh Faasil in ‘Pushpa 2–The Rule’: పుష్ప‌-2 నుంచి అదిరిపోయే అప్‌డేట్, మాస్ లుక్‌లో అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్

Vikas M

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌-2 నుంచి తాజాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Raj Tarun Gets Anticipatory Bail: రాజ్ త‌రుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు, పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపిన తెలంగాణ‌ హైకోర్టు

Vikas M

టాలీవుడ్ న‌టుడు రాజ్ త‌రుణ్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ త‌రుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది

Advertisement

Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?

Vikas M

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు

RBI On UPI Payments: ఇకపై యూపీఐ పేమెంట్స్ రూ.5 లక్షలు,యథాతథంగా రెపో రేటు, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

Arun Charagonda

ద్రవ్య పరమతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక రేపో రేటును 6.5% వద్దనే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రోజుకు యూపీఐ పేమెంట్స్ లిమిట్ రూ.1 లక్ష మాత్రమే ఉండగా దానిని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.

Bihar Shocker: వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారీకి ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు గాయపడిన దారుణ ఘటన చోటుచేసుకుంది

Advertisement

Ola: క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్‌ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం

Vikas M

గతంలో క్విక్‌ కామర్స్‌ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్‌ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Waqf (Amendment) Bill 2024: వక్ఫ్‌ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం, విస్తృత పరిశీలన కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్లు ప్రకటన, వక్ఫ్‌ సవరణ బిల్లులో ఏముంది, ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ?

Hazarath Reddy

ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మైనారిటీ వ్యవహారాలమంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం, 1995 (2013లో సవరించిన విధంగా) కు దాదాపు 40 సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది

Andhra Pradesh Rain Update: ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Pawan Kalyan Meets CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?

Arun Charagonda

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అంతేగాదు ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కొల్పోయే పరిస్థితి వచ్చింది.

Advertisement

Telcos Disconnect 73 Lakh Mobile Connections: 73 లక్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్లు డిస్‌కనెక్ట్ చేసిన కేంద్రం, ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలని టెల్కోల‌కు డాట్ ఆదేశం

Vikas M

వివ‌రాల ధ్రువీక‌ర‌ణలో విఫ‌ల‌మైన 73 ల‌క్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డాట్‌) టెల్కోల‌ను ఆదేశించింది.

RBI: ఆర్బీఐ కీలక అప్‌డేట్, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన

Vikas M

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పన్ను చెల్లింపుల UPI పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. దీనర్థం మీరు ఇప్పుడు UPIని ఉపయోగించి పెద్ద పన్ను మొత్తాలను త్వరగా, సులభంగా చెల్లించవచ్చు.ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు.

IOA On Antim Panghal: భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఐఓఏ చర్య

Arun Charagonda

భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం.తన అక్రిడిటేషన్ సోదరికి ఇచ్చి ఒలింపిక్‌ గ్రామానికి పంపింది. ఒలింపిక్స్‌లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఐఓఏ

Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి

Hazarath Reddy

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.

Advertisement
Advertisement