Information
AP Rain Update: 30న బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 30 నుంచి మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Kannababu) వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం (Andhra pardesh rains) ఉందని పేర్కొన్నారు.
Google Doodle Games: జనాదరణ పొందిన Google డూడుల్ గేమ్‌లు, 50 సంవత్సరాల కిడ్స్ కోడింగ్ గేమ్, కొత్త కొత్తగా ముందుకు రానున్న గూగుల్ కోడింగ్ గేమ్స్
Hazarath Reddyకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. అందరినీ ఇంట్లోనే కట్టి పడేసింది. ప్రతిచోటా ప్రజలు వారి కుటుంబాలు లాక్డౌన్ (Lockdown) మధ్య ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమయంలో వారి మెదడును ఉత్తేజరపరచడానికి గూగుల్ (Google) ప్రసిద్ధ ఇంటరాక్టివ్ గూగుల్ డూడుల్ ఆటలను (Google Doodle Games) తిరిగి చూసే త్రోబాక్ డూడుల్ సిరీస్‌ను ప్రారంభించింది!
PM Modi 'Do Gaz Ki Doori': ప్రధాని ‘దో గజ్ కి డూరి’ నినాదం, కరోనా మంచి గుణపాఠం నేర్పింది, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌
Hazarath Reddyజాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ (Prime Minister Narendra Modi video conference) నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్‌లతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ (e-GramSwaraj Portal) మొబైల్‌ యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు గ్రామస్వారాజ్‌ పోర్టల్‌ అండ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అవార్డులు ఇచ్చారు. వివిధ రాష్ట్రలకు చెందిన మంత్రులు, సర్పంచ్‌లతో మోడీ మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌ను (Corona Lcokdown) పాటిస్తున్న విధానాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు
China Antibody Test Kits: చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus) మీద వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ (Union Health Minister Dr Harsh Vardhan) శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనా కిట్లు నాసిరకంగా (Faulty Antibody Test Kits) వున్నందున వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
Plasma Therapy Results: కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను (Coronavirus) కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స (Plasma Therapy) సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi CM Arvind Kejriwal) అన్నారు. లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో ( LNJP Hospital) నలుగురి కరోనా పేషెంట్లపై ఈ మేరకు నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైనట్లు (Plasma Therapy Results) ఆయన పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స అనంతరం ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. వారిని త్వరలోనే డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు.
India Coronavirus: కరోనా కట్టడిలో ముందడుగు, 12 జిల్లాల్లో కొత్త కేసులు లేవు, 78 జిల్లాల్లో 14 రోజుల నుంచి తాజా కేసులు లేవు, దేశంలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 4,324 మంది డిశ్చార్జ్
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్‌ (2020 Coronavirus Pandemic in India) పాజిటివ్‌ కేసుల సంఖ్య మెల్లిగా తగ్గుముఖం పడుతోంది. గురువారం నాటికి భారత్‌లో (Coronavirus Cases in India) మొత్తం 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1229 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అలాగే 24 గంటల్లో 34 మంది మరణించారు.దేశంలో ఇప్పటివరకు 686 మంది మృతి (Coronavirus deaths in india) చెందగా.. 4,324 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Delhi Corona Deaths: దేశ రాజధానిలో కరోనా కల్లోలం, 45 రోజులు పసిపాప మృతి, 2248కి కరోనా చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, 71 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సర్కారు
Hazarath Reddyభారత్‌లో కరోనా (Coronavirus in India) శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22వేలకు చేరువలో ఉంది. ఇటు దేశ రాజధానిలో కోరనా (Coronavirus in Delhi) కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో 2248కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు (Delhi Corona Deaths) కోల్పోయారు. తాజాగా 45 రోజుల పసిపాపకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.
Andhra Pradesh Coronavirus: దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు, తాజాగా 80 కొత్త కేసులు నమోదు, ఏపీలొ 893కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి (Covid-19 pandemic in AP) విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ( andhra pradesh) గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (AP COVID-19) 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయి.
Asia's Richest Man: ఆసియాలో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, మొత్తం సంపద విలువ 49.2 బిలియన్ డాలర్లు, ప్రపంచ ధనవంతుల్లో 17వ స్థానం
Hazarath Reddyఫేస్‌బుక్ , రిలయన్స్ జియో ( Jio, Facebook Deal) మెగా డీల్ అనేక సంచలనాలకు వేదిక అయింది. ఫేస్‌బుక్‌తో (Facebook) జరిగిన ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా (Asia's Richest Man) నిలిచాడు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు (రూ.43,574 కోట్లు) ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ పూర్తయ్యాక ఫేస్‌బుక్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌ కానుంది.
Supreme Court Judgment: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి
Hazarath Reddyషెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో (scheduled areas) రిజర్వేషన్లు 50 శాతం మించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని (Telugu states) షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది.
PM Narendra Modi: రాష్ట్రాల సీఎంలతో ఈనెల 27న ప్రధాని 3వ సారి భేటీ, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు, దాడులు చేస్తే కఠిన శిక్షలు తప్పవు, ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర కేబినెట్
Hazarath Reddyకరోనావైరస్ పరిస్థితిపై (Coronavirus Pandemic) చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi Video Conference) ఏప్రిల్ 27 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సంభాషించనున్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇది మూడవ సమావేశం. ఈ సమావేశంలో వైరస్ వ్యాప్తి మరియు భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉండటానికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.
Coronavirus in India: గుజరాత్‌లో కరోనా కల్లోలం, రెండు వేలు దాటిన కేసులు, దేశంలో 20 వేలు దాటిన కరోనా కేసులు, 652 మంది మృతి
Hazarath Reddyగత 24 గంటల్లో భారతదేశం 1486 కొత్త కరోనావైరస్ కేసులను (Coronavirus Pandemic) నివేదించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం సానుకూల కరోనావైరస్ కేసులు బుధవారం 20 వేలు (COVID-19 Tally Crosses 20000) దాటాయి. నయం చేయబడిన లేదా విడుదల చేయబడిన వారు 4000 మందిగా ఉన్నారు. 640 మంది (Coronavirus Deaths) మరణించారు. ఇదిలా ఉంటే భారత రాష్ట్రాల్లో కేవలం 4 రాష్ట్రాల్లో 1000 కి పైగా కరోనావైరస్ కేసులు ఉన్నాయి, వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.
Central Government New Ordinance: వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు, రూ. 5 లక్షల జరిమానా, కొత్త ఆర్డినెన్స్ తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyకరోనావైరస్ మహమ్మారిపై (Coronavirus) ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా పరిగణించింది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు కొత్త ఆర్డినెన్స్‌ (Central Government New Ordinance) తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ (Prakash Javadkar) మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
AP English Medium: ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి, పేరంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు
Hazarath Reddyగత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం (English Medium in Govt Schools) అమలు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను హైకోర్టు (AP High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ (AP Government)దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Facebook-Reliance Jio Deal: జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్‌, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం
Hazarath Reddyదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీగా పెట్టుబడి (Facebook-Jio Deal) పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ (Facebook) బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో (Reliance Jio) 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినట్లయింది. తద్వారా ఫేస్‌బుక్‌ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది.
Odisha Coronavirus: కరోనా పోరులో వైద్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు, కీలక నిర్ణయం తీసుకున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం, చనిపోయిన వైద్య సిబ్బందికి అమరవీరుల గుర్తింపు హోదా
Hazarath Reddyకరోనావైరస్ కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం (CM Naveen Patnaik) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 (COVID-19) పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం (Odisha announces Rs 50 lakh) అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం పట్నాయక్‌ ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
New Judges for AP & TS High Court: ఏపీకి, తెలంగాణకు కొత్త జడ్జీలు, నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం, వీరిలో ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు (New Judges in AP & TS) రానున్నారు. అలాగే తెలంగాణ హైకోర్టుకు (Telangana High Court) ఒక జడ్జీ రానున్నారు.
Lockdown Rules Violation: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, రాష్ట్రాలపై సీరియస్ అయిన హోంశాఖ, లాక్‌డౌన్ సడలింపు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమంటూ హెచ్చరిక
Hazarath Reddyకరోనావైరస్ నియంత్రణ కోసం దేశ‌వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రెండోసారి విధించిన‌ లాక్‌డౌన్‌ను (Nationwide Lockdown) ప‌లు రాష్ట్రాలు క‌ఠినంగా అమ‌లు చ‌ేయ‌కపోవ‌డంపై కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత్య‌వ‌సరం కాని సేవ‌ల‌కు అనుమ‌తినిస్తూ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంపై మండిప‌డింది. ఇలాంటి తొందరపాటు చ‌ర్య‌ల వ‌ల్ల క‌రోనా (Coronavirus) విజృంభించే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి (MHA Warns to States) అజ‌య్ భ‌ల్ల సోమ‌వారం లేఖ రాశారు.
Telangana e-Pass Apply Online: తెలంగాణ లాక్‌డౌన్‌, ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకోమంటున్న పోలీసు శాఖ, పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ అంజనీ కుమార్
Hazarath Reddyలాక్‌డౌన్‌లో (Lockdown)అత్యవసర సేవలు సేవల కోసం పోలీసులు ఈ-పాస్ (Telangana e-Pass)జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (HYD CP Anjani Kumar) తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది. అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్‌ లభిస్తుందని సీపీ చెప్పారు.
PM Phone Call to AP CM: ఏపీ సీఎంకు ప్రధాని ఫోన్, కరోనా నివారణ చర్యలపై చర్చ, ఏపీలో నేటి నుంచి లాక్‌డౌన్ సడలింపు, మార్గదర్శకాలు ఏంటో ఓసారి తెలుసుకోండి
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు (AP CM YS Jagan) ఫోన్‌ చేశారు. కోవిడ్‌ –19 నివారణకు (covid 19 Preventive Measures) తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.