సమాచారం

High Temperatures in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఎండలే.. మంగళ, బుధవారాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం.. హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతకు ఛాన్స్.. వాతావరణ శాఖ హెచ్చరిక.. సూర్యాపేటలో సోమవారం వడదెబ్బకు ఇద్దరు వృద్ధుల మృతి

Rudra

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో నేడు, రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

TCS New Jobs: టీసీఎస్‌లో ఫ్రెషర్‌లకు 40 వేల ఉద్యోగాలు, అప్లయి చేసుకోవడానికి మే 31 చివరి తేదీ, పూర్తి వివరాలు కథనంలో తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశపు అతిపెద్ద IT సేవల సంస్థ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY24లో ఫ్రెషర్‌లకు 40,000 క్యాంపస్ ఆఫర్‌లను అందించాలని యోచిస్తోంది.టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను మాత్రమే తీసుకోనున్నట్టు ప్రకటించింది.

Earthquake in Assam: అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం.. తీవ్రత 4.4గా నమోదు

Rudra

అస్సాం (Assam), అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో (Sonitpur) భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Rains in Telangana: వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం

Rudra

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అకాశాలున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని వెల్లడించింది.

Advertisement

Heat Waves in AP: నేడు, రేపు ఏపీలో వడగాడ్పులు.. రాష్ట్రంలో భానుడి భగభగలు, 44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత

Rudra

సూర్యుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ వాసులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను మించిపోయాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??

Rudra

ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

India Post GDS Recruitment 2023: పోస్ట్ ఆఫీసుల్లో 12,828 పోస్టులు.. జూన్ 11 వరకు దరఖాస్తుకు అవకాశం.. వేతనం ఎంతంటే?

Rudra

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.

Telugu States Weather Update: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో ఎండలే ఎండలు.. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం.. అటు ఏపీలోనూ వడగాల్పులు

Rudra

మొన్నటివరకూ అకాల వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలో నేటి నుంచి సోమవారం వరకు ఎండలు మండిపోనున్నాయి. ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Advertisement

Cough Syrup Export New Rule: ప్రభుత్వ ల్యాబ్‌లు పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు.. దగ్గు మందులపై డీజీఎఫ్‌టీ నిబంధనలు

Rudra

భారత్ లో తయారయ్యే దగ్గు మందులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నిబంధనలు విధించింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్‌లు సిరప్‌లను పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు చేసుకోవాలని వివరించింది.

APPSC Group 1 & Group 2 Notification: ఏపీలో 1000 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Health Tips: వీర్య స్కలనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తరచూ హస్త ప్రయోగం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా, సైంటిస్టులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

భావప్రాప్తి అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం. కొద్ది సెకన్ల పాటు మీ కండరాలు సంకోచించబడతాయి, మీ స్పృహ మారుతుంది. సామాజిక బంధాన్ని ప్రోత్సహించే రెండు హార్మోన్ల (ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్) రక్త స్థాయిలు పెరుగుతాయి.

Heatwave Ends in India: మండే ఎండలకు ఇక సెలవు, దేశంలో హీట్ వేవ్ ముగిసిందంటూ చల్లని కబురును చెప్పిన ఐఎండీ, ఇక నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడి

Hazarath Reddy

గత కొన్ని వారాలుగా భారత్‌ను పట్టి పీడిస్తున్న వేడిగాలులకు ఎట్టకేలకు (Heatwave Ends in India) తెరపడింది. ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.ఈ ప్రాంతంలో వర్షపాతం లేకపోవడం, అధిక పీడన వ్యవస్థతో సహా కారకాల కలయిక వల్ల హీట్ వేవ్ ఏర్పడిందని IMD తెలిపింది.

Advertisement

HC on Forcibly Seize Vehicles: ఈఎంఐ కట్టకపోతే రికవరీ ఏజెంట్లు వాహనం ఎత్తుకెళ్లడం చట్టవిరుద్ధం, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు పాట్నా హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

రుణ ఈఎంఐ కట్టకపోతే ఏజెంట్ల సాయంతో బలవంతంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పాట్నా హైకోర్టు ప్రకటించింది. ‘‘రికవరీ ఏజెంట్లు వాహనాలను సీజ్ చేయడం చట్టవిరుద్ధం. జీవనం, ఉపాధికి సంబంధించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుంది’’ అని జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ తీర్పు చెప్పారు.

AP Weather Report: ఏపీ వాతావరణం రిపోర్ట్ ఇదిగో, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో వేడిగాలులు, ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

Hazarath Reddy

ఏపీలో వాతావరణంపై ఏపీ వెదర్ డిపార్ట్ మెంట్ అప్ డేట్ ఇచ్చింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాలో వర్షాలు పడతాయని, మరి కొన్ని జిల్లాల్లో ఎండలు ఎక్కువగా కాస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

AP High Court on Children: పిల్లల్ని అత్తమామల దగ్గర నుంచి తండ్రి తీసుకువెళితే కిడ్నాప్ కిందకు రాదు, తండ్రి వారికి చట్టబద్ధ సంరక్షకుడని తెలిపిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

పిల్లలను అత్తమామల నుంచి తీసుకువెళ్లిన కేసులో తండ్రికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తమామల నుంచి పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కిడ్నాప్‌ కాదని తీర్పు ఇచ్చింది. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తుచేసింది

TS EAMCET 2023 Results Out: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను eamcet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

Advertisement

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల రేపే, ఉదయం 9:30 గంటలకే విద్యార్థులు అలర్ట్ కావాలి, ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు తెలిపిన అధికారులు

Hazarath Reddy

జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

193 Free Poll Symbols: గాజులు నుంచి లాగుడు బండి దాకా, ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో, 193 ఫ్రీ గుర్తులను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది

UPSC IAS Final Results 2022 Declared: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌

Hazarath Reddy

UPSC నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్‌ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు.

Rs 2000 Note Exchange: రూ. 2 వేల నోట్లు మార్చుకోవాలంటే ఆధార్ కార్డు అవసరమా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫికేషన్ ఇదిగో..

Hazarath Reddy

రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని, అధికారిక ధ్రువీకరించిన పత్రాలు ఏమీ ఉండవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అలాంటివి అడగవద్దని బ్యాంకు దాని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.

Advertisement
Advertisement