India

Balineni Srinivasa Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రా

Hazarath Reddy

అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ స్టాండలోన్‌ రుణాల (standalone external debt)ను భారీగా తగ్గించుకుంది. మొత్తం రుణాలను రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, రాహుల కలయిక వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఈ రెండిటి కలయిక వల్ల కొన్ని సార్లు గందరగోళం ఏర్పడుతుంది.

New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కోవిడ్-19 వైరస్ కాలానుగుణంగా అనేక విధాలుగా రూపాంతరం చెంది, వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా వ్యాపిస్తోంది. తాజాగా, కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇది 27 దేశాలకు పాకడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం. ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది.

CM Revanth Reddy On MSME Policy: ఎంఎస్‌ఎంఈలు బలపడితేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర సంపద పెంపొందించాలనే ఈ కొత్త పాలసీని రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. MSME పాలసీ - 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్...సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు...అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

Asteology: సెప్టెంబర్ 20 నుండి సూర్యుడు,కేతు గ్రహాలు కన్యారాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి ప్రయోజనం.

sajaya

గ్రహాలకు రాజు అయిన సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ 20న సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ రెండు గ్రహాలు కూడా సెప్టెంబర్ 20 ఉదయం 8 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశం.

Congress Manifesto For Haryana Elections: ఏడు గ్యారెంటీలతో హర్యానా కాంగ్రెస్ మేనిఫెస్టో, 2 లక్షల ఉద్యోగాలు, 6 వేల పెన్షన్ ప్రకటించిన మల్లికార్జున ఖర్గే

Arun Charagonda

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను రూపొందించగా ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు, 6 వేల పెన్షన్‌, మహిళలకు రూ. 2 వేల రూపాయలు అనౌన్స్‌చేశారు.

Advertisement

Ganesh Visarjan 2024: చార్మినార్ వద్ద బురఖాతో యువతి, అసలు నిజం ఇదిగో, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి చార్మినార్ వద్దకు వచ్చిన హిందూ అమ్మాయి

Hazarath Reddy

మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన విద్వేషానికి గురైన యువతి, యువకుడును హైదరాబాద్ పోలీసులు రక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హిందూ అమ్మాయి చార్మినార్ వద్దకు వచ్చింది, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి హిందూ అబ్బాయితో కలిసి వచ్చింది

Jani Master Case: జానీ మాస్టర్‌ వేధింపుల అంశం లవ్‌ జిహాద్‌కు సంబంధించిన కేసు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్‌ చేశారు.

Jammu Kashmir: కిష్ట్‌వార్‌లోని పోలింగ్ స్టేష‌న్‌లో ఉద్రిక్త‌త‌, గుర్తింపు కార్డు లేకుండా వచ్చిన వ్యక్తి, గందరగోళం నెలకొనడంతో కాసేపు పోలింగ్‌కు బ్రేక్

Arun Charagonda

జమ్మూ కశ్మీర్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.47 శాతం ఓటింగ్ జరుగగా కిష్ట్‌వార్‌లోని పోలింగ్ స్టేషన్‌లో కాసేపు పోలింగ్ నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్య‌క్తి పోలింగ్ స్టేష‌న్‌కు రాగా గందరగోళం నెలకొనడంతో కాసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు.

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు

Hazarath Reddy

లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఒకే షెడ్యూల్‌కు సమకాలీకరించే లక్ష్యంతో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' ప్రతిపాదనకు మోడీ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది.

Advertisement

Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.

sajaya

చాలామంది పిల్లలకు ఎక్కువ పంచదార ఉన్న ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి.

Telangana High Court On BRS Office: బీఆర్ఎస్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చాల్సిందేనని ఆదేశాలు, ఫైన్ కూడా విధించిన న్యాయస్థానం

Arun Charagonda

నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు నోటీసులు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు.

AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ గీత కార్మికులకు (Geetha workers) ప్రభుత్వం గుడ్‌న్యూస్‌(Good News) చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్‌ కమిటీ వెల్లడించింది.

Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు ప్రతి ఇంటికి రూ. 25 వేలు పరిహారం, చంద్రబాబు ప్రకటించిన పరిహారం పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

విజయవాడలో వరదలకు పూర్తిగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ. 25 వేలు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Advertisement

Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు ఎంతో మంచిది.. మీ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తాయి.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వీరి షుగర్ లెవెల్ పెరుగుతుందని తీసుకునే ప్రతి ఆహ్వానం పైన చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.

sajaya

కొంతమంది మహిళల్లో అవాంఛిత రోమాలు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మీరు అనేక రకాలుగా ఆ రోమాలను తీస్తూ ఉంటారు.

Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇది మన శరీరంలో ఉన్న కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కీళ్ల చుట్టూ ఉండే పొరల పైన దాడి చేసి వాపుకి నొప్పికి కారణం అవుతుంది.

IPS Trainees To Telugu States: ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించిన కేంద్రం, లిస్ట్ ఇదే!

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్రం. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు) కేటాయించగా తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్‌ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్‌)ను కేటాయించింది.

Advertisement
Advertisement