సమాచారం

Facebook-Reliance Jio Deal: జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్‌, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీగా పెట్టుబడి (Facebook-Jio Deal) పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ (Facebook) బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో (Reliance Jio) 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినట్లయింది. తద్వారా ఫేస్‌బుక్‌​ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది.

Odisha Coronavirus: కరోనా పోరులో వైద్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు, కీలక నిర్ణయం తీసుకున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం, చనిపోయిన వైద్య సిబ్బందికి అమరవీరుల గుర్తింపు హోదా

Hazarath Reddy

కరోనావైరస్ కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం (CM Naveen Patnaik) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 (COVID-19) పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం (Odisha announces Rs 50 lakh) అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం పట్నాయక్‌ ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

New Judges for AP & TS High Court: ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం, వీరిలో ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు (New Judges in AP & TS) రానున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టుకు (Telangana High Court) ఒక జడ్జీ రానున్నారు.

Lockdown Rules Violation: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, రాష్ట్రాలపై సీరియస్ అయిన హోంశాఖ, లాక్‌డౌన్ సడలింపు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమంటూ హెచ్చరిక

Hazarath Reddy

కరోనావైరస్ నియంత్రణ కోసం దేశ‌వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రెండోసారి విధించిన‌ లాక్‌డౌన్‌ను (Nationwide Lockdown) ప‌లు రాష్ట్రాలు క‌ఠినంగా అమ‌లు చ‌ేయ‌కపోవ‌డంపై కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత్య‌వ‌సరం కాని సేవ‌ల‌కు అనుమ‌తినిస్తూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంపై మండిప‌డింది. ఇలాంటి తొందరపాటు చ‌ర్య‌ల వ‌ల్ల క‌రోనా (Coronavirus) విజృంభించే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి (MHA Warns to States) అజ‌య్ భ‌ల్ల సోమ‌వారం లేఖ రాశారు.

Advertisement

Telangana e-Pass Apply Online: తెలంగాణ లాక్‌డౌన్‌, ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోమంటున్న పోలీసు శాఖ, పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ అంజనీ కుమార్

Hazarath Reddy

లాక్‌డౌన్‌లో (Lockdown)అత్యవసర సేవలు సేవల కోసం పోలీసులు ఈ-పాస్ (Telangana e-Pass)జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (HYD CP Anjani Kumar) తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది. అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్‌ లభిస్తుందని సీపీ చెప్పారు.

PM Phone Call to AP CM: ఏపీ సీఎంకు ప్రధాని ఫోన్, కరోనా నివారణ చర్యలపై చర్చ, ఏపీలో నేటి నుంచి లాక్‌డౌన్ సడలింపు, మార్గదర్శకాలు ఏంటో ఓసారి తెలుసుకోండి

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) ఫోన్‌ చేశారు. కోవిడ్‌ –19 నివారణకు (covid 19 Preventive Measures) తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Telangana Lockdown Extension: ఇళ్లలోనే పండుగలు, ప్రార్థనలు, మే 7 వరకు ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు, ఇంటి యజమానులు 3 నెలలు పాటు అద్దె వసూలు చేస్తే కఠిన చర్యలు, మీడియాతో సీఎం కేసీఆర్

Hazarath Reddy

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Telangana Lockdown) మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు ప్రకటిస్తూనే, 20 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తెలంగాణలో అలాంటివి ఏవీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.

Lockdown 2.0: ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే, ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం, లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగింపు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను (Coronavirus lockdown) మే 3 వరకు పొడిగించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత హాట్‌స్పాట్ (Coronavirus Hotspots) లేని ప్రదేశాల్లో ఆంక్షలను సడలించాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)సూచించారు. ఏప్రిల్ 20 తర్వాత ప్రారంభమయ్యే సేవల్లో ఆరోగ్యం, వ్యవసాయం, మరియు -కామర్స్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మొదలైనవి. వైద్య ప్రయోజనాల మినహా ఫ్లైట్, రైలు, మెట్రో సేవలు మరియు అంతర్-రాష్ట్ర రవాణా మే 3 వరకు నిలిపివేయబడతాయి.

Advertisement

Central Govt Praises RBI: ఆర్‌బీఐ చర్యలను ప్రశంసించిన కేంద్రం, రుణాల జారీ మెరుగుపడుతుందన్న ప్రధాని, దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందన్న హోం మంత్రి

Hazarath Reddy

ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్‌ షాలు ప్రశంసించారు. కేంద్ర బ్యాంక్‌ చర్యలతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరగడంతో పాటు రుణాల జారీ మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

RBI Reduces Reverse Repo Rate: ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, ప్లాన్ 2 అమలు చేస్తున్న ఆర్‌బిఐ, రివర్స్ రెపో రేటు పావు శాతం కోత, మీడియాతో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) కారణంగా దేశంలో తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం,అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు,క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. దేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను RBI ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు (Coronavirus lockdown) పొడిగించిన తరువాత ఈ సమావేశం జరిగింది.

Delhi 'Plasma Therapy': కరోనావైరస్ రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్, ట్ర‌య‌ల్స్ ప్రారంభించిన ఢిల్లీ సర్కారు, అసలేంటి ఈ చికిత్స ?

Hazarath Reddy

ఢిల్లీ సర్కారు కోవిడ్-19 (COVID-19) మీద పోరాటానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. క‌రోనావైరస్ (Coronavirus) సోకిన వారికి త్వ‌ర‌లోనే ప్లాస్మా చికిత్స (Plasma Therapy) ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్ర‌య‌ల్స్ ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గురువారం ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా ల‌భించింద‌ని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఇది విజ‌య‌వంత‌మైతే త్వ‌ర‌లోనే కరోనా రోగుల‌కు ఈ విధ‌మైన చికిత్స అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

Jallikattu Bull Funeral: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, జల్లికట్టు ఎద్దుకు అంత్యక్రియలు, వేలాది మంది హాజరు, మధురై అనంగానల్లూరు గ్రామస్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా కఠినంగా లాక్‌డౌన్ (Coronavirus lockdown) అమలు చేస్తున్నారు. అయినా కొందరు లాక్ డౌన్ ( lockdown) నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా విస్తరిస్తున్న తమిళనాడులో కూడా లాక్‌డౌన్ ఉల్లంఘన జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఓ ఎద్దుకు (Jallikattu Bull Funeral) అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

AP English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

Hazarath Reddy

పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని (AP English Medium Row) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.

COVID-19 in India: 400 దాటిన కరోనా మృతులు, దేశంలో 12 వేలు దాటిన కరోనా కేసులు, అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్‌ (Deadly COVID 19 in India) రోజురోజుకి విజృంభిస్తోంది. గురువారం ఉదయం వరకు భారత్‌లో 12,380 మందికి కోవిడ్ 19 (COVID 19) పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 1,489 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. 414 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10,477 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు నమోదుకాగా, 187 మంది మృతిచెందారు. తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Hostspots in Telugu States: ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే, కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను ప్రకటించిన కేంద్రం, 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు..

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్రాల వారీగా రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్చుతామని కేంద్రం తెలిపింది. కోవిడ్ 19 (Covid 19) వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది.

Coronavirus Cases in India: దేశంలో ఆగని కరోనా ఘోష, 12వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 392కు చేరిన మృతుల సంఖ్య, హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు

Hazarath Reddy

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (Coronavirus) తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య (coronavirus cases) 12 వేలకు దగ్గర్లో ఉంది. బుధవారం సాయంత్రం నాటికి కరోనా బాధితుల సంఖ్య 11,933కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాదాపు 1,118 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా ( COVID 19)నుండి ఇప్పటి వరకు 1,343 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 392 మంది కరోనాతో మరణించారు.

Advertisement

Airline Firms Declined Refund: డబ్బులు రిఫండ్ చేసేది లేదు, ప్రయాణికులకు షాకిచ్చిన విమానయాన సంస్థలు, రీషెడ్యూల్ చేసుకోవాలని సూచన

Hazarath Reddy

విమాన కంపెనీలు (Airline Firms) ప్రయాణికులకు షాకిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 దాకా పొడిగించడంతో (Extension of Lockdown) పాటు విమానసేవలను కూడా అప్పటిదాకా రద్దు చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్‌ చార్జీలు రీఫండ్‌ చేయరాదని (Airline Firms Declined Refund) నిర్ణయించాయి. అదనపు రుసుములేమీ లేకుండా ప్రయాణికులు మరో తేదీకి టికెట్లను రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని ప్రకటించాయి.

IRCTC Offers Full Refund: 39 లక్షల రైల్వే టికెట్లు రద్దు, ఇప్పటికే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నవారికి మొత్తం రీఫండ్, మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మే 3 వరకు లాక్‌డౌన్ (Lockdown) కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే (Indian Railways) ప్రకటించింది. ఈ క్రమంలో మే 3 వరకు రద్దైన అన్ని రైళ్లకు టికెట్ బుకింగ్స్ చార్జీలను రీఫండ్ చేస్తామని భారత రైల్వే శాఖ ప్రకటించింది.

Vijay Devarkonda: పోలీసులకు బూస్ట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి, ప్రాణాలకు తెగించి మా కోసం కష్టపడుతున్నారు, మీ అందరికీ వందనాలు

Hazarath Reddy

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) పోలీస్ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో సోమ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ (Police Commissioner Anjani Kumar) ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ నిజ‌మైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారుల‌ను, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప‌ల‌క‌రించారు.

Lockdown Guidelines: లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ వచ్చేశాయి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, రేపు పూర్తి స్థాయి మార్గదర్శకాలు

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై (Lockdown) కేంద్ర హోంశాఖ (Home ministry) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలకు ఏకీకృత మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 3 వరకు లాక్‌డౌన్ సందర్భంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కొనసాగుతుందని హోంశాఖ తెలిపింది.

Advertisement
Advertisement