Politics
Union Budget 2023 Live Streaming: 2024 ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్, ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించండి
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు 2023 బడ్జెట్‌ను సమర్పించనున్నారు. బడ్జెట్ 2023-24 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి సీతారామన్ యొక్క ఐదవ వరుస బడ్జెట్, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్ ఇది
Andhra Pradesh Capital: ఇంకో మూడు నెలల్లో విశాఖకు అన్నీ షిఫ్ట్ చేస్తాం, రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని వెల్లడి
Hazarath Reddyఏపీ రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్‌లోపే విశాఖపట్నం నుంచి పాలన ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు.
Budget 2023-24: ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్, అఖిలపక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన కాంగ్రెస్, సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరిన బీజేపీ ప్రభుత్వం
Hazarath Reddyబడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కోరింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌ ఇదేకానుంది.
CM Jagan on Chandrababu: వచ్చే ఎన్నికల్లో మీకు ముసలాయన కావాలా, యువకుడైన నేను కావాలా, వినుకొండ సభలో కొత్త డైలాగులు పేల్చిన సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమంలో మూడో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కొత్త డైలాగులతో మండిపడ్డారు. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు.
Rahul Gandhi Raises Flag Row: ప్రధాని మోదీ వల్లే లాల్‌ చౌక్‌లో రాహుల్ గాంధీ స్వేచ్ఛగా జెండా ఎగరవేయగలిగారు, ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రభుత్వానికి రాహుల్ థ్యాంక్స్ చెప్పాలని బీజేపీ డిమాండ్
Hazarath Reddyకాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో ఎంపీ రాహుల్‌ గాంధీ జాతీయ జెండా (Rahul Gandhi unfurls Tricolour at Lal Chowk) ఎగరేశారు. దీనిపై బీజేపీ సెటైర్లు వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే రాహుల్‌ గాంధీ అలా జెండా ఎగరేయడం (Rahul Gandhi Raises Flag) సాధ్యమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు.
Bharat Jodo Yatra: నెహ్రూ తర్వాత లాల్ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ జెండాను ఎగరవేసిన రాహుల్ గాంధీ, ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేత
Hazarath Reddyతన ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ లాల్ చౌక్‌లో (Srinagar’s Lal Chowk) మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత (75 years after) రాహుల్ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు, అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు నేటితో ముగింపు, 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 145 రోజులపాటు మొత్తం 3,970 కి.మీ కు పైగా నడిచిన రాహుల్ గాంధీ
Hazarath Reddyకాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నేటితో ముగియనుంది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన యాత్రకు రాహుల్‌ ముగింపు పలుకనున్నారు
Telangana Govt. Vs Tamilisai: గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.. నేడు లంచ్‌మోషన్ పిటిషన్! ఎందుకంటే??
Rudraతెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
Batchula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
Rudraతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ తెల్లవారుజామున గుండుపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు.
Vatti Vasanth Kumar Passed Away: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత.. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వట్టి
Rudraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. వట్టి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్టణంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర రెండో రోజు ప్రారంభం.. షెడ్యూల్ ఇదిగో
Rudraటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
Andhra Pradesh: మార్చి 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌, గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష
Hazarath Reddyవైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఏపీ సీఎస్‌ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు
Taraka Ratna Health Update: తారకరత్నకు హార్ట్‌లో కుడి,ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్, మాసివ్‌ హార్ట్‌ ఎటాక్‌ లెఫ్ట్‌ సైడ్‌తో కుప్పకూలారని తెలిపిన బాలకృష్ణ, బెంగుళూరు తరలించేందుకు ఏర్పాట్లు
Hazarath Reddyతారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్‌లు వేయలేదు. యాంజియోగ్రామ్‌ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్‌ వేస్తారా?.. ఇతర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారా? అనేది వేచిచూడాలి.
Surgical Strike Row: దమ్ముంటే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై వీడియోలు బయటపెట్టండి, కాంగ్రెస్ నేత ర‌షీద్ అల్వి డిమాండ్, బీజేపీ ప్ర‌భుత్వాన్ని తాము నమ్మమని వెల్లడి
Hazarath Reddyభారత ఆర్మీ చేటపట్టిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేప‌గా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మ‌రో నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై వీడియో ఉంటే దాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని కాంగ్రెస్ నేత ర‌షీద్ అల్వి డిమాండ్ చేశారు.
Anil K Antony Quits Congress: కేరళలో కాంగ్రెస్ పార్టీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ, అన్ని పదవుల నుంచి తొలగిపోతున్నట్లు వెల్లడి
Hazarath Reddyకేరళలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది.
Janasena Alliance Row: జనసేన పొత్తులపై క్లారిటీ, ఏపీలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళతాం, కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం, స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyఏపీలో బీజేపీ, జనసేన మధ్య కొంతకాలంగా గ్యాప్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దాంతో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఉందా? లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు చేసిన సందర్భంగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులోనే (Janasena Alliance Row) ఉందని స్పష్టం చేశారు.
Nara Lokesh Padayatra Schedule: నారా లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు అనుమతి, షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ప్రకటన, యువగళం పూర్తి షెడ్యూల్ ఇదే..
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు (Nara Lokesh Padayatra ) పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజలు, వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగించొద్దని ఎస్పీ సూచించారు.
Bilimoria Praises Modi: భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ.. బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంస (వీడియోతో)
Rudraభూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంసించారు. చిన్నతనంలో చాయ్ అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారని కీర్తించారు.
Chris Hipkins: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ .. లేబర్ పార్టీ ప్రకటన
Rudraన్యూజిలాండ్ కొత్త ప్రధానిగా, జెసిండా ఆర్డెన్‌ స్థానాన్ని క్రిస్ హిప్ కిన్స్ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా న్యూజిలాండ్‌ ప్రస్తుత ప్రధానమంత్రి, లేబర్‌ పార్టీ నాయకురాలు జెసిండా ఆర్డెన్‌(42) ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశారు
'CM’s Bulldozer is Ready': బీజేపీలో చేరకుంటే బుల్డోజర్లు రెడీగా ఉన్నాయి, ఇళ్ల కూల్చివేత తప్పదని బీజేపీ మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా హెచ్చరి, వీడియో వైరల్
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా (Madhya Pradesh panchayat minister Mahendra Singh Sisodia)తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసంఘాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు(Congress leaders) బీజేపీలోకి చేరాలని లేకుంటే బుల్డోజర్లతో(bulldozer) ఇళ్ల కూల్చివేత తప్పదని మంత్రి సింగ్ హెచ్చరించారు.