India

Cockroach Found in Dosa: బాబోయ్..దోసలో మాడిపోయిన బొద్దింక, తినడానికి రెడీ ఒక్కసారిగా షాకయిన కస్టమర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Nepal Road Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా, కొండల ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 14 మంది మృతి, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న అన్వేషణ

Hazarath Reddy

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు (యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్‌ (Nepal) లోని తానాహున్‌ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది.

Sebi Bans Anil Ambani: అనిల్ అంబానికి షాకిచ్చిన సెబీ, ఐదేళ్ల బ్యాన్-25 కోట్ల ఫైన్, అనిల్‌కు చెందిన 24 కంపెనీలపై నిషేధం

Arun Charagonda

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానికి షాకిచ్చింది స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ). అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ అక్రమాలపై కొరడా ఝళిపించింది. అనిల్ కి చెందిన 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు ట్రేడింగ్ నిషేధం విధించడంతో పాటు రూ.25 కోట్ల జరిమానా విధించింది.

Supreme Court On Kejriwal Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని రిలీఫ్, సీబీఐ కేసులో రాని బెయిల్, కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వాయిదా వేసిన న్యాయస్థానం

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ రాగా సీబీఐ కేసులో మాత్రం కేజ్రీకి రిలీఫ్ దక్కడం లేదు. ఉద్దేశ పూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.

Advertisement

Nepal Bus Accident: నేపాల్‌లో నదిలో పడిన బస్సు, 14 మంది మృతి, బస్సులో ఉన్న 40 మంది భారతీయులే..వీడియో

Arun Charagonda

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదిలో పడిపోయింది బస్సు. ఈ బస్సులో 40 మంది భారతీయులు ఉండగా పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. యూపీ ఎఫ్‌టీ 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

DGCA Slaps Fine of Rs 98 Lakh on Air India: ఎయిర్ ఇండియాకు భారీ షాకిచ్చిన డీజీసీఏ, అర్హత లేని సిబ్బందితో విమానాలు నడిపినందుకు రూ. 98 లక్షల పెనాల్టీ

Hazarath Reddy

తగిన అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 98 లక్షల ఆర్థిక జరిమానా విధించింది. అదనంగా, DGCA ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌కు రూ. 6 లక్షలు, డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్‌కు రూ. 3 లక్షల జరిమానా విధించింది.

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 40 మంది భారతీయ పర్యాటకులతో నదిలోకి దూసుకెళ్లిన భారత బస్సు, పలువురు మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పోఖరా నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు.

Cristiano Ronaldo Breaks YouTube Record: గంటకు కోటి, ఇప్పుడు 30 కోట్లు దాటేసిన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు, రికార్డులు బద్దలు కొడుతున్న క్రిస్టియానో రొనాల్డో

Hazarath Reddy

కేవలం 90 నిమిషాల్లోనే 10 మిలియన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ (కోటి మంది)ను దాటాడు. యూట్యూబ్‌ చరిత్రలో ఇంత వేగంగా 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్స్‌ను దాటిన చానెల్‌ మరొకటి లేదు. దీంతో యూట్యూబ్‌ అతడికి ‘గోల్డెన్‌ బటన్‌’ను అందించింది.

Advertisement

YS Jagan Visits Anakapalle: అచ్యుతాపురం సెజ్ బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్, బాధితులతో మాట్లాడిన జగన్, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో ఆరా

Arun Charagonda

అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు మాజీ సీఎం జగన్. బాధితులతో మాట్లాడారు. అక్కడి డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుండి అనకాపల్లికి చేరుకున్నారు జగన్.

KL Rahul Announces Retirement ? కేఎల్ రాహుల్ రిటైర్మెంట్‌లో నిజమెంత ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, ఇంకా స్పందించని భారత జట్టు స్టార్ ప్లేయర్

Hazarath Reddy

భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది.కేఎల్ రాహుల్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు వివక్షతో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపారు.

MP Dharmapuri Aravind On KCR: కేసీఆర్‌ చచ్చినా బీజేపీలోకి రానిచ్చే ప్రసక్తేలేదు, కేటీఆర్‌- కవితలది అదే పరిస్థితి, తేల్చిచెప్పిన ఎంపీ అరవింద్..

Arun Charagonda

నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించిన ఆయన..కేసీఆర్, కేటీఆర్, కవితను చచ్చినా బీజేపీ దగ్గర్లోకి కూడా రానివ్వం అని తేల్చిచెప్పారు. వేరేటోడు ఎటు పోతే ఏంది? అని తన స్టైల్‌లో చెప్పారు.

Konda Murali Vs Baswaraj Saraiah: వరంగల్ కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విభేదాలు, కొండా వర్సెస్ సారయ్య, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సారయ్యకు కొండా సవాల్

Arun Charagonda

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారితే రాజీనామా చేసిన.. నీకు దమ్మ్మంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యకు సవాల్ విసిరారు. బస్వరాజ్ సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదని ఆరోపించారు కొండా మురళి.

Advertisement

Warangal: గన్‌పారేసుకున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, రోడ్డుపై గన్‌ని గుర్తించి కమిషనర్‌కు అందజేసిన పారిశుధ్య కార్మికుడు

Arun Charagonda

వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో ఎస్ఎల్ఆర్ఎన్ గన్ ను పారేసుకున్నాడు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డుపైన పడిపోయింది గన్. గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు.. వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు అందించారు. దీంతో తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే.

YS Jagan Gives Shock To Duvvada Srinivas: వైసీపీలో పెను మార్పులు,దువ్వాడకు షాకిచ్చిన జగన్, టెక్కలి ఇంఛార్జీగా పేరాడ తిలక్, కొత్త అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే

Arun Charagonda

ఏపీలో అధికారం కొల్పోవడంతో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చారు జగన్‌. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీగా పేరడా తిలక్‌ను నియమించారు.

Viral Video: హైదరాబాద్‌ లో వింత వర్షం.. ఒకే కాలనీలో ఒక పక్క వర్షం.. మరోవైపు పొడి వాతావరణం.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఓ కాలనీలో వర్షం పడింది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా? అయితే, ఆ కాలనీలో ఎదురుగా వర్షం పడుతున్నా అక్కడే ఉన్న స్థానికులు మాత్రం తడవలేదు.

Centre Bans 156 Cocktail Drugs: 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ మందులపై కేంద్రం నిషేధం.. కారణం ఏమిటంటే??

Rudra

జనబాహుళ్యంలో సరఫరా అవుతున్న 156 ఫిక్స్‌ డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) మందులపై కేంద్రం తాజాగా నిషేధం విధించింది.

Advertisement

CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ విగ్రహావిష్కరణకు అగ్రనేతలను పిలవనున్న కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్ ఎన్నికపై రానున్న క్లారిటీ!

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు అగ్రనేతలు

Telangana Shocker: షాకింగ్ వీడియో, ప్రేమ వ్యవహారం..ఫ్రెండ్‌ అని చూడకుండా చంపేసిన స్నేహితులు, బాలాపూర్‌లో దారుణం, ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లిబాధ వర్ణనాతీతం

Arun Charagonda

హైదరాబాద్ బాలాపూర్‌లో అమానుషం చోటు చేసుకుంది. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేశారు స్నేహితులు. బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు స్నేహితులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Anakapally Pharma Accident: అనకాపల్లిలో మరో ప్రమాదం.. పరవాడ సినర్జీస్‌ ఫార్మా లో రసాయనాలు కలుపుతుండగా ఘోరం.. నలుగురికి గాయాలు

Rudra

ఏపీలోని ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్‌ లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ సంస్థలో ఘోరం జరిగింది.

Dengue Fever: బెంగళూరును వణికిస్తున్న డెంగ్యూ.. నగరంలో వెలుగుచూసిన 10 వేలకు పైగా కేసులు

Rudra

కర్ణాటకను డెంగ్యూ వైరస్‌ వణికిస్తోంది. బెంగళూరు సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను డెంగ్యూ కమ్మేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Advertisement
Advertisement