సమాచారం
'Liquor Home Delivery': మద్యం డోర్ డెలివరీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పరిశీలించాలని కోరిన అత్యున్నత న్యాయస్థానం, మద్యం అమ్మకాల నిలిపివేతపై ఉత్తర్వులు జారీ చేయలేమన్న సుప్రీంకోర్టు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను (Alcohol Sale) నిలిపివెయ్యాలంటూ నమోదైన పిటీషన్‍‌లపై విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కావాలని కోరుకునే వినియోగదారులకు 'హోమ్ డెలివరీ' (Liquor Home Delivery)అందించేందుకు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
Maharashtra: యూనివర్సిటీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయాలని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌
Hazarath Reddyదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ (Uday Samant) ఒక ప్రకటన విడుదల చేశారు.
Maharashtra Coronavirus: ముంబైలో మే నెలంతా లాక్‌డౌన్ తప్పదా?, మహారాష్ట్రలో 557 మంది పోలీసులకు కరోనా, 18వేలు దాటిన కోవిడ్-19 కేసులు, వెల్లడించిన రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌
Hazarath Reddyదేశంలో కరోనా మహమ్మారికి మహారాష్ట్ర (Maharashtra Coronavirus) ప్రధానకేంద్రంగా మారింది . అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతూ ఆందోళన కలిగిస్తోంది.కోవిడ్ 19 పై ముందుండి పోరాడుతున్న పోలీసులు (police personnel) అదే వైరస్‌ బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ (Maharashtra Lockdown) అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 557 మంది కరోనా బాధితులుగా మారారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ (Maharashtra Home minister Anil Deshmukh) ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 1362 కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. ఇప్పటివరకు 694 మంది మరణించారు.
India Coronavirus: ముంబై సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం, 77మంది ఖైదీలకు,26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, దేశ వ్యాప్తంగా 56 వేలు దాటిన కరోనా కేసులు
Hazarath Reddyహారాష్ట్రలో (Maharashtra) 18వేలకు చేరువలో కేసులు ఉండగా కేవలం ముంబైలోనే ఈ సంఖ్య 11,300 దాటిపోయింది. అక్కడ ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబైలోని ఆర్డర్ రోడ్ సెంట్రల్ జైలును (Arthur Road Jail) కూడా కరోనా తాకింది. ఈ సెంట్రల్ జైలులో 2800 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి (Mumbai police personnel) కూడా కరోనా పాజిటివ్ రావ‌డంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
Reliance Jio-Vista Deal: విదేశీ పెట్టుబడుల్లో జియో హ్యాట్రిక్ డీల్, విస్టా ఈక్వెటీ కంపెనీకి 2.3 శాతం వాటాను అమ్మేసిన ముఖేష్ అంబానీ, డీల్ విలువ సుమారు రూ. 11,367 కోట్లు
Hazarath Reddyరిలయన్స్ జియో (Reliance Jio) విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ (Vista Equity Partners) కంపెనీతో మరో మెగా ఒప్పందానికి (Reliance Jio-Vista Deal) సన్నద్ధమైంది. కంపెనీకి ఇది విదేశీ పెట్టుబడుల్లో హ్యాట్రిక్ డీల్ అని చెప్పవచ్చు. రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియోలో 2.3 శాతం వాటా షేర్లను అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ కొన్న‌ది. దీని ద్వారా విస్టా కంపెనీ జియోలో సుమారు 11,367 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 10, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ ప్యాక్-మ్యాన్, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ప్యాక్-మ్యాన్ (2010) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Vande Bharat Mission: వందే భారత్‌ మిషన్ ప్రారంభం, 177 మందితో దేశానికి చేరుకున్న తొలి విమానం, మొత్తం 12 దేశాలకు భారత విమానాలు, రెండు దశల్లో స్వదేశానికి తరలింపు
Hazarath Reddyలాక్‌డౌన్‌ ( coronavirus Lockdown) కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్‌ మిషన్' (Vande Bharat Mission) పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో, మూడు యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. మొత్తం 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కాగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తమను ఇండియాకు (India) తీసుకుపోవాలని 3 లక్షల మంది భారతీయ వలస కార్మికులు (Indian Nationals Abroad) ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు.
Visakhapatnam Gas Leak: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు
Hazarath Reddyవిశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ( LG Polymers industry) నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Vizag Gas Leak: ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌లో (LG Polymers industry) రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) స్పందించారు. ఈ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (AP Chief Minister YS Jagan Mohan Reddy)ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చి‍నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
Global Coronavirus: 2 లక్షల అరవై వేలకు చేరువలో మృతులు, ప్రపంచవ్యాప్తంగా ముఫ్పై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు, యుకెలో 12 లక్షల దాటిన కరోనా కేసులు
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Global Coronavirus) భారీన పడి మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 2,58,974 కు చేరుకున్నాయి. కరోనావైరస్ భారీన పడిన వారి సంఖ్య (Coronavirus Global Roundup) బుధవారం నాటికి 3,667,165 గా ఉంది. రికవరి అయిన వారి సంఖ్య 1,251,032గా ఉంది. యాక్టివ్ గా ఉన్న కేసులు సంఖ్య బుధవారం సాయంత్రానికి 2,237,498గా ఉంది. ఇదిలా ఉంటే ఇటలీకు (Italy) చెందిన వైద్య సంస్థ మానవ కణాలలో కరోనావైరస్ నవలని తటస్తం చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
COVID-19 Vaccine: కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఇదేనా?, శుభవార్త చెప్పిన ఇటలీ, ఎలుకలపై కరోనా వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతమయిందని ప్రకటన, వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 (COVID-19) మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ప్రభుత్వం (Italy Govt) శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను (COVID-19 Vaccine) అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి. టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 8, నేటి గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ 2016, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyగతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ కాలక్షేపం చేయండి. హాలోవీన్ (2016) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ హాలోవీన్ (Halloween 2016), 2016లో వచ్చిన గేమ్ గురించి ఓ సారి తెలుసుకోండి. ఇప్పటిదాకా 8 గేమ్ లు వచ్చాయి. అవి వరసగా కోడింగ్, క్రికెట్, ఫిషింగర్, రాక్‌మోర్, గార్డెన్ గ్నోమ్స్, స్కోవిల్ లొటరియా, తాజాగా హాలోవీన్ . ఈ రోజు వచ్చిన హాలోవీన్ (Halloween) గేమ్ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.
Class 10 Exam 2020: దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవు, తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మాత్రమే పదవ తరగతి పరీక్షలు, వెల్లడించిన హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. 10 వతరగతి పరీక్షలు కూడా దేశ వ్యాప్తంగా వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
Telangana: 1 నుంచి 9 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేవు, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, పీజీ మెడికల్‌ సీట్ల ఫీజు పెంపు, జూలైలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తామని తెలిపిన ఎంసీఐ
Hazarath Reddyకరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ (Lockdown) నేపద్యంలో తరగతులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో తెలంగాణ సర్కారు (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిచేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు (class1-9 to next level) ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది .
Cyclone Amphan: ఏపీకి తుఫాను ముప్పు, వాయుగుండంగా మారుతోన్న అల్పపీడనం, ఎంఫాన్‌‌ తుఫాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyబంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా (South Andaman Sea) ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా (Cyclone) మారుతున్న ఈ తుఫాన్‌కి ఎంఫాన్‌ (Cyclone Amphan) అనే పేరు దీనికి పెట్టారు. ఎంఫాన్‌ తుఫాన్ ఓడిస్సా పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
COVID-19 in Indian Army: ఇండియన్ ఆర్మీలో 24 మందికి కరోనా పాజిటివ్, ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్న‌ సైనిక దళాల‌కు సోకిన వైర‌స్
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోంది. ఎవ్వరినీ వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని (Delhi) ఆర్మీ హాస్పిట‌ల్‌లో 24 మందికి క‌రోనా పాజిటివ్ (Coronavirus in Indian Army) వ‌చ్చింది. ప్ర‌స్తుతం స‌ర్వీస్‌లో ఉన్న‌, రిటైర్ అయిన వారికి కూడా వైర‌స్ సంక్ర‌మించింది. ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో (Research and Referral Hospital) ప‌నిచేస్తున్న‌ సైనిక దళాల‌కు వైర‌స్ సోకిన‌ట్లు నిర్దారించారు. అయితే వైర‌స్ సోకిన వారంద‌ర్నీ.. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీ బేస్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ జ‌ర‌గ‌లేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు.
Liquor Home Delivery: మద్యం ఇకపై డోర్ డెలివరీ, కీలక నిర్ణయం తీసుకున్న ఛత్తీస్‌గఢ్‌ సర్కారు, ఒక్కో వినియోగదారుడికి 5000 ml మద్యం, ప్రతి డెలివరీకి అదనంగా రూ.120 వసూలు
Hazarath Reddyఛత్తీస్‌ఢ్ ప్రభుత్వం (Chhattisgarh government) కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాప్‌ల వద్ద భారీ క్యూలైన్లు ఉంటే కరోనా (Coronavirus) విజృంభించే ప్రమాదముందని భావించి.. రాష్ట్రంలో లిక్కర్ హోమ్ డెలివరీ (Liquor Home Delivery) సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది.
Delhi Lockdown 3.0: ఢిల్లీలో మందుబాబులపై పూలవర్షం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆర్థిక వ్యవస్థని కాపాడేది మీరేనంటూ పూలు చల్లిన ఢిల్లీ మద్యం ప్రియుడు, వైరల్ అవుతున్న వీడియో
Hazarath Reddyఢిల్లీలో ఓ వ్యక్తి లైన్లో నిల్చున్న మందుబాబులపై పూలవర్షం (A man showers flower petals on people) కురిపించాడు. మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ అక్కడ లైన్లో మందు కోసం నిల్చున్న మందుబాబులపై ఓ వ్యక్తి పూల వర్షం కురిపించాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్‌ నగర్‌లోని (Chander Nagar area of Delhi) ఓ వైన్‌ షాప్‌ ఎదుట భారీ లైన్‌లో నిల్చున్న మందుబాబులపై ఆయన పూల రేకులను చల్లుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఇలాం ఉంటే మిర్జాపూర్‌లో భారీ లైన్లలో లిక్కర్‌ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై ఓ లిక్కర్‌ షాప్‌ యజమాని ఇలానే పూలు చల్లాడు.
Indian Nationals Stranded Abroad: విదేశాల్లో భారతీయులు విలవిల, మే 7 నుంచి దశల వారీగా విమానాలు,నౌకల ద్వారా స్వదేశానికి తరలింపు, 14 రోజులపాటు పేమెంట్‌ ప్రాతిపదికన క్వారంటైన్‌లోకి..
Hazarath Reddyకోవిడ్‌-19 లాక్‌డౌన్‌లతో (Covid-19 Lockdown) విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను (Indian Nationals Stranded Abroad) మే 7 నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఏర్పాట్లు చేస్తోంది. వీరందరినీ దశలవారీగా విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి రప్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం నిర్థిష్ట విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు దేశానికి తిరిగివచ్చే భారత పౌరుల జాబితాలను సిద్ధం చేస్తాయి. అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది.
Coronavirus in BSF: 67 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా, ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయం మూసివేత, క్వారంటైన్‌లోకి 50 మంది భద్రతా సిబ్బంది
Hazarath Reddyఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67 మంది బీఎస్ఎఫ్ ( BSF) జ‌వాన్లకు క‌రోనా పాజిటివ్ గా (Coronavirus in BSF) నిర్దార‌ణ అయింద‌ని బీఎస్ఎఫ్ ప్ర‌తినిధి ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. మే 4 వ‌ర‌కు ఈ కేసులు న‌మోదు కాగా..ఈ కేసుల్లో త్రిపుర లో 13 మంది ఉన్నారు. వీరిలో 10 మంది సరిహద్దు భద్రతా దళాల జ‌వాన్లు కాగా వారిలో ఒక జ‌వాను భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఢిల్లీలో (Delhi) అత్య‌ధికంగా 41 మంది జ‌వాన్ల‌కు (BSF jawans) క‌రోనా వ‌చ్చిన‌ట్లు తేల‌గా..కోల్ క‌తా నుంచి మ‌రో జ‌వాను ఉన్నారు. సెల‌వులో ఉన్న మ‌రో జ‌వానుకు కూడా క‌రోనా పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్లు బీఎస్ ఎఫ్ ప్ర‌తినిధి పేర్కొన్నారు.