Information

Weather Forecast: ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు, పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్, వచ్చే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, ఈదురు గాలులు శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ((IMD issues orange alert) ) ప్రకటించింది.

Voter ID- Aadhaar Link Date: గుడ్ న్యూస్, ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడి లింక్ తేదీ పొడిగించిన కేంద్రం, ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 లోపు లింక్ చేసుకోవాలని సూచన

Hazarath Reddy

ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడిని లింక్ చేయడానికి చివరి తేదీని ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరింది.

Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం

Hazarath Reddy

భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.

Ramadan: రంజాన్..దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం, ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆచరించే పండుగ, రంజాన్‌ మాసం చరిత్ర, ఉపవాస దీక్షలపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ (Ramadan or Ramzan 2021) ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది.

Advertisement

Ugadi Festival: ఉగాదిని ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా, సృష్టి ఆరంభమైన దినమే ఉగాది, జీవిత సత్యాన్ని తెలిపే యుగాది పచ్చడితో ఈ ఏడాది తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుదామా..

Hazarath Reddy

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ (Telugu New Year) గుర్తింపు తెచ్చుకుంది.పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi).

APSRTC: గుడ్ న్యూస్..డోర్ టు డోర్ సేవలు ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ, తొలుత విజయవాడ-విశాఖ మధ్య సేవలు, దశల వారీగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి విస్తరణ

Hazarath Reddy

ఏపీఎస్ఆర్టీసీ తాజాగా డోర్ టు డోర్ సేవలు ప్రారంభించింది. ఆర్టీసీ కార్గోలో డోర్ టు డోర్ సేవలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో సర్వీసుకు ఆదరణ పెరిగిందని అన్నారు.

Influenza Alert: జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి కేసులతో ఆస్పత్రులు కిటకిట, ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక

Hazarath Reddy

దేశంలో రోజు రోజుకు ఇన్‌ఫ్లుయెంజా ప్లూ కేసులు (Influenza Alert) పెరుగుతున్నాయి. ఎంతోమంది దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య శాఖ కొన్ని సలహాలు విడుదల చేసింది.

Telangana Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్, రెండు రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు వడగండ్ల వాన అలర్ట్

Hazarath Reddy

తెలంగాణలో అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. అయితే, మరో రెండు రోజులు కూడా తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

Andhra Pradesh Rains: ఏపీలో మరో 2 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం, వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని ఆదేశాలు

Hazarath Reddy

రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివా­రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

Telangana SSC Exams: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు... ఈ నెల 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు.. ఈసారి 6 పేపర్లతో తెలంగాణ టెన్త్ పరీక్షలు

Rudra

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

Group 1 Prelims Cancelled: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు, అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

Hazarath Reddy

తెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

PM Kisan Scheme: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 2000, పీఎం కిసాన్ 14వ విడత నిధులు అప్పుడే, పథకానికి రైతులు అర్హులు కాదో తెలుసుకునేందుకు ఇక్కడ చూడండి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం కిసాన్ పథకం 13వ విడతను విడుదల చేయడంతో, లబ్ధిదారులు ఇప్పుడు తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్నారు. 14వ విడత యొక్క ఖచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడనప్పటికీ, ఏప్రిల్ 2023, జూలై 2023 మధ్య ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన (పథకం) యొక్క 14వ విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చని భావిస్తున్నారు

Advertisement

Hair Offering Ticket Price Hike: ఏపీ ఆలయాల్లో తలనీలాల టికెట్ ధర పెంపు.. ప్రస్తుత రూ. 25 నుంచి రూ. 40కి పెంచుతూ ఉత్తర్వులు జారీ.. క్షురకులకు గుడ్ న్యూస్.. నెలకు కనీసం రూ. 20వేల కమిషన్ ఇచ్చేలా ప్రభుత్వ ఉత్తర్వులు

Rudra

దేవాదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు శుభవార్త చెప్పింది.

New Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం, రూ.3 లక్షలు దాటితే పన్ను, మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదంటున్నారు, ఎలా సాధ్యమో తెలుసుకోండి

Hazarath Reddy

ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి (New Income Tax Rules) కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Weather Forecast in TS: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, రానున్న 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు, వికారాబాద్‌ను ముంచెత్తిన వడగండ్ల వాన

Hazarath Reddy

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.

AP Weather Forecast: ఏపీలో మార్చి 16 నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

Hazarath Reddy

ఏపీలో బుధవారం నుంచి వర్షాలు మొదలు కానున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) ముందుగా అంచనా వేసినట్టుగా ఈ నెల 16 నుంచి కాకుండా ఒకరోజు ముందుగానే వానలు (Rains in AP) కురవనున్నాయి

Advertisement

TS Inter Exams: తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, హాల్ టికెట్ www.tsbie.cgg.gov.in నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనుండగా... సెకండ్ ఇయర్ కు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

Telangana Rains: వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు.. కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం.. 18 జిల్లాలకు యెల్లో అలర్ట్

Rudra

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Aadhaar-Pan Linking: ఆధార్‌-పాన్ అనుసంధానికి మార్చి 31 ఆఖరు.. లింకింగ్ చేయకపోతే ఏమవుతుంది?

Rudra

ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మరియు పన్ను ఎగవేతను నిరోధించడానికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పన్ను చెల్లింపుదారులను మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాలని కోరింది.

SSC Exams In AP: ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్

Rudra

ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు.

Advertisement
Advertisement