Information

TSPSC Group 1 2023: పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు బంద్, గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు, గుర్తింపు కార్డు తప్పనిసరి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులకు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికన్నా ముందే చేరుకోవాలని పేర్కొంది.

Monsoon 2023 Update: కేరళ తీరాన్ని ఇంకా తాకని రుతుపవనాలు, మరో నాలుగైదు రోజులు ఆలస్యం, ఇది దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

నైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 1 తాకాల్సి ఉండగా ఈ తేదీన అవి కేరళను తాకలేదు. ఈ నేపథ్యంలో జూన్‌ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

Important Deadlines in June 2023: జూన్ నెలలో 5 ముఖ్యమైన డెడ్‌లైన్స్ ఇవిగో, వీటిని మిస్సయ్యారంటే భారీ జరిమానాతో పాటు అకౌంట్ డీయాక్టివేషన్ అయ్యే అవకాశం

Hazarath Reddy

జూన్ 2023 రాకతో, జీతం పొందిన ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు అనేక ముఖ్యమైన వ్యక్తిగత ఫైనాన్స్ గడువుల శ్రేణిని ఎదుర్కొంటున్నారు. వివిధ కీలకమైన ఆర్థిక పనులుఆధార్-పాన్ లింకింగ్, అధిక EPF పెన్షన్ కోసం దరఖాస్తు చేయడం వంటివి ఈ నెలలోపు పూర్తి చేయాలి

NIRF Rankings 2023: దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఐఐటి మద్రాస్ ఉత్తమ సంస్థగా, ఐఐఎస్‌సి బెంగళూరు మరియు ఐఐటి ఢిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్ టెన్ ఉత్తమ విద్యాసంస్థలు వివరాలు ఇవే..

Advertisement

IISC Ranked Best University In India: ఉత్తమ విశ్వవిద్యాలయంగా IISC, దేశంలో టాప్ టెన్ ఉత్తమ విశ్వవిద్యాలయాలను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఇదిగో..

Hazarath Reddy

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బెంగుళూరులోని ఐఐఎస్‌సి ఉత్తమ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు, జామియా మిలియా ఇస్లామియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Temperatures To Sore In Telugu States: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమే.. మంగళవారం నుంచి అల్లాడించనున్న సూరీడు.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rudra

రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారనున్నాయి. తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Malware Alert: వందకి పైగా యాప్స్‌ లో ప్రమాదకరమైన వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే.. ఆ యాప్స్ జాబితా ఇదిగో..

Rudra

సమాచార తస్కరణ నిత్యకృత్యంగా మారిపోయింది. భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌ లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.

Flight Over Tirumala: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం.. ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు

Rudra

తిరుమలలో కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ విమానం తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Advertisement

Govt Bans 14 Fixed Dose Combination Drugs: ఈ కాంబినేషన్ మందులు వాడొద్దని హెచ్చరిస్తూ 14 ఔషధాలను బ్యాన్‌ చేసిన కేంద్రప్రభుత్వం.. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు.. కారణం ఏంటంటే??

Rudra

14 ఔషధాలను బ్యాన్‌ చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష.. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది

Rudra

దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు.

Odisha Train Tragedy Update: ఒడిశా రైలు దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదిగో..

Rudra

ఒడిశాలో మూడు రైళ్ల ఘోర ప్రమాదంతో దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సర్వీసులను రద్దు చేయడంతో చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషనులో శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు.

Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన చాలా తీవ్రమైనది, దోషులను వదిలిపెట్టం - ప్రధాని మోదీ

kanha

ఒడిశాలోని బాలాసోర్‌లో రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఘటనాస్థలం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Traffic Restrictions in Hyderabad: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్‌ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు.

NCERT: 10వ తరగతి పుస్తకాల నుండి పలు పాఠ్యాంశాలను తొలగించిన NCERT, విద్యార్థులపై కంటెంట్ లోడ్ తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Hazarath Reddy

కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా విద్యార్థులపై కంటెంట్ లోడ్‌ను తగ్గించేందుకు 10వ తరగతి పాఠ్యపుస్తకం నుండి ఎలిమెంట్, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు (పూర్తి పేజీ), ప్రజాస్వామ్యానికి సవాళ్లు యొక్క ఆవర్తన వర్గీకరణ యొక్క పూర్తి అధ్యాయాలను NCERT తొలగించింది. ఈ మేరకు NCERT (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మరియు శిక్షణ) వెల్లడించింది.

Monsoon in Telangana: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ రెండో వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది.

TS Weather Report: తెలంగాణ వెదర్ అలర్ట్, ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

తెలంగాణలో పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.

Advertisement

AP Weather Report: ఏపీలో మారిపోయిన వాతావరణం, రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు... మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. కమ్ముకు వచ్చిన మేఘాలు, ఈదురు గాలులు, వర్షంతో వాతావరణం చల్లబడింది.

High Temperatures in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఎండలే.. మంగళ, బుధవారాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం.. హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక.. సూర్యాపేటలో సోమవారం వడదెబ్బకు ఇద్దరు వృద్ధుల మృతి

Rudra

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో నేడు, రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

TCS New Jobs: టీసీఎస్‌లో ఫ్రెషర్‌లకు 40 వేల ఉద్యోగాలు, అప్లయి చేసుకోవడానికి మే 31 చివరి తేదీ, పూర్తి వివరాలు కథనంలో తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశపు అతిపెద్ద IT సేవల సంస్థ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY24లో ఫ్రెషర్‌లకు 40,000 క్యాంపస్ ఆఫర్‌లను అందించాలని యోచిస్తోంది.టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను మాత్రమే తీసుకోనున్నట్టు ప్రకటించింది.

Earthquake in Assam: అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం.. తీవ్రత 4.4గా నమోదు

Rudra

అస్సాం (Assam), అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో (Sonitpur) భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Advertisement
Advertisement