Information

AP Capital-Breaking News: ఏపీ రాజధాని ఇక్కడే, సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్‌కు నివేదిక అందజేసిన తరువాత ప్రెస్ మీట్, రాష్ట్రాన్ని 4 రీజియన్‌లుగా విభజించాలని సూచన

Hazarath Reddy

ఏపీ రాజధాని, (Andhra pradesh Capital)ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ (GN Rao Committee)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan)తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు తాము తిరిగిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను వివరించారు.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Windows 10 Good News: ఇకపై పీసీ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు, విండోస్ 10లోకి కొత్త ఫీచర్, ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌లను కూడా పీసీలోనే చూడవచ్చు, ఎలా లాగిన్ కావాలో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 పీసీ (Windows 10 PC Users) యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ పీసీని, ఆండ్రాయిడ్ ఫోన్‌ను (Android Phone) కనెక్ట్ చేసుకుని నేరుగా పీసీ (PC) నుంచే కాల్స్ చేసుకోవచ్చు, అలాగే వాటిని రీసీవ్ చేసుకోవచ్చు.దీంతో పాటుగా ఫోన్‌కు (Android Phone) వచ్చే ఎస్‌ఎంఎస్‌లను(SMS) కూడా పీసీలోనే చూసుకోవచ్చు.

Barack Obama: మహిళలకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచమే మారిపోతుంది, సగం సమస్యలు ముసలివాళ్ల వల్లే, సోషల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం, మగవాళ్ల కన్నా ఆడవాళ్లే బెటర్ అంటున్న ఒరాక్ ఒబామా

Hazarath Reddy

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆడవాళ్లను తెగ పొగిడేశాడు. వారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. సింగ‌పూర్‌లో (Singapore)జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఒబామా పురుషుల క‌న్నా ఆడ‌వాళ్లే చాలా నయం (Women are better leaders than men)అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Advertisement

Tirumala Temple: శ్రీవారి ఆలయం మూసివేత, డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయం క్లోజ్, డిసెంబర్ 26న ఏర్పడనున్న సూర్యగ్రహణమే కారణం

Hazarath Reddy

శ్రీవారి ఆలయం(Sri Venkateswara temple) మూసివేయనున్నారు. డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 రాత్రి మధ్యాహ్నం 12గంటల వరకూ ఆలయం మూసివేసి ఉంటుందని టీటీడీ(TTD) తెలిపింది. డిసెంబర్ 26న సూర్యగ్రహణం(solar eclipse) ఏర్పడనుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు 13 గంటల పాటు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

Several Trains Cancelled: ఈ రైళ్లు రద్దయ్యాయి, హౌరా నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్లు రద్దు, ప్రయాణికుల కోసం విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రత్యేక సమాచార కేంద్రం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న అల్లర్లు

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రాలు నివురగప్పిన నిప్పులా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి(Citizenship Amendment Act) వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో (East Coast) చెలరేగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నిరసనకారులు తమ ఉద్యమాన్ని హింస దిశగా(Violent protests) తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం కలిగిస్తున్నారు. రైళ్లకు నిప్పు పెడుతున్నారు.

Hyderabad Metro Good News: హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త, ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో, ఉదయం ఆరు నుంచి ఆరున్నకు సమయవేళలు మార్పు, ఉదయం షిఫ్టుల వారికి తప్పని ఇబ్బందులు

Hazarath Reddy

తెలంగాణా (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో ప్రయాణం అంటే హడలిపోవాల్సిందే. ట్రాఫిక్ జాంతో వాహనదారులు అల్లాడిపోతుంటారు. ఈ నేపథ్యంలో అందరూ మెట్రో రైలు( Hyderabad Metro Rail)ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ మెట్రో రైళ్లు రాత్రి 9 దాటితే దొరకడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి బాధ లేదు. హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త వెలువడింది. ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వ రకు నడవనున్నాయి.

BJP MP Car Attacked: బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి, క్షేమంగా బయటపడిన బరాక్ పూర్ ఎంపీ అర్జున్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే దాడికి పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పశ్చిమబెంగాల్(West Bengal)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీపై(BJP MP) దాడి జరగడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులను రాజేస్తోంది. బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ (Barrackpore MP Arjun Singh) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు.

Advertisement

Swati Maliwal Hunger Strike: దిశ చట్టం కోసం 13 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష, క్షీణించిన ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం, లోక్ నాయక్ హాస్పిటల్‌కి తరలింపు, చికిత్స అందిస్తున్న డాక్టర్లు

Hazarath Reddy

మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్(DCW chief) చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష(Swati Maliwal Hunger Strike) 13వ రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా దిశ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి మాలివాల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

Secunderabad Railway Station: గాలి నుంచి మంచి నీరు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కియోస్క్, ఈ నీటికి జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం, కేవలం రూ.5కే లీటర్ బాటిల్ నీరు

Hazarath Reddy

ఇండియాలోనే తొలిసారిగా గాలి నుంచి నీటిని తీసే పద్ధతిని ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గాలి నుండి నీటి తీయటం సాధ్యమయ్యే పనేనా అని చాలామంది అనుకోవచ్చు. అయితే అది సాధ్యమేనని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చేసి చూపించారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ ’కియోస్క్ ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Earthquake In Maharashtra: మహారాష్ట్రలో భూప్రకంపనలు, మూడు సార్లు కంపించిన భూమి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన గ్రామస్తులు, భూప్రకంపనలు వాస్తవమే అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే

Hazarath Reddy

మహారాష్ట్రలో(Maharashtra) భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఫాల్ఘర్‌ ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. పల్ఘర్ జిల్లా దహను తాలుకాలోని దుండల్‌వాడిలో శుక్రవారం(డిసెంబర్ 13, 2019) మధ్యాహ్నం నుంచి శనివారం(డిసెంబర్ 14, 2019) తెల్లవారుజాము వరకు మూడు సార్లు భూమి కంపించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

Festival Holidays Dates In AP: సెలవుల తేదీలు వచ్చేశాయి, సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ, ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు

Hazarath Reddy

పెద్దలు పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి (Sankranti) రానే వచ్చేస్తోంది. సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో అందరూ ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. కాగా ఆ పెద్ద సంక్రాంతి పండగకు ముందు క్రిస్మస్ (Christmas) పండగ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు (Sankranti and Christmas Holidays) సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై రాష్ట్ర విద్యాశాఖ(AP School Education Department) ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Fake iPhone On Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ మోసం, రూ.93 వేలు పెట్టి ఐఫోన్ 11 ప్రో ఆర్డర్ చేస్తే నకిలీ ఫోన్ పంపించారు, వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసిన కస్టమర్, కొత్త ఫోన్ ఇస్తామని తెలిపిన ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం

Hazarath Reddy

ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే దాని ప్లేసులో మరొకటి డెలివరీగా వస్తోంది. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మోసాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) మరో భారీ మోసం వెలుగు చూసింది.

WhatsApp New Tools: వాట్సప్‌లో బల్క్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా? ఇకపై అలాంటి బెడద లేదు, కొత్త టూల్స్‌ని తీసుకొస్తున్న వాట్సప్, స్పామర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న వాట్సప్

Hazarath Reddy

సోషల్ మీడియలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్లకు (Whatsapp Users)శుభవార్తను చెప్పింది. ఇకపై మీ మొబైల్ లోని వాట్సప్ కు బల్క్ మెసేజ్ లు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ బిజినెస్ స్పామర్లకు చెక్ పెట్టింది. బిజినెస్ యాప్ ప్లాట్ ఫాంపై స్పామ్ మెసేజ్ పంపే సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది.

AbhiBus Bumper Offer: బంపరాఫర్ ఇస్తున్న అభిబస్, టికెట్ బుక్ చూస్తే 3 కేజీల ఉల్లి ఉచితం, గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే, డీల్ ఆఫ్ ది ఇయర్ అంటున్న అభిబస్

Hazarath Reddy

ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు తెలివిగా ఈ అంశాన్ని తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉత్పత్తిని కొంటే ఉల్లిపాయలు ఉచితం అంటూ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అభిబస్ కూడా తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది.

Chhattisgarh Teacher: నాతో క్లోజ్‌గా ఉండండి, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఓ టీచర్ నిర్వాకం, అబ్బాయిల్ని చికెన్ తీసుకురావాలంటూ వేధింపులు,అదేమి లేదంటున్న చత్తీస్ ఘడ్ టీచర్, చర్యలు తీసుకుంటామన్న అధికారులు

Hazarath Reddy

విద్యా బుద్ధులు నేర్పించాలని గురువు దారి తప్పాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గురువులు నీచపు పనులకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల ఇవే ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా చత్తీస్‌ఘడ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన గురువు అన్న పదానికే కళంకం తెచ్చేలా ఉంది.

Advertisement

Jio Good News: ఎత్తేసిన రెండు ప్లాన్లు మళ్లీ లైవ్‌లోకి, రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన జియో, మా ప్లాన్లే అన్నింటికంటే చౌక అంటున్న రిలయన్స్ జియో

Hazarath Reddy

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో(Reliance Jio) త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఎత్తేసిన రెండు ప్లాన్ల(Two Plans)ను తిరిగి మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. కాగా ఈ మధ్య మొబైల్ టారిఫ్‌లను జియో పెంచిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలను జియో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో... రిలయన్స్ జియో తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది.

Onion Prices Cross Rs 200/Kg: ఉల్లి డబుల్ సెంచరీ కొట్టేసింది, వంటింట్లో మాయమవుతున్న ఉల్లి, లబో దిబో మంటున్న వినియోగదారులు

Hazarath Reddy

రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరల(Onion price)కు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. తమిళనాడులోని మధురై(Madurai)లో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది.

Rs 2000 Note-Viral Whastapp Message: రూ.2 వేల నోటు రద్దవుతోంది, వెయ్యి రూపాయల నోటు వస్తోంది,సోషల్ మీడియాలో వైరల్ మెసేజ్, ఇదంతా ఫేక్, ఈ వదంతులను నమ్మవద్దంటున్న ఆర్‌బిఐ

Hazarath Reddy

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) షాకిచ్చిందని ఆ మెసేజ్ (viral message ) సారాంశం.

Tirumala Fire Accident: శ్రీవారి లడ్డు తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది, భయంతో పరుగులు పెట్టిన భక్తులు, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Srivari laddu)తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించడంతో.. లడ్డుల తయారీ నిలిచిపోయింది.

Advertisement
Advertisement