Politics
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, అసెంబ్లీ సరిగా నడపడానికి చేతకాని వాళ్లు అసలు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు, మండిపడిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
Hazarath Reddyవీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి
Hazarath Reddyభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేకెత్తించగా, దానికి ప్రతిగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు
CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Hazarath Reddyబీఆర్ అంబేద్కర్పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం మండిపడ్డారు. పార్లమెంట్లో షా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాల ఆర్ఎస్ఎస్ భావజాలానికి పొడిగింపు మాత్రమేనని ఆయన అన్నారు
Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
‘BJP MPs Pushed Me’: వీడియో ఇదిగో, బీజేపీ ఎంపీలే తనను నెట్టివేశారు, తోపులాటపై స్పందించిన రాహుల్ గాంధీ, పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారని వెల్లడి
Hazarath Reddyపార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్కర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నేడు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు.
Parliament Chaos: వీడియో ఇదిగో, పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్పుత్లకు గాయాలు, అంబేద్కర్పై అమిత్ షా చేసిన వాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి డిమాండ్
Hazarath Reddyపార్లమెంట్లోని మకర ద్వారం వద్ద .. ఇండియా కూటమి, బీజేపీ ఎంపీలు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్పుత్ గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Parliament Chaos: పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం, రాహుల్ గాంధీ తోయడంతోనే కిందపడ్డానని తెలిపిన ఒడిషా ఎంపీ
Hazarath Reddyపార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారు. ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తోపులాటలో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో
Arun Charagondaఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, జేపీసీ సభ్యులుగా ప్రియాంక గాంధీ వాద్రాతో సహా 31 మంది నియామకం
Hazarath Reddyవన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సభ్యులుగా లోక్ సభ నుండి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. వీరిలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ JPC సభ్యులుగా ఉన్నారు.
One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు
Hazarath Reddyలోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. ఎన్డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది
Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్
Hazarath Reddyగత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను నార్సింగ్ లో ఏర్పాటు చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Formula E Race Case: ఫార్ములా-ఈ కార్ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్
Hazarath Reddyఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Narendra Varma Raju Vegesana: వీడియో ఇదిగో, మందేసి చిందేసి బీజేపీ నేతకు ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బర్త్డే పార్టీలో రచ్చ చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
Hazarath Reddyసతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు.
One Nation, One Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఈ-ఓటింగ్, కొత్త పార్లమెంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి
Hazarath Reddyలోక్సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, ప్రతిపక్షాల డిమాండ్పై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Hazarath Reddyలోక్సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Hazarath Reddyలోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.
One Nation One Election Bill: సుప్రీం లీడర్ ఈగో మసాజ్ కోసమే జమిలి ఎన్నికల బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఎన్డీయే ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. నేడు లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
One Nation, One Election: వీడియో ఇదిగో, లోక్సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
Hazarath Reddyకేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్కు చెందిన మనీష్ తివారీ వెంటనే వ్యతిరేకించారు, ఈ ప్రతిపాదన "ఈ సభ యొక్క శాసన సామర్థ్యానికి మించినది" అని అన్నారు.
Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.
Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.