రాజకీయాలు

AP Cabinet Meeting: 3 రోజుల్లో తేలిపోనున్న ఏపీ రాజధాని భవిష్యత్తు, ఈ నెల 27న విశాఖలో క్యాబినెట్ మీటింగ్, స్వాగతించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా, చంద్రబాబుకి సవాల్ విసిరిన స్పీకర్ తమ్మినేని, అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు

Hazarath Reddy

మరో మూడు రోజుల్లో ఏపీ రాజధాని భవిష్యత్తు తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Ap Cabinet Meeting) డిసెంబర్ 27న విశాఖలో జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ఏపీ రాజధాని అంశంపై ఓ స్పష్టత రానుంది. విశాఖలో(Visakhapatnam) కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ కేబినెట్ భేటీలోనే ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.

Rachakonda Police: రాచకొండ పోలీసుల ట్విస్ట్, పార్టీల్లో సింగిల్స్‌కు అనుమతి లేదు, జంటలకు మాత్రమే ప్రవేశం, తాగి పట్టుబడితే మీ జేబులు గుల్లే, మీ వాహనం పోయినట్లే, న్యూఇయర్ నిబంధనలను కఠినతరం చేసిన రాచకొండ పోలీసులు

Hazarath Reddy

కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు (Rachaconda and Cyberabad police) జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా దిశ ఘటన (Disha Murder case)తీవ్ర ఆందోళనలు రేకెత్తించిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ ఘటన మద్యం మత్తులో జరగడం న్యూ ఇయర్ పార్టీలో (New Year’s Eve celebrations)మద్యం అంశం ప్రధానంగా ఉండటంతో పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Saryu Rai: సీఎంకు షాకిచ్చిన ఇండిపెండెంట్, ఎవరీ సరయూ రాయ్ ?, సీఎం రఘుబర్ దాస్ పైనే ఆయన ఎందుకు పోటీ చేశారు, బీజేపీ ఆయన్ని ఎందుకు వదులుకుంది?, సరయూ రాయ్‌పై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో (Jharkhand Election Results)బీజేపీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఇంకా తేరుకోని షాక్ ఏంటంటే ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్ (Raghubar Das ) స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన.. అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రఘుంబర్ దాస్ ఓ స్వతంత్ర అభ్యర్థి చేతిలో సీఎం సైతం ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Jharkhand Election Results: చిత్తయిన బీజేపీ, 47 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి, 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, రఘుబర్ దాస్ రాజీనామా, నూతన ముఖ్యమంత్రి కానున్న హేమంత్ సోరెన్

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Jharkhand Assembly Elections 2019) బీజేపీకి షాకింగ్‌ ఫలితాలు ఎదురయ్యాయి. జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి (JMM-Congress-RJD) మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మెజారిటీ (41) స్థానాలను కూటమి అధిగమించి 47 సీట్లు (ఆధిక్యం+విజయం)సాధించింది. బీజేపీ (BJP)పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జేవీఎం(JVM) 3, ఏజేఎస్‌యూ(AJSU) 2, ఇతరులు స్థానాల్లో గెలుపొందారు.

Advertisement

NRC-AP CM YS Jagan: ఎన్‌ఆర్సీపై బీజేపీకి ఏపీ సీఎం షాక్, రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదు, మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం వైయస్ జగన్, కడపలో నీటిపారుదల ప్రాజెక్టులకు, ఉక్కు పరిశ్రమకు శంకు స్థాపన

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి (National Register of Citizens)వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు.

Jharkhand Election Results-Amit Shah: ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, 5 సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న హోమంత్రి అమిత్ షా

Hazarath Reddy

ఈ ఫలితాలపై హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. జార్ఖండ్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇదే సందర్భంలో గత ఎన్నికల్లో మాకు అధికారాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉన్నామని వారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.

JMM Leader Hemant soren: జార్ఖండ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది, ఈ విజయం ప్రజలకు అంకితమన్న హేమంత్ సోరెన్, సైకిల్ తొక్కుతూ హుషారుగా.., సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత

Hazarath Reddy

ఎన్నికల తరువాత జార్ఖండ్ తరువాతి ముఖ్యమంత్రిగా రేసులో ఉన్న హేమంత్ సోరెన్ (Hemanth soren) ఫలితాలపై జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) (Jharkhand Mukti Morcha (JMM))దాని మిత్ర పక్షాలు భారీ విజయం వైపుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు (Jharkhand Assembly Elections Results 2019)చూసిన తరువాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Jharkhand Election Results: జార్ఖండ్‌లో బీజేపీకి ఘోర పరాభవం, 37 నుంచి 25 స్థానాలకు పడిన గ్రాఫ్, బంఫర్ మెజార్టీ దిశగా కాంగ్రెస్-జేఎంఎం కూటమి, మోడీ, అమిత్‌షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్న శివసేన, ప్రతిపక్షాలు

Hazarath Reddy

జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు (Assembly Election Results 2019) బీజేపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో 37 స్థానాలను కైవసం చేసుకున్న భారతీయ జనతాపార్టీ (BJP)ఈ సారి 25 స్థానాలకే పరిమితం అయ్యేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్-జేఎంఎం కూటమి భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీపై శివసేన, ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

Advertisement

AP Capital Political Row: తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్, మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటున్న అమరావతి రైతులు, ఆడపడుచులు రోడ్డెక్కారంటున్న చంద్రబాబు, కొనసాగుతున్న రైతుల ధర్నాలు, ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని అంశం

Hazarath Reddy

ఏపీ రాజధాని అంశం (AP Capital Row)ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది. మూడు రాజధానుల అంశం ( 3 Capitals) తెరపైకి రావడంతో అది రాజకీయ రంగును పులుముకుంది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పడం, జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) తన నివేదికను సమర్పించడం, వారు రాజధాని గురించి మీడియాతో మాట్లాడటం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఏపీ రాజధాని అంశం (AP Capital) ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.

Cong-JMM Touches Majority Mark: మెజార్టీని దాటేసిన కాంగ్రెస్ - జేఎంఎం కూటమి, బీజేపీకి షాకిస్తున్న ఫలితాలు, హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, గెలుపు మాదే అంటున్న బీజేపీ

Hazarath Reddy

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ( Jharkhand Assembly Election Results 2019)తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. అయితే ఫలితాలు వెలువడేకొద్దీ బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి గెలుపు దిశగా (Cong-JMM Touches Majority Mark) దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యుల మద్దతు అవసరం.

DMK Mega Rally At Chennai: డిఎంకే మెగా ర్యాలీ, పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసనలు, ర్యాలీకి అనుమతిని నిరాకరించిన పోలీసులు, ర్యాలీ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలన్న మద్రాసు హైకోర్టు

Hazarath Reddy

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమిళనాడులోని(Tamil Nadu) డిఎంకె మరియు దాని మిత్రపక్షాలు (DMK and its alliance parties ) చెన్నైలో (Chennai) మెగా ర్యాలీని ప్రారంభించాయి. ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ఎండీఎంకే అధినేత వైగోతో పాటు పలువురు పాల్గొన్నారు.

Jharkhand Assembly Election Results 2019: ప్రారంభమైన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌, హంగ్ అసెంబ్లీ వస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైనే అందరి కన్ను, మధ్యాహానికి తొలి ఫలితం వెలువడే అవకాశం

Hazarath Reddy

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Jharkhand Assembly Election Results) ప్రారంభమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ( Jharkhand) 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్‌(JMM-Congress) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.

Advertisement

AP Capital Suspense: ఏపీ రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా తేలని ప్రభుత్వ నిర్ణయం, ఎవరివాదనలు వారివే, తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి, ఈ నెల 27న క్యాబినెట్ మీటింగ్‌లో సస్పెన్స్ కి తెరపడే అవకాశం

Hazarath Reddy

అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) మూడు రాజధానులు (3 Capitals) అంశం తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు( AP POlitics) పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతలు దీన్ని సమర్ధిస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

Palle Pragathi-CM KCR: రంగంలోకి దిగుతున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్, పల్లె ప్రగతిపై సమీక్షను నిర్వహించిన తెలంగాణా సీఎం కేసీఆర్, 2020 జనవరి 1 నుంచి ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్

Hazarath Reddy

తెలంగాణలో పల్లె ప్రగతి (Palle Pragathi) కార్యక్రమంపై సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) రంగంలో దిగుతున్నాయని తెలంగాణా (Telangana) సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తాయని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

PM Narendra Modi Rally: నా దిష్టి బొమ్మలు కాల్చండి..అంతేకాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకండి, ఢిల్లీ పార్టీలేవి మోడీని అడ్డుకోలేవు, సీఏఏపై ప్రజల తీర్పును గౌరవించండి, ప్రతిపక్షాలకు కనీసం చట్టాలు కూడా తెలియదు, రామ్ లీలా మైదానంలో గర్జించిన ప్రధాని మోడీ

Hazarath Reddy

రామ్ లీలా మైదాన్ (Ramlila Maidan) అనేక వేదికలకు సాక్షిగా నిలిచిందని ప్రధాని మోడీ (PM Narendra Modi) అన్నారు. ఢిల్లీలోని (Delhi) రామ్ లీలా మైదానంలో ఈ రోజు నిర్వహించిన ర్యాలీ సభలో ఆయన మాట్లాడుతూ... 'సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ (BJP) శ్రేణులకు ధన్యావాదాలు. మనకు స్వాతంత్ర్యం వచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది.

AIMIM Chief Asaduddin Owaisi: ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి, అవసరమైతే దేశం కోసం ప్రాణాలనైనా అర్పిస్తా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించుకుందాం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

Hazarath Reddy

నరేంద్ర మోడీ (Narendra Modi) నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను రెప రెపలాడించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరా బాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ (AIMIM chief Asaduddin Owaisi) పిలుపునిచ్చారు. దేశంలో ప్రతీ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా (Tricolour Flag) ఎగరాలని,దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా తాను సిద్ధమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Advertisement

Maha Aghadi Sarkar: ‘మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ, మహాత్మా జ్యోతిరావ్ పూలే రుణాల రద్దు పథకం కింద అమల్లోకి, ప్రభుత్వంపై రూ.40వేల కోట్ల భారం, సీఎం ఉద్ధవ్‌పై మండిపడిన బీజేపీ

Hazarath Reddy

ధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra GOVT)సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర రైతులకు (Farmers)తీపికబురును అందిస్తూ ఉద్ధవ్ సర్కారు రైతు రుణమాఫీ(Farmer Loan Waiver) అమలు చేసింది.

YSR Netanna Nestam Scheme: చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు, పథకాన్ని ధర్మవరంలో ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు

Hazarath Reddy

చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్ నేతన్న నేస్తం (YSR Netanna Nestam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో (dharmavaram) వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు.

AP Capital Row: ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజధాని అంశం, ఎవరి వాదనలు వారివే, ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోంది ?, ఏపీ క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది ?,ఇప్పటి వరకు నాయకులు ఏమన్నారో వారి మాటల్లో...

Hazarath Reddy

మొన్నటి దాకా ఇసుక వార్ మీద నడిచిన ఏపీ రాజకీయాలు (Andhra pradesh politics) ఇప్పుడు రాజధాని (AP Capital Row) మీదకు తిరిగాయి. అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) ఏపీ రాజధానిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

DK Shivakumar: క్రికెట్ బ్యాటు పట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత, పాత్రికేయులతో కలిసి క్రికెట్ ఆడిన డికె శివకుమార్, యడ్డూరప్ప ప్రభుత్వంపై విమర్శలు, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ముఖ్యమంత్రి, హోం మంత్రే బాధ్యులన్న డీకే

Hazarath Reddy

ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ ఆటవిడుపు కోసం సరదాగా ఏవైనా ఆటలు ఆడుతుంటారు. కొద్ది పాటి సమయం దొరికితే తమ ముచ్చటను ఆ విధంగా తీర్చుకుంటుంటారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ డికే శివకుమార్ (Senior Congress leader DK Shivakumar) కూడా క్రికెట్ బ్యాటు పట్టారు.

Advertisement
Advertisement