News

Google Layoffs: ఏడాది చివరలో ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్, 10 శాతం మందిని జనవరిలో ఇంటికి సాగనంపుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

గూగుల్ తన వ్యూహంలో భాగంగా 10% ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టెక్ దిగ్గజం దాని సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రక్రియలో కొన్ని పాత్రలను తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నందున తాజా రౌండ్ Google తొలగింపులు అమలు చేయబడ్డాయి

Boat Capsizes in Greece: రోడ్స్ ఐలాండ్‌లో ఘోర పడవ ప్రమాదం, పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో మునిగిపోయిన బోటు, 8 మంది మృతి, గల్లంతైన వారి కోసం వెతుకులాట

Hazarath Reddy

గ్రీసు(Greece Migrants) దీవుల్లోని రోడ్స్ ఐలాండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో వలసదారులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతిచెంద‌గా, మ‌రో 18 మందిని పోలీసులు ర‌క్షించారు.మిగిలిన వారి కోసం కోస్టుగార్డు నౌక‌లు, హెలికాప్ట‌ర్ల‌తో గాలింపు చేప‌డుతున్నారు.

Hyderabad: పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనిబీటెక్ విద్యార్థి మృతి...ఒకరికి తీవ్ర గాయాలు

Arun Charagonda

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బీటెక్ విద్యార్థి మృతి చెందారు. హైదరాబాద్ - పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారయ్యాడు ప్రైవేట్ ట్రావెల్ బస్సు. లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు. అయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Nigeria Stampede: నైజీరియాలో ఘోర విషాదం, ఫన్‌ఫెయిర్‌లో జరిగిన తోపులాటలో 35 మంది చిన్నారులు మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

నైజీరియాలోని ఓయో రాష్ట్రంలో బుధవారం జరిగిన ఫన్‌ఫెయిర్‌లో జరిగిన తోపులాట ఘటనలో కనీసం 35 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ సిఎన్ఎన్ నివేదించింది.

Advertisement

One Nation One Election: జమిలి బిల్లు కోసం జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితా ఇదిగో..

Hazarath Reddy

జమిలి బిల్లు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి, మాట మాట పెరగడంతో ఘర్షణ

Hazarath Reddy

కడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డులోని గౌరీ సాయి వైన్స్ వద్ద మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో అక్రమ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Pawan Kalyan: వీడియో ఇదిగో, OG OG అని అరిస్తే పనులు జరగవు, అభిమానులకు చురకలు అంటించిన పవన్ కళ్యాణ్, సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని వెల్లడి

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు చురకలు అంటించారు. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు.

Relief For KTR: హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్, ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం...తదుపరి విచారణ 27కు వాయిదా

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని..తదుపరి విచారణ 27 కు వాయిదా వేసింది హైకోర్టు.

Advertisement

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Viral Video: పాల ప్యాకెట్ల దొంగ...హైదరాబాద్ మణికొండలో షాకింగ్ దొంగతనం, పాల ప్యాకెట్లు- పేపర్లు దొంగతనం...వైరల్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్ మణికొండలో షాకింగ్ దొంగతనం జరిగింది. ఓ దొంగ ఏకంగా ఆటోలో వచ్చి పూల కుండీలు ,పాల ప్యాకెట్లు, పేపర్లు దొంగలించారు. మణికొండలోని అల్కపురి కాలనీలో జరిగిన ఈ షాకింగ్ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mohammad Azharuddin: టీబీ రహిత భారతదేశం కావాలి, ఢిల్లీలో రాజ్యసభ ఎంపీలు వర్సెస్ లోక్‌సభ ఎంపీల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ ఆడిన అజార్...వీడియో

Arun Charagonda

టీబీ రహిత భారతదేశంలో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు భారత మాజీ ఆటగాడు అజారుద్దీన్. స్పీకర్‌ ఓం బిర్లాతో కలిసి టోర్నమెంట్‌ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన అజార్...ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో రాజ్యసభ & లోక్‌సభ సభ్యుల మధ్య జరిగిన టిబి ముక్త్ భారత్ అవేర్‌నెస్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనే అదృష్టం తనకు లభించిందన్నారు.

KTR Lawyer Sundaram: రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు, ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ లబ్ది పొందలేదు..ఈ కేసుతో ఏసీబీకి సంబంధం లేదన్న లాయర్ సుందరం

Arun Charagonda

రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు అన్నారు కేటీఆర్ లాయర్ సుందరం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన న్యాయవాది సుందరం...అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు? చెప్పాలన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దం అన్నారు.

Advertisement

Andhra Pradesh: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్, వలవేసి పట్టుకున్న పోలీసులు..ఏకంగా 450 కేజీల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్

Arun Charagonda

ఏపీలో పుష్ప సినిమా తరహాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వ్యాన్ పైకప్పులో టార్పలిన్లతో గుట్టుగా గంజాయిని ప్యాక్ చేశారు స్మగ్లర్లు. నర్సీపట్నం డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

BRS Vs Congress: అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

Hazarath Reddy

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన బైక్..ఇద్దరు విద్యార్థులు మృతి, వీడియో ఇదిగో

Arun Charagonda

చిత్తూరు అరగొండ రోడ్డు, ముట్ర పల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు సీతమ్స్ కళాశాల విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంతో ఆటోను ఢీకొని విద్యార్థులు దుర్మరణం చెందారు. హర్ష ( 17) ,సాయి తేజ (18) ముట్రపల్లి వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తవణం పల్లె పోలీసులు.

Om Prakash Chautala Dies: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా తన 89వ ఏట మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా చాలా సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు మరియు చౌదరి దేవి లాల్ జీ యొక్క పనిని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అతని కుటుంబ సభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement

Om Prakash Chautala Dies: గుండెపోటుతో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా పనిచేసిన చౌతాలా

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి.

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

ఏపీ వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ వచ్చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

సహజీవనాలు, స్వలింగ వివాహాలపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండూ చాలా తప్పుడు పద్ధతులని, వీటి వల్ల సమాజం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు.

Advertisement
Advertisement