Politics

YSRCP: బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్, యువజన విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు, పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించిన వైఎస్సార్సీపీ, లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

TS Congress on Late CM YSR: వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే సంచలనం, దివంగత మహానేతపై పొగడ్తలు కురిపించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

2003లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (late CM YS Rajashekar Reddy ) పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని సీఎల్పీ నేత అన్నారు. తన పాదయాత్రతోనే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు.

Chandrababu Kuppam Tour: నా ఇంటికి నన్ను రానివ్వకుండా అడ్డుకుంటారా, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నా, రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని చంద్రబాబు మండిపాటు

Hazarath Reddy

తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా, ర్యాలీ నిర్వహించకుండా, సభ పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు.

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు, నాకే రూల్స్‌ చెబుతారా అంటూ మండిపాటు, సభకు అనుమతి లేదంటూ కుప్పం పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ అధినేత

Hazarath Reddy

చంద్రబాబు కుప్పం పర్యటనలో (Chandrababu Kuppam Tour) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం రోడ్డు మీద సమావేశాలు జరుపుకోవడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు.

Advertisement

Chandrbabu Naidu: చంద్రబాబు కుప్పం సభకు అనుమతి నిరాకరణ, నోటీసులకు వివరణ ఇవ్వనందుకు పర్మిషన్‌ ఇవ్వడంలేదంటూ ప్రకటన

VNS

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 గంటల వరకు సరైన సమాధానం రాలేదన్నారు.

YSRCP Coordinators For Constituencies: పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ నియామకం, రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ

Hazarath Reddy

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Congress MLA Sunil Saraf:న్యూఇయర్ వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, బాలీవుడ్ పాటకు డ్యాన్స్ వేస్తూ గన్ తీసి ఫైర్,వీడియో వైరల్

Hazarath Reddy

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరఫ్ న్యూఇయర్ వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేశారు. బాలీవుడ్ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ.. సడన్‌గా జేబులోనుంచి గన్ తీశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. జనవరి 1న జరిగిన ఘటనకు సంబంధించిన దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు

Parliament Budget Session 2023: ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్‌, జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Hazarath Reddy

జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంబం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు.

Advertisement

Free Electricity For Farmers: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తు, దళితబిడ్డలకు దళితబంధు.. సీఎం కేసీఆర్‌ స్పష్టం

Rudra

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే.. రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశంగా మారుస్తామని ప్రకటించారు.

BRS Makes Foray Into AP: ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, BRSలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు (Former BJP Leader Ravela Kishore Babu), తోట చంద్రశేఖర్, పార్థసారధి బీఆర్‌ఎస్‌లోకి చేరారు. సీఎం కేసీఆర్‌ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, సిట్‌ మెమోను కొట్టివేసిన హైకోర్టు, ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయస్థానం

Hazarath Reddy

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాగా ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ చేసిన సంగతి విదితమే.

Andhra Pradesh: ఏపీలో కేసీఆర్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి ప్రజలకు కానుకగా అందిస్తారు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును (Polavaram ) పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Venkaiah Naidu: నేను ముందుగా రిటైరైపోయానేమో, రాజకీయాలపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు, తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని స్పష్టం

Hazarath Reddy

రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చాలా ముందుగా రిటైరైపోయానేమోనని అనిపిస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.

SC Verdict on Demonetisation: నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని సమర్థించిన సుప్రీంకోర్టు, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించిన సుప్రీం

Hazarath Reddy

పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నోట్ల రద్దు (2016 demonetisation decision) నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. 2016 నవంబర్‌ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్‌ సరైందనేనని బెంచ్‌ స్పష్టం చేసింది.

Pawan Selfie: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!

Rudra

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

Rishabh Pant Car Accident: ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం.. గాయాలతో దవాఖానలో చేరిన పంత్

Rudra

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్ కి తరలించారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగివస్తుండగా, ఆయన కారు రోడ్డు డివైడర్ కు డీకొని ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Andhra Pradesh: ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విన్నవించిన సీఎం జగన్

Hazarath Reddy

ఢిల్లీ పర్యటనలో భాగంగా.. బుధవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీకి సంబంధించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు పలు కీలక అంశాలపైనా కేంద్రమంత్రికి విన్నవించారు.

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీ ముందు సీఎం జగన్ ఉంచిన సమస్యలు ఇవే, ప్రధానంగా విభజన చట్టంలో సమస్యలు పరిష్కరించాలని వినతి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో బుధవారం మధ్యాహ్నాం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం జగన్‌. ముందుగా.. కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు.

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ, ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం, ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై చర్చలు

Hazarath Reddy

ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి వెంటనే రక్షణ కల్పించండి, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో యాత్రలో చేరుతున్న భారత యాత్రికులు, నాయకుల భద్రత, భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసింది.

Advertisement
Advertisement