తాజా వార్తలు

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కుటుంబం పుణ్యస్నానాలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు. భార్య, పిల్లలతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా కుటుంబంతో కలిసి కుంభమేళాకు విచ్చేశారు.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్‌లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబం

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు.

Advertisement

Prof GP Rajasekhar: ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను నియమించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రాజశేఖర్ ఏయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

YS Jagan: వీడియో ఇదిగో, జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి, వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం

Hazarath Reddy

తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్‌ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్‌ జగన్‌ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి

Lawyer Venugopal Rao Dies: తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు, ఆయన మృతికి సంతాపంగా అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేసిన జడ్జిలు

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు గుండెపోటుతో మరణించారు. కోర్టు నెం.21లో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తున్న న్యాయవాది పి. వేణుగోపాల్ రావు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కోర్టు గదిలో కుప్పకూలిపోయారు

Telangana: ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్, 7వ తరగతి బాలికతో వాట్సాప్ ఛాట్ చేసిన 9వ తరగతి బాలుడు, కుటుంబ సభ్యులకు భయపడి గడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య

Hazarath Reddy

రోజు మనోజ్, పల్లవితో వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు

Advertisement

Gyanesh Kumar: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌గా జ్ఞానేష్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి, జ్ఞానేష్‌కుమార్‌ పూర్తి బయోడేటా ఇదే..

Hazarath Reddy

ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హరియాణా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్‌ జోషి (1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి) నియమితులయ్యారు

Tuni Municipal Vice-Chairman Election: తుని మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నాలుగోసారి వాయిదా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడి వీడియోలు వైరల్

Hazarath Reddy

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక (Tuni Municipal Vice Chairman Election) మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో నాలుగోసారి ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.

YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా వంశీని కలిసి పరామర్శించారు.

YS Jagan Press Meet: వీడియో ఇదిగో, అధికారంలోకి వచ్చాక అందరి బట్టలు ఊడదీసి కొడతాం, కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

Hazarath Reddy

వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్‌ చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు

Advertisement

Kodali Nani: వీడియో ఇదిగో, మీడియాకి కొడాలి నాని సైటైర్, అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని ప్రశ్న

Hazarath Reddy

తాజాగా మీడియా కి కొడాలి నాని సెటైరికల్ సమాధానాలు ఇచ్చారు. అప్పుడు అంటే గవర్నమెంట్ లో ఉన్నాము యాక్టివ్‌గా ఉన్నాము. మా ఉద్యోగం పీకేశారు యాక్టివ్‌గా ఇప్పుడు ఏం చేయాలని కొడాలి నాని అన్నారు.

Kodali Nani: వీడియో ఇదిగో, విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని, అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తలకు చెక్, వల్లభనేని వంశీతో జగన్‌ ములాఖత్‌

Hazarath Reddy

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యాక కొడాలి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తల నేపథ్యంలో తాజాగా కొడాలి నాని విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని కనిపించారు. దీంతో కొడాలి నాని అభిమానులు టైగర్ ఎప్పుడూ టైగరే అంటూ పోస్టులు పెడుతున్నారు.

YS Jagan Meets Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీతో జగన్‌ ములాఖత్‌, జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా వంశీని కలిశారు. ఆయనను పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు.

1xBet: డర్బన్స్ సూపర్ జెయింట్స్‌ నుండి కేశవ్ మహారాజ్, మాథ్యూ బ్రీట్జ్‌కీ మరియు కేన్ విలియమ్సన్‌లతో లైవ్ మీట్ & గ్రీట్,పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

1xBet అనేది SA20 2025 కోసం జట్టు అధికారిక స్పాన్సర్‌ కాగా, దానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌కు చెందిన అగ్రశ్రేణి స్టార్‌లతో ఇటీవలి స్ట్రీమ్‌ను పోస్ట్ చేయగా, ఇది క్రికెట్ అభిమానులకు రుచికరమైన విందుగా మారింది.

Advertisement

Nellore DIG Kiran: వేరే మహిళతో న్యూడ్‌గా ఉన్న వీడియోలను భార్యకు పంపిన నెల్లూరు డీఐజీ కిరణ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో నెల్లూరు డీఐజీ కిరణ్ (DIG of Stamps & Registration) వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి ఈ భర్త (DIG Kiran) వేధిస్తున్నారు.

DIG Kiran: వీడియో ఇదిగో, నెల్లూరు డీఐజీ రాసలీలలను బయటపెట్టిన భార్య, మహిళతో ప్రైవేట్‌గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి పైశాచికానందం పొందిన భర్త

Hazarath Reddy

ఏపీలో డీఐజీ వికృత చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను వేరే మహిళతో ప్రైవేట్ గా ఉన్న ఫోటోలు వీడియోలు భార్యకు పంపి భర్త వేధిస్తున్నారు. వివరాల ప్రకారం...బాధితురాలు భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కిరణ్‌ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు.

Weather Forecast: ఐఎండీ అలర్ట్, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను ఉపరితల ఆవర్తనం

Hazarath Reddy

ఈశాన్య భారతదేశంతో సహా 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతం మీదుగా తుఫాను గాలుల ప్రాంతం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే ఏడు రోజులు వర్షాలు కురుస్తాయి.

Car Stunts On ORR: ఔట‌ర్ రింగు రోడ్డుపై లగ్జరీ కార్ల‌తో స్టంట్‌.. ఇద్ద‌రి అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ పై రెండు కార్ల‌తో స్టంట్ చేసిన ఇద్ద‌రు వ్య‌క్తులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement