India
Jio New Recharge Plan: రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ఇదిగో, రూ. 189 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రిలయన్స్ జియో అందించే ప్రయోజనాలపై ఓ లుక్కేసుకోండి
Vikas Mరిలయన్స్ జియో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను తాజాగా ప్రకటించింది.ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది.
Mallareddy Funny Video: మల్లారెడ్డి - ఈటల రాజేందర్ ఫన్నీ సంభాషణ, ఫోటోలు మంచిగ రావాలని కామెంట్, ఈటలపై సరదా జోకులు...వీడియో
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కీసర ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈటల, మల్లారెడ్డి.
World Test Championship 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసులోకి బంగ్లాదేశ్, ఆ మూడు టీంలకు సవాల్ విసిరేందుకు రెడీ అయిన డార్క్ హార్స్
Vikas Mపాకిస్థాన్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి విదితమే. ఈ రేసులో ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు బంగ్లా సిద్దమైంది.
Health TIPS: మీ ఆయుష్షు పెరగాలంటే వారానికి ఎన్ని అడుగులు నడిస్తే సరిపోతుంది.
sajayaఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరం చురుకుగా ఉండాలి, జబ్బులు రాకుండా ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే మనము కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే
Sonu Sood: తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్, మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందిస్తామని ప్రకటన
Vikas Mఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్ను ఇచ్చారు.
Health Tips: మీరు వాడుతున్న తేనె కల్తీ దా నిజమైన తేనా గుర్తించడానికి ఇంట్లో తెలుసుకునే పరీక్షలు
sajayaఈరోజుల్లో చాలామంది తమ ఆహార పదార్థాలలో తేనెను భాగం చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో మనం తేనె కొన్నప్పుడు అది కల్తీదా, నిజమైనదా అనేది మనం తెలుసుకోలేము. దీనివల్ల అనేక రకాలైనఅనారోగ్య సమస్యలు వస్తాయి.
Paris Paralympics 2024: పారాలింపిక్స్, భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల షాట్పుట్ ఎఫ్46లో పతకం గెలిచిన సచిన్ సర్జేరావు ఖిలారీ
Vikas Mపారాలింపిక్స్లో భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్పుట్ ఎఫ్46లో ప్రపంచ ఛాంపియన్ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఈ పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కిది 11వ పతకం.ఇప్పటిరవకు పారిస్ గేమ్స్ లో భారత్ కు 21 పతకాలు లభించాయి.
Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, రాహుల్ గాంధీతో వినేశ్ ఫోగాట్ భేటీ
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన స్టార్ అథ్లెట్, రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి
Health Tips: యాలకుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..భోజనం తర్వాత రెండు యాలకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
sajayaయాలకులు మంచి సువాసనతో కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఒక మసాలా దినుసు. ఇది గుండె జబ్బులు, కడుపు సమస్యలను, ఎసిడిటీ, అజీర్ణం ఇన్ఫెక్షన్ల సమస్యల నుండి బయట పడేందుకు సహాయపడుతుంది.
Health Tips: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా..పాలతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకోండి.
sajayaపాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా వేగంగా బరువు పెరగతారు. అయితే పాలతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
Harishrao On Khammam Floods: ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం, ఎంపీ - ఎమ్మెల్యే- ఎమ్మెల్సీల ఒక నెల జీతం విరాళం ప్రకటించిన హరీశ్ రావు
Arun Charagondaఖమ్మం వరద బాధితులకు అండగా నిలిచింది బీఆర్ఎస్. వరద బాధితులను ఆదుకోవాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు.
Telangana Horror: మెదక్ జిల్లాలో దారుణం, దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు మీద వేశారని ముగ్గురిపై గ్రామస్తులు విచక్షణారహితంగా దాడి, ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణ మెదక్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో రాములు అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలపై గ్రామస్తుల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాములు మృతి చెందగా మరో ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
DSP Gayatri Attacked: వీడియో ఇదిగో, మహిళా DSP జుట్టు పట్టుకుని కొట్టిన నిరసనకారులు, తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘటన
Hazarath Reddyసెప్టెంబరు 3, మంగళవారం జరిగిన ఆందోళనకర సంఘటనలో, తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఒక లేడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) మీద నిరసనకారులు దాడి చేశారు. అరుప్పుక్కోటై సమీపంలో డ్రైవర్ హత్యకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు.
Gujarat Rains: గుజరాత్ని ముంచెత్తిన వర్షాలు, నీట మునిగిన పలు గ్రామాలు..వీడియో వైరల్
Arun Charagondaభారీ వర్షాలు గుజరాత్ని ముంచెత్తాయి. ఎడతెరపి లేని వర్షాలతో పలు గ్రామాలు నీట మునగగా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గుజరాత్ విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Andhra Pradesh Rains: వరదలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 మంది మృతి, 6,44,536 మందిపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు, 2.34 లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం
Hazarath Reddyఏపీలో భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా బెజవాడ వాసులను బెంబేలెత్తించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
IMD Weather Alert: విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు (IMD Weather Alert) అంచనా వేస్తోంది.
Jammu and Kashmir Elections: జమ్మూ కశ్మీర్ ఎన్నికల రణక్షేత్రం, మోడీ వర్సెస్ రాహుల్..హోరెత్తనున్న ప్రచారం, అగ్రనేతల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు!
Arun Charagondaపదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి ఈ ఎన్నికలు కీలకం కాగా స్థానిక ప్రాంతీయ పార్టీల నుండి గట్టిపోటీ తప్పేలా కనిపించడం లేదు.
Telangana Floods: వీడియో ఇదిగో, తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించలేం, రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyకేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
Air India Plane Bomb Scare: విమానాలకు ఆగని బాంబు బెదిరింపు కాల్స్, విశాఖకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్, తీరా చూస్తే..
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీ నుంచి 107 మంది ప్రయాణికులతో విశాఖపట్నం (Delhi To izag flight) వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.మంగళవారం అర్ధరాత్రి ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరింది.
Explosion In Srisailam Power House: శ్రీశైలం పవర్ హౌస్లో భారీ పేలుడు, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి..వీడియో
Arun Charagondaశ్రీశైలం పవర్ హౌస్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఏడో నంబర్ యూనిట్లో నిలిచిపోయింది విద్యుత్ ఉత్పత్తి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.