రాజకీయాలు

One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Hazarath Reddy

లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.

One Nation One Election Bill: సుప్రీం లీడర్ ఈగో మసాజ్ కోసమే జమిలి ఎన్నికల బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

One Nation, One Election: వీడియో ఇదిగో, లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌

Hazarath Reddy

కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ వెంటనే వ్యతిరేకించారు, ఈ ప్రతిపాదన "ఈ సభ యొక్క శాసన సామర్థ్యానికి మించినది" అని అన్నారు.

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హరీష్‌ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.

Advertisement

Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌పై శాస‌న‌స‌భ‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్

Hazarath Reddy

నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.

One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

దేశవ్యాప్తంగా ఎంతో చర్చకు దారితీసిన జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు)పై నేడు మరో కీలక అడుగు పడనుంది. మంగళవారం లోక్‌ సభలో కేంద్రం రాజ్యాంగ(129వ) సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనుంది.

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా కేబినెట్‌ భేటీ జరిగింది.ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

KTR Slams CM Revanth Reddy: రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మవి నువ్వు

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొలువుదీరాక రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో ఓ సభ్యుడు జిల్లాల కుదింపుపై ప్రశ్న వేయగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాను కూడా రద్దు చేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అసెంబ్లీ వేదికగా నిజమేనని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని అసెంబ్లీ వేదికగా బాంబ్‌ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు.

Advertisement

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, బీఆర్‌ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి, సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసిన మంత్రి సీతక్క

Hazarath Reddy

సర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు.

Telangana Assembly Session 2024: సంక్రాంతి తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో

Hazarath Reddy

కొత్త రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. అలాగే తెలంగాణలో బీసీ కుల గణన ప్రక్రియ కొనసాగుతోందని, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకొని, ఈ డేటా ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2024 ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.

Telangana Cabinet Today: నేడు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానున్నది. శాసనసభ ప్రాంగణంలోని అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం కానున్నది.

Advertisement

AAP Fourth List: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫైనల్ లిస్ట్ రిలీజ్, న్యూఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్..కల్కజీ నుండి సీఎం అతిషి పోటీ..పూర్తి లిస్ట్ ఇదే

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుదిజాబితాను రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలో నిలవగా కల్కజి నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. 38 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది ఆప్. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫుల్ ఫోకస్ చేసింది.

Haryana Farmers Protest: మరోసారి రైతుల ఛలో ఢిల్లీ, హర్యానా - పంజాబ్ సరిహద్దుకు భారీగా చేరుకుంటున్న రైతులు.. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు

Arun Charagonda

పంటలకు కనీస మద్దతు ధఱకు చట్టబద్దత కల్పించడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఇవాళ మరోసారి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా - పంజాబ్ సరిహద్దుకు భారీగా రైతులు చేరుకుంటున్నారు. రైతుల ఛలో ఢిల్లీకి అనుమతి లేకపోవడంతో ఢిల్లీ సరిహద్దులో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వెల్లడి

Hazarath Reddy

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు

Top Newsmakers of 2024: కర్ణాటక సెక్స్ టేపుల కుంభకోణం నుంచి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ దాకా, 2024లో ప్రముఖంగా వార్తలో నిలిచిన జాబితా ఇదే..

Hazarath Reddy

2024లో, అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులు వారి చర్యలు, విజయాలు, వివాదాల కోసం భారతదేశం అంతటా ముఖ్యమైన వార్తల్లో చేరారు.వీరంతా దేశం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ప్రధాన వార్తా కథనాలకు కేంద్రంగా ఉన్నారు

Advertisement
Advertisement