India
Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటి అని చురకలు అంటించారు.
‘BJP MPs Pushed Me’: వీడియో ఇదిగో, బీజేపీ ఎంపీలే తనను నెట్టివేశారు, తోపులాటపై స్పందించిన రాహుల్ గాంధీ, పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారని వెల్లడి
Hazarath Reddyపార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్కర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నేడు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు.
Parliament Chaos: వీడియో ఇదిగో, పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్పుత్లకు గాయాలు, అంబేద్కర్పై అమిత్ షా చేసిన వాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి డిమాండ్
Hazarath Reddyపార్లమెంట్లోని మకర ద్వారం వద్ద .. ఇండియా కూటమి, బీజేపీ ఎంపీలు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్పుత్ గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Parliament Chaos: పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం, రాహుల్ గాంధీ తోయడంతోనే కిందపడ్డానని తెలిపిన ఒడిషా ఎంపీ
Hazarath Reddyపార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారు. ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తోపులాటలో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది
Viral Video: చెస్ నాట్యం... చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Arun Charagondaచెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు భారత క్రీడాకారుడు గుకేశ్. ఫైనల్లో ప్రత్యర్థిని గుకేశ్ ఓడించిన తీరును ఆధారంగా చేసుకుని నాట్యం చేశారు ఇద్దరు కళాకారిణులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, డోర్ బెల్ కొట్టి మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దొంగ, హైదరాబాద్లో షాకింగ్ ఘటన
Hazarath Reddyనార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షి కోట్ సన్ సిటీలో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో కాలింగ్ బెల్ కొట్టి తెరిచిన వెంటనే మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Rupee Falls to All-Time Low: డాలర్తో పోలిస్తే దారుణంగా క్షీణించిన రూపాయి విలువ, కేవలం రెండు నెలల్లోనే రూ.84 నుంచి రూ.85కు పడిపోయిన భారత కరెన్సీ
Hazarath Reddyడాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు దారుణంగా పతనమైంది. డాలర్తో పోలిస్తే తొలిసారిగా 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది
Vizag Student Dies in Canada: కెనడాలో గాజువాక విద్యార్థి అనుమానాస్పద మృతి, స్పందించిన నారా లోకేష్, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి
Hazarath Reddyవైజాగ్కు చెందిన ఓ యువకుడు కెనడాలోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైజాగ్ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన పిల్లి ఫణి కుమార్ (36) కెనడాలోని కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లయ్ చైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ప్రోగ్రామ్ను అభ్యసిస్తున్నాడు
Leopard Dies in Metlapalli: రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మృతి, గన్నవరం మండలం మెట్లపల్లిలో విషాదకర ఘటన
Hazarath Reddyకృష్ణాజిల్లా(Krishna District) కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుతపులి(Leopard) మృతి చెందింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది.
Online Betting Trap: ఆన్లైన్ బెట్టింగ్ ట్రాప్..వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఎలాంటి వేశాలు వేస్తున్నారో మీరు చూడండి..
Arun Charagondaఆన్ లైన్ బెట్టింగ్ ఫ్రాడ్పై ట్విట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శక్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండిని సూచించారు.
JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో
Arun Charagondaఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.
YouTuber Prasad Behra: లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్... షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు, అరెస్ట్
Arun Charagondaలైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు పోలీసులు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రసాద్ బేహేరాను రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు.
Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, 24 గంటలు గడవకముందే మరో విద్యార్థిని కాటు వేసిన పాము...భయాందోళనలో విద్యార్థులు
Arun Charagondaజగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం యశ్వంత్ అనే మరో విద్యార్థికి పాము కాటు వేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్నారు యశ్వంత్. వెంటనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించింది సిబ్బంది. నిన్న అఖిల్ అనే విద్యార్థికి పాముకాటు వేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అఖిల్. గతంలో ఇదే గురుకులంలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందారు.
Keerthy Suresh: మెడలో మంగళ సూత్రం..సినిమా ప్రమోషన్స్లో కీర్తి సురేష్, ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రచార కార్యక్రమంలో సందడి చేసిన కీర్తి సురేష్
Arun Charagondaఇటీవలె తన చిన నాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకుంది నటి కీర్తి సురేష్. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే తన ఫస్ట్ మూవీ 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కీర్తి. ఈ సినిమా ప్రమోషన్స్లో మోడ్రన్ డ్రెస్ ధరించి, మెడలో మంగళ సూత్రంతో హాజరయ్యారు కీర్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Andhra Pradesh: జనసేన నేత పుట్టినరోజు వేడుకలు..రేవ్ పార్టీ, యువతుల అశ్లీల నృత్యాలు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...వీడియోలు వైరల్
Arun Charagondaజనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీ నిర్వహించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు వైరల్గా మారాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర..జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పార్టీ నిర్వహించారు.
Telangana High Court: అధికారులకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, స్టే ఆర్డర్ ఉన్న ఇంటిని కూల్చేయడంపై ఆగ్రహం..అధికారుల సొంత ఖర్చులతో తిరిగి కట్టించాలని ఆదేశం
Arun Charagondaతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఇంటిని, హోటల్ని కూల్చేశారు అధికారులు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధికారుల సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Balagam Mogilaiah: బలగం మూవీ నటుడు మొగిలయ్య కన్నుమూత, కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య...స్వగ్రామంలో జరగనున్న అంత్యక్రియలు
Arun Charagondaబలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మొగులయ్య..ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రం. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
Hyderabad: వనస్థలిపురంలో షాకింగ్ సంఘటన, కారులో మహిళ ఆత్మహత్య, పురుగుల మందు తాగి సూసైడ్...పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు
Arun Charagondaవనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్నారు రామకృష్ణారెడ్డి, ఉమాశ్రీ దంపతులు. తమ కారులో కూర్చుని పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది ఉమాశ్రీ. ఉమాశ్రీ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోదరుడు.