News
2024 US Elections: నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోటీ పడుతున్న కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్, ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న 2.1 కోట్ల మంది ప్రజలు
Hazarath Reddyయునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి.ఈనేపథ్యంలో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలోని ఎలక్షన్ ల్యాబ్ వెల్లడించింది.
Delhi Shocker: ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎంతో మాట్లాడాలంటూ హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి ఓ వ్యక్తి నిరసన
Hazarath Reddyఢిల్లీలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో మాట్లాడేందుకు తనను అనుమతించాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.
Nalgonda: కోమటిరెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నాభాయ్ ఇంజనీర్, బస్తాలు అమ్ముకుని బీర్లు తాగేవాడు...బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ ఫైర్
Arun Charagondaకోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు.
Astrology: అక్టోబర్ 30న శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశం తో లక్ష్మీనారాయణ యోగం.. మూడురాశుల వారికి అదృష్టం.
sajayaఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31 మరియు ఒకటవ తేదీన వస్తుంది. అయితే అక్టోబర్ 30వ తేదీన శుక్రుడు ,బుధ గ్రహాలు రెండు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాయి.
Health Tips: మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడం కోసం ఎటువంటి సూపులు తాగాలో తెలుసా..
sajayaఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతుంది. మధుమేహం రక్తంలోని షుగర్ లెవెల్స్ ను పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: ఉదయం టిఫిన్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
sajayaరోజంతా యాక్టివ్ గా ఉండాలి అంటే మనము బ్రేక్ ఫాస్ట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఆరోగ్యకరమైన పోషకపకారమైన ఆహారంతో మన రోజున ప్రారంభిస్తే అనేక రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి.
Health Tips: మీ జీవితకాలం రెట్టింపు అవ్వాలంటే ఈ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోండి.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మన జీవిత కాలాన్ని రెట్టింపు చేసుకుంటూ నాణ్యమైన జీవితాన్ని గడపడానికి మన ఆహారంలో కొన్ని అలవాటు చేసుకోవాలి.
Guntur Nurse Murder Case: జగన్కు ఇంకా తగ్గని క్రేజ్, వైసీపీ అధినేత వస్తున్నాడని జనసంద్రమైన గుంటూరు, వీడియో ఇదిగో..
Hazarath Reddyరౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిందుకు వైఎస్ జగన్ జీజీహెచ్కు వెళ్లారు. వైఎస్ జగన్ జీజీహెచ్కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
Bandi Sanjay On KTR Notices: కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదు?, మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానన్న బండి సంజయ్
Arun Charagondaకేటీఆర్ పంపిన నోటీసులకు బదులిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అని...రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? అని ప్రశ్నించారు. విమర్శలకు నోటీసులే సమాధానమా?, నేను కూడా నోటీసులు పంపిస్తా...కాచుకో అన్నారు. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన అని చెప్పిన బండి..మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానని చెప్పారు.
Health Tips: ఒకరోజులో మన శరీరానికి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసా..తక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు..
sajayaమన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. అనేక రకాల జబ్బులు తగ్గించడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మన శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంచడానికి నీరు చాలా అవసరం.
Andhra Pradesh: వచ్చేది మన ప్రభుత్వమే, నిందితులను వెంటాడి జైల్లో పెడతాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagan Slams Nara Lokesh: దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా? నారా లోకేష్ని పప్పు అనడంలో తప్పే లేదంటూ మండిపడిన జగన్
Hazarath Reddyరాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.
Priyanka Gandhi: వయనాడ్లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ, హాజరైన సోనియా - రాహుల్ గాంధీ...భారీగా తరలివచ్చిన ప్రజలు
Arun Charagondaకేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రియాంక గాంధీ. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలిరాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆ తర్వాత రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రిజైన్ చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Chennai: 50 పైసలు తిరిగి ఇవ్వనందుకు పోస్టాఫీసుకు రూ. 15 వేలు జరిమానా విధించిన కోర్టు, చెన్నైలో ఘటన
Hazarath Reddy50 పైసల నాణేనికి సంబంధించిన చెన్నై వినియోగదారుల వివాదంలో కస్టమర్కు చిన్న మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు INR 15,000 జరిమానా విధించబడింది.
Reels With Cheetah: చిరుతపులితో రీల్...ముగ్గురిపై దాడి చేసిన చిరుత, మధ్యప్రదేశ్లో ఘటన...వైరల్గా మారిన వీడియో
Arun Charagondaఉత్తర ప్రదేశ్ కు చెందిన సుమారు 50 మంది మిత్రులు మధ్యప్రదేశ్ కు విహారయాత్రకు వెళ్లారు. షాదోల్ జిల్లాలోని గోహ్పారు- జైత్ పూర్ అడవుల్లోని వాటర్ ఫాల్స్ చూడాలి వెళ్లారు. ఓ ముగ్గురు వ్యక్తులు అడవి లోపలికి వెళ్లారు.
KTR: బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
Arun Charagondaకేంద్రమంత్రి బండి సంజయ్కు షాకిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Hong Kong Blocks WhatsApp: వాట్సాప్ను బ్యాన్ చేసిన హాంకాంగ్, కొత్త ఐటీ మార్గదర్శకాలు రిలీజ్, ప్రభుత్వ సంస్థల్లో గూగుల్ డ్రైవ్, వీ చాట్ యాప్ల తొలగింపు
Arun Charagondaసైబర్ సెక్యూరిటీ నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరమైన కారణాలతో తమ కంప్యూటర్లలో వాట్సాప్, వీచాట్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి యాప్లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు నూతన ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.
Hyderabad: గోషామహల్లో భారీగా కుంగిన నాలా , అర్థరాత్రి కావడంతో తప్పిన ప్రమాదం...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ గోషామహల్లో నాలా రోడ్డు కుంగింది. దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో శివరేజ్ పెద్ద నాలా కుంగగా ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Kaleswaram Project Public Hearings: కాళేశ్వరంపై మళ్లీ విచారణ, ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనున్న ఓపెన్ కోర్టు విచారణ..ఈ నెలాఖరులోగా తుది నివేదిక సిద్ధం!
Arun Charagondaనేటి నుంచి కాళేశ్వరంపై మళ్లీ విచారణ ప్రారంభించనుంది కమిషన్. ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనుంది ఓపెన్ కోర్టు విచారణ. పలువురు ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు నేటి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లతో విచారణ పూర్తి చేయాలనే యోచనలో కమిషన్ ఉండగా ఆ తర్వాత తుది నివేదికను సమర్పించనుంది.