వార్తలు

Daniel Hand Kiss to Suma: వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ న‌టుడు డానియెల్‌, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..

Vikas M

డానియెల్ వేదిక మీద‌కి వ‌చ్చి సినిమా గురించి చెప్పిన అనంత‌రం కింద‌కి వెళుతూ.. సుమ చేయిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో స‌డ‌న్‌గా షాక్ తిన్న సుమ రాజా(రాజీవ్ క‌న‌క‌లా) ఇత‌డు మా అన్న‌య్యా రాఖీ వ‌స్తుంది క‌దా అంటూ డానియెల్‌ను చూపిస్తుంది. దీంతో అక్క‌డ ఉన్న అభిమానులంతా ఒక్క‌సారిగా అరుపులు కేక‌లు వేయ‌గా.. ఈవెంట్ అంతా సంబరంగా మారింది.

Kalki 2898 AD: జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయనున్న కల్కి 2898 ఏడీ, మరో రూ.55 లక్షలు వ‌సూలు చేస్తే దేశంలో అత్య‌ధిక వ‌సూల్లు కొల్ల‌గొట్టిన సినిమాల్లో నాలుగో స్థానానికి ప్ర‌భాస్ మూవీ

Vikas M

టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, రెబ‌ల్ స్టార్, డార్లింగ్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొద‌టి ఆట నుంచే హిట్‌ టాక్ తెచ్చుకుంది. భారీ వ‌సూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా 'క‌ల్కి..' నిలిచింది.

MG Windsor EV: దేశీయ విపణిలోకి ఎంజీ మోటార్స్ నుంచి మూడో ఈవీ కారు, విండ్సార్ ఈవీని లాంచ్ చేయనున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ధర ఎంతంటే..

Vikas M

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో మరో ఈవీ కారును లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న జడ్ ఎస్ ఈవీ (ZD EV), కొమెట్ ఈవీ (Comet EV) సక్సెస్‌తో మరో ఈవీ కారు క్లౌడ్ ఈవీ (CloudEV) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.

Cognizant New Centre in Hyd: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఐటీ ఉద్యోగాలు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మ‌ధ్య ఒప్పందం

Vikas M

ప్రముఖ ఐటీ దిగ్గజం `కాగ్నిజెంట్` హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు ప‌ని చేసేందుకు వీలుగా ప‌ది ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ది

Advertisement

Airtel Net Profit: లాభాల్లో దుమ్మురేపిన భారతీ ఎయిర్‌టెల్‌, ఈ ఏడాది రూ.4160 కోట్లకు పెరిగిన నికర లాభం

Vikas M

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 results) రెండున్నర రెట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది.

Samsung Galaxy F14: తొమ్మిది వేలకే శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీతో ప్రైమరీ కెమరాతో పాటు మిగతా ఫీచర్లు అదుర్స్

Vikas M

దక్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం శాంసంగ్ తాజాగా భార‌త‌ మార్కెట్లోకి బ‌డ్జెట్ ఫోన్ ఒక‌టి లాంఛ్ చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14. కేవలం రూ. 8,999కే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.

Infineon Layoffs: ఆగని లేఆప్స్, 1400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్

Vikas M

జర్మనీలోని మ్యూనిచ్ జిల్లాలోని న్యూబిబెర్గ్‌లో ఉన్న గ్లోబల్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఇన్ఫినియన్ టెక్నాలజీస్ మూడవ త్రైమాసిక ఆదాయ అంచనాలను తప్పిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ఫినియన్ తొలగింపులు జర్మనీలోని రెజెన్స్‌బర్గ్‌లో పనిచేస్తున్న వ్యక్తులపై ప్రభావం చూపుతాయి

Perni Nani on TDP Red Book: పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంపై మండిపడిన పేర్ని నాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరుగుతోందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే, పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Bangladesh Unrest: బంగ్లాదేశ్ అల్లర్లు, ప్రధాని మోదీ నివాసంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసర భేటీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు

Bangladesh Protest: నిరసనలతో భగ్గుమంటున్న బంగ్లాదేశ్, అన్ని విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేసిన భారత్, ఎల్ఐసీ ఆఫీసు మూసివేత

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా (Air India), ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసాయి. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్‌ నుంచి రావాల్సిన సర్వీసులను నిలిపివేశాయి.

Bangladesh Protest: వీడియో ఇదిగో, షేక్‌ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ భేటీ

Hazarath Reddy

Bangladesh Protest: వీడియో ఇదిగో, భారత్ చేరుకున్న షేక్ హసీనా, లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు, భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం

Hazarath Reddy

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

YS Jagan: తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్

Hazarath Reddy

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Bangladesh Protests: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్, సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ ఆదేశాలు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) అప్రమత్తమైంది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి హై అలర్ట్‌ (High alert) ప్రకటించింది.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌‌లో ఎందుకీ ఆందోళనలు? విద్యార్థులు చేపట్టిన ఉద్యమం రాజకీయ నిరసనగా ఎందుకు మారింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎవరేమన్నారు ?

Hazarath Reddy

హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపిన ఆర్మీ చీఫ్ వాకర్‌-ఉజ్‌-జమాన్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్‌ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.

Advertisement

Beware Of Parcel Fraud: పార్సిల్ లేదా కొరియర్ కాల్స్‌తో జాగ్రత్త.. నకిలీ కాల్స్ నమ్మి మోసపోకండి!

Arun Charagonda

రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా పంజా విసిరేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా పార్సిల్ లేదా కొరియర్ కాల్స్‌ స్కాంకు తెగబడ్డారు. మీ పేరిట వచ్చిన కొరియర్లో నిషేధిత, మత్తు పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదయ్యాయని సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని బురిడీ కొట్టించి, టెన్షన్ లో పెట్టి డబ్బులు గుంజుతారు.

Excise Policy Case: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల్‌ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది. ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, చట్టవిరుద్ధమని చెప్పలేమని కోర్టు పేర్కొంది.

Vemulawada Temple VIP Darshan: వేములవాడ రాజన్న ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం, టికెట్ ధర ఎంతో తెలుసా?

Arun Charagonda

దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దేవాలయం(రాజరాజేశ్వర స్వామి)లో వీఐపీ బ్రేక్ దర్శనం నేటి నుండి ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ బ్రేక దర్శన టికెట్ ధర రూ.300గా ఉండగా ఈ టికెట్ తీసుకున్న వారికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు.

Supreme Court: అవి కోచింగ్ సెంటర్లు కాదు డెత్ ఛాంబర్స్ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు,విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కోచింగ్ సెంటర్లు అని కామెంట్

Arun Charagonda

భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించిన విషయం తెలిసిందే. సెల్లార్‌లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా గత నెల 27న రాత్రి భారీ వర్షాలకు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.

Advertisement
Advertisement