Politics

One Nation One Election: జమిలి బిల్లు కోసం జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితా ఇదిగో..

Hazarath Reddy

జమిలి బిల్లు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది.

Pawan Kalyan: వీడియో ఇదిగో, OG OG అని అరిస్తే పనులు జరగవు, అభిమానులకు చురకలు అంటించిన పవన్ కళ్యాణ్, సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని వెల్లడి

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు చురకలు అంటించారు. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు.

BRS Vs Congress: అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

Hazarath Reddy

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

Om Prakash Chautala Dies: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా తన 89వ ఏట మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా చాలా సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు మరియు చౌదరి దేవి లాల్ జీ యొక్క పనిని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అతని కుటుంబ సభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement

Om Prakash Chautala Dies: గుండెపోటుతో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా పనిచేసిన చౌతాలా

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి.

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

సహజీవనాలు, స్వలింగ వివాహాలపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండూ చాలా తప్పుడు పద్ధతులని, వీటి వల్ల సమాజం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

KTR: అవినీతి జరగలేదని మంత్రులే చెప్పారు...ఈ కేసు నిలబడదన్న కేటీఆర్, అందరిని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పిన కేటీ రామారావు

Arun Charagonda

ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.

Delhi: అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి...పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన, అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..వీడియో

Arun Charagonda

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు.

Advertisement

KTR on Formula E Race Case: రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని, ఫార్ములా -ఈ రేస్ కేసుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్

Hazarath Reddy

ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి చేసేది ల‌త్కోర్ ప‌ని అని ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు రేవంత్ స‌ర్కార్ భ‌య‌ప‌డుతోంద‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Telangana: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ (ORR Toll contract)లో జరిగిన అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి SIT విచారణకు ఆదేశించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, అసెంబ్లీ సరిగా నడపడానికి చేతకాని వాళ్లు అసలు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు, మండిపడిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

Hazarath Reddy

వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్‌ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

Hazarath Reddy

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేకెత్తించగా, దానికి ప్రతిగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు

Advertisement

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Hazarath Reddy

బీఆర్ అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం మండిపడ్డారు. పార్లమెంట్‌లో షా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాల ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి పొడిగింపు మాత్రమేనని ఆయన అన్నారు

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Hazarath Reddy

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.

‘BJP MPs Pushed Me’: వీడియో ఇదిగో, బీజేపీ ఎంపీలే త‌న‌ను నెట్టివేశారు, తోపులాటపై స్పందించిన రాహుల్ గాంధీ, పార్ల‌మెంట్ లోప‌లికి వెళ్ల‌కుండా నన్ను అడ్డుకున్నారని వెల్లడి

Hazarath Reddy

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్క‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. నేడు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు.

Parliament Chaos: వీడియో ఇదిగో, పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లకు గాయాలు, అంబేద్క‌ర్‌పై అమిత్ షా చేసిన వాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి డిమాండ్

Hazarath Reddy

పార్ల‌మెంట్‌లోని మ‌క‌ర ద్వారం వ‌ద్ద .. ఇండియా కూట‌మి, బీజేపీ ఎంపీలు ఎదురుప‌డ్డారు. దీంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయ‌ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Advertisement

Parliament Chaos: పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం, రాహుల్ గాంధీ తోయడంతోనే కిందపడ్డానని తెలిపిన ఒడిషా ఎంపీ

Hazarath Reddy

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారు. ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తోపులాటలో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో

Arun Charagonda

ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, జేపీసీ సభ్యులుగా ప్రియాంక గాంధీ వాద్రాతో సహా 31 మంది నియామకం

Hazarath Reddy

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సభ్యులుగా లోక్ సభ నుండి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. వీరిలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ JPC సభ్యులుగా ఉన్నారు.

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Hazarath Reddy

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. ఎన్‌డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది

Advertisement
Advertisement