Information

Inter Spot Valuation in TS: 20 రోజుల్లో ఇంటర్ ఫలితాలు, స్పాట్ వాల్యూయేషన్‌కు పచ్చజెండా ఊపిన తెలంగాణ హైకోర్టు, జాగ్రత్తలు పాటించాలని ఆదేశం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) ఇంటర్మీడియట్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు (Telangana High Court) అనుమతిచ్చింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఆగిపోయింది. ఇప్పుడు ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై (Inter spot valuation) సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Liquor Sale in Maharashtra: మద్యం హోం డెలివరీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి

Hazarath Reddy

మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు ( Maharashtra Govt) శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్‌ (Lockdown) అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ( Home Delivery of Alcohol) అనుమతినిచ్చింది. మే 5 నుంచి లిక్కర్‌ షాపులు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో భౌతిక దూరం ప్రధాన సమస్యగా మారింది.

Indian Railways: 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన DG RPF Arun Kumar

Hazarath Reddy

మే 12 నుంచి 15 ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు భారత రైల్వే (Indian Railways) ప్రకటించడంతో, స్టేషన్లలో ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ ( Railway Protection Force Director) జనరల్ మంగళవారం పేర్కొన్నారు. ప్రతి ప్రయాణీకుల డేటా వారి రాష్ట్ర ప్రభుత్వానికి (State Govt) అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tamil Nadu Coronavirus: ముంబై ధారావిని తలపిస్తోన్న చెన్నై కన్నాగి నగర్‌, ఒక్క రోజే 23 కోవిడ్-19 కేసులు నమోదు, తమిళనాడులో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు

Hazarath Reddy

కోవిడ్-19 వైరస్‌తో తమిళనాడు (Tamil Nadu Coronavirus) అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అక్కడ 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు (TN Corona Cases) నమోదు అయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో (Koyambedu market) చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌ తాజాగా స్లమ్‌ ఏరియా అయిన కన్నాగి నగర్‌కు వ్యాపించింది. కన్నాగి నగర్‌ ప్రస్తుతం మరో ముంబై ధారవిని తలపిస్తోంది. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

AP DGP Warning on Fake News: ఫేక్ వార్తలను నమ్మకండి, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మ వద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( AP DGP Gautam Sawang) స్పష్టం చేశారు. పోలీస్‌ హెచ్చరిక పేరుతో సోషల్‌ మీడియాలో (Social Media) వస్తున్న ఫేక్‌ పోస్టింగ్‌లపై ఆయన స్పందించారు. లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని, ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) హెచ్చరించారు.

'Lockdown 4.0': నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

దేశంలో మూడో విడత లాక్‌డౌన్‌ (Lockdown 3.0) ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ (PM Modi 5th Video Conference) ద్వారా సమావేశమయ్యారు.కరోనా కట్టడి, ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణపై ముఖ్యమంత్రులతో సమగ్రంగా చర్చించారు. కరోనా విజృంభణ తర్వాత సీఎంలతో సమావేశం కావడం ఇది ఐదోసారి.

Badrinath Temple: మే 15న తెరుచుకోనున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు, పూజారితో సహా 27 మంది మాత్ర‌మే హాజరు, కోవిడ్ 19 పరీక్షలు పూర్తి చేసుకున్న ఆలయ పూజారి

Hazarath Reddy

ఉత్త‌రాఖండ్‌లోని ప‌విత్ర పుణ్య‌క్షేత్రం అయిన బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు మే 15న (Badrinath Temple to Open Portals on May 15) తెరుచుకోనున్నాయి. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 4.30 గంట‌ల‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ఆల‌య ప్ర‌ధాన పూజారితో స‌హా 27 మంది మాత్ర‌మే హాజ‌రుకానున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అనుమ‌తి లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus Outbreak) విస్త‌రణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు ఉత్త‌రాఖండ్ (Uttarakhand) అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

IRCTC website Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్, ఒక్కసారిగి పెరిగిన ట్రాఫిక్‌తో క్రాష్ అయిన ఇండియన్ రైల్వే వెబ్‌సైట్, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

irctc.co.inలో టికెట్లు బుక్ చేసుకునే వారికి నిరాశ ఎదురయింది. అందరూ ఒక్కసారిగా టికెట్ బుకింగ్ కు సైటు ఓపెన్ చేయడంతో సర్వర్ ఒక్కసారిగా డౌన్ (IRCTC website Down) అయింది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదు చేయడానికి ట్విట్టర్‌లోకి (Twitter) వెళ్లారు. ట్విట్టర్ వేదికగా ఇండియన్ రైల్వే సైటు ఓపెన్ కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. 15 ప్యాసింజర్ రైళ్ల కోసం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో (IRCTC Website) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సాయంత్రం 4 నుంచి ప్రారంభించిన సంగతి విదితమే.

Advertisement

Indian Railways: ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం

Hazarath Reddy

దాదాపుగా నెలన్నర తరువాత ప్రయాణికుల రైళ్లు (Trains) తిరిగి పట్టాలకెక్కనున్నాయి. రేపటి నుంచి రైల్వేశాఖ (Indian Railways) త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో (Lockdown) గూడ్సు సర్వీసులు మాత్రమే కూతపెట్టగా.. రేపటి నుంచి ప్రయాణికుల రైళ్లు కూడా సేవలందించనున్నాయి.

SSC Exams in TS: కొత్త హాల్ టికెట్లు ఉండవు, తెలంగాణలో పాత హాల్ టికెట్లతోనే పదవతరగతి పరీక్షలు, క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్‌సీ బోర్డు, హైకోర్టు అనుమతి కోసం వెయిటింగ్

Hazarath Reddy

ఇప్పటికే మార్చిలో విడుదలైన పాత హాల్ టిక్కెట్లతో (Old Hall Tickets) ఎస్ఎస్సి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దీనిపై బోర్డు డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు హాజరు కావడానికి కొత్త హాల్ టికెట్లు అవసరం లేదని, దీనికి సంబంధించిన సూచనలు అధికారులకు అందజేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం కారణంగా, ఒక విద్యార్థిని మాత్రమే బెంచ్ మీద కూర్చుని పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

AP CM Review: ఏపీలో షాపుల ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్, ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

ఏపీలో లాక్‌డౌన్ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు (coronavirus prevention), లాక్‌డౌన్‌ (AP Lockdown) అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PM Modi 5th VC with CMs: ఆర్థిక పరిస్థితి సంగతేంటి, రాష్ట్రాల సీఎంలతో 3 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్‌ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వంటి అంశాలే ప్రధాన ఎజెండా

Hazarath Reddy

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన లాక్‌డౌన్ 3.0 (Lockdown 3.0) ముగియ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ (PM Modi 5th VC with CMs) ద్వారా సంభాషించనున్నారు. భ‌విష‌త్య్‌లో ఎలా ముందుకు వెళ‌దామ‌నే విష‌యంపై రాష్ట్రాల ముఖ్యమంతుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.

Advertisement

Mother's Day 2020: మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ, HD Images, Quotes & Wallpapers, Wish Happy Mother's Day With WhatsApp Stickers and GIF Greetings మీకోసం

Hazarath Reddy

అమ్మ... సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ..అటువంటి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే.

CBSE 10th, 12th Board Exam 2020: జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీలను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్ష తేదీలను (CBSE 10th, 12th Board Exam 2020) గురువారం ప్రకటించారు. జులై ఒకటి నుంచి జులై 15 వరకూ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. దేశంలో COVID-19 లాక్డౌన్ కారణంగా చాలా ఆలస్యం తరువాత ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

'Liquor Home Delivery': మద్యం డోర్ డెలివరీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పరిశీలించాలని కోరిన అత్యున్నత న్యాయస్థానం, మద్యం అమ్మకాల నిలిపివేతపై ఉత్తర్వులు జారీ చేయలేమన్న సుప్రీంకోర్టు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలను (Alcohol Sale) నిలిపివెయ్యాలంటూ నమోదైన పిటీషన్‍‌లపై విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం కావాలని కోరుకునే వినియోగదారులకు 'హోమ్ డెలివరీ' (Liquor Home Delivery)అందించేందుకు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

Maharashtra: యూనివర్సిటీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయాలని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ (Uday Samant) ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Maharashtra Coronavirus: ముంబైలో మే నెలంతా లాక్‌డౌన్ తప్పదా?, మహారాష్ట్రలో 557 మంది పోలీసులకు కరోనా, 18వేలు దాటిన కోవిడ్-19 కేసులు, వెల్లడించిన రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌

Hazarath Reddy

దేశంలో కరోనా మహమ్మారికి మహారాష్ట్ర (Maharashtra Coronavirus) ప్రధానకేంద్రంగా మారింది . అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతూ ఆందోళన కలిగిస్తోంది.కోవిడ్ 19 పై ముందుండి పోరాడుతున్న పోలీసులు (police personnel) అదే వైరస్‌ బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ (Maharashtra Lockdown) అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 557 మంది కరోనా బాధితులుగా మారారని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ (Maharashtra Home minister Anil Deshmukh) ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 1362 కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. ఇప్పటివరకు 694 మంది మరణించారు.

India Coronavirus: ముంబై సెంట్రల్ జైలులో కరోనా కల్లోలం, 77మంది ఖైదీలకు,26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, దేశ వ్యాప్తంగా 56 వేలు దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

హారాష్ట్రలో (Maharashtra) 18వేలకు చేరువలో కేసులు ఉండగా కేవలం ముంబైలోనే ఈ సంఖ్య 11,300 దాటిపోయింది. అక్కడ ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ముంబైలోని ఆర్డర్ రోడ్ సెంట్రల్ జైలును (Arthur Road Jail) కూడా కరోనా తాకింది. ఈ సెంట్రల్ జైలులో 2800 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి (Mumbai police personnel) కూడా కరోనా పాజిటివ్ రావ‌డంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

Reliance Jio-Vista Deal: విదేశీ పెట్టుబడుల్లో జియో హ్యాట్రిక్ డీల్, విస్టా ఈక్వెటీ కంపెనీకి 2.3 శాతం వాటాను అమ్మేసిన ముఖేష్ అంబానీ, డీల్ విలువ సుమారు రూ. 11,367 కోట్లు

Hazarath Reddy

రిలయన్స్ జియో (Reliance Jio) విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్‌ (Vista Equity Partners) కంపెనీతో మరో మెగా ఒప్పందానికి (Reliance Jio-Vista Deal) సన్నద్ధమైంది. కంపెనీకి ఇది విదేశీ పెట్టుబడుల్లో హ్యాట్రిక్ డీల్ అని చెప్పవచ్చు. రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కు చెందిన రిల‌య‌న్స్ జియోలో 2.3 శాతం వాటా షేర్లను అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ కొన్న‌ది. దీని ద్వారా విస్టా కంపెనీ జియోలో సుమారు 11,367 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది.

Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు 10, ఈ రోజు గూగుల్ డూడుల్ గేమ్ ప్యాక్-మ్యాన్, ఈ గేమ్ గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

గతంలో జనాదరణ పొందిన Google డూడుల్‌లతో ఆడుతూ ఉండండి. ప్యాక్-మ్యాన్ (2010) గేమ్‌ను ఈ రోజు డూడుల్‌ కింద గూగుల్ అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ డూడుల్ (Google Doodle) ద్వారా ఇలాంటి ప్రత్యేక గేమ్ లను (Google Doodle Games) యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Advertisement
Advertisement