Politics
One Year Of TRS GOVT: 88 నుంచి సెంచరీ వైపు దూసుకెళ్లిన కేసీఆర్, ఏడాది పాలన అంతా వ్యూహాల మయమే, ఎత్తుకు పై ఎత్తులతో దూకుడు, గులాబి అధినేత ఏడాది పాలనపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyతెలంగాణా సీఎం (Telangana CM)గా కేసీఆర్ (KCR) రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఉద్యమపార్టీగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ (TRS), 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టింది. టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు (K Chandrasekhar Rao) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) గత ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయభేరి మోగించింది.
AP Assembly Approves Disha Act Bill: మహిళలపై అత్యాచారం చేస్తే ఇకపై ఉరిశిక్షే, శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం, 4 నెలల విచారణ సమయాన్ని కేవలం 21 రోజుల్లో పూర్తి చేసేలా బిల్లు
Hazarath Reddyమహిళల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ యాక్టు (AP disha Act) కు శాసనసభ ఆమోదం లభించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం(Assembly session)లో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో బిల్లును హోం శాఖ మంత్రి సుచరిత(home minister sucharitha) ప్రవేశపెట్టారు.
'Rape In India' Remark: రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టుబడిన అధికార పార్టీ, క్షమాపణ ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ, అలా అనడానికి కారణం తెలుసుకోండి అంటున్న కాంగ్రెస్ ఎంపీ
Hazarath Reddyభారతదేశం(India)లో జరుగుతున్న రేప్‌లపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ(Lok Sabha)లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా(Rape In India)వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
AP Assembly Session: ఉన్నాది ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అయిదవ రోజు రచ్చరచ్చగా మారిన అసెంబ్లీ సమావేశాలు
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly session) నేడు ఐదో రోజుకు చేరుకున్నాయి. కాగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య (TDP vs YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. సభ ప్రారంభంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు (Chandra babu)క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.
Anti-CAB Protests: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలు, రైల్వే స్టేషన్లకు నిప్పు, సైన్యాన్ని మోహరించిన కేంద్రం, ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ హామి
Vikas Mandaఅస్సాంలో తీవ్రస్థాయిలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని తెలిపారు....
AP Assembly Session: సీఎం జగన్ ఒక ఉన్మాది, జీవో 2430 ఎత్తివేయాలంటూ చంద్రబాబు విమర్శలు, చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదు, 40 ఏళ్ల అనుభవం ఉన్నా ఇంగిత జ్ఞానం లేదంటూ సీఎం జగన్ కౌంటర్
Vikas Mandaసీఎం జగన్ ఉన్మాది అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన వీడియోలను సభలో అధికార సభ్యులు ప్రదర్శించారు. సభా నాయకుడి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు....
Citizenship Amendment Bill 2019: పౌరసత్వ (సవరణ) బిల్లు-2019కు రాజ్యసభ ఆమోదం, ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు 125 ఎంపీలు అనుకూలం, 105 సభ్యులు వ్యతిరేకంగా ఓటు, ఉభయ సభల్లో నెగ్గిన బిల్లు
Vikas Mandaఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు పంపనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఈ బిల్లు చట్టరూపం దాల్చబడి నిర్ధేషించిన...
Janasena vs Janasena MLA: పవన్ కళ్యాణ్- జనసేన జాన్తా నహీ, అధినేత ఒకవైపు.. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఒకవైపు, ఇంగ్లీష్ మీడియం అంశంలో జగన్ ప్రభుత్వానికి రాపాక వరప్రసాద్ సంపూర్ణ మద్ధతు
Vikas Mandaపవన్ నిలదీస్తున్నారు. సీఎం జగన్ పై నేరుగా విమర్శల దాడి చేస్తూ వస్తున్నారు. అయితే అసెంబ్లీలో జనసేన ఏకైక గొంతుక రాపాక మాత్రం ప్రతీసారి సీఎం జగన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి షాక్‌లు ఇస్తున్నారు...
AP Assembly Session: స్పీకర్ తమ్మినేని- ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య సభలో వాగ్యుద్ధం, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన అధికార పక్ష సభ్యులు, వేడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
Vikas Mandaనాకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారంటా, నేను చేసిన అభివృద్ధి కారణంగానే బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా ప్రపంచ నేతలంతా హైదరాబాద్ వచ్చారు, ప్రపంచ నేతలంతా తనను కలవడానికి ఒకప్పుడు హైదరాబాద్ వచ్చారు, ప్రపంచమంతా నా ...
Imran Khan On Citizenship Amendment Bill: పౌరసత్వ బిల్లును ఖండించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని విమర్శలు, హిందూ భావన విస్తరణకే అన్న ఆరెస్సెస్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం
Hazarath Reddyపౌరసత్వ సవరణ బిల్లు(Citizenship Amendment Bill)కు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని దాయాది దేశం పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌(India) ఉల్లంఘించిందని మండిపడ్డారు.
AP Assembly Session 2nd Day Highlights: నేను 25 ఏళ్ళ యువకుడ్ని,మీరు నన్నేమి చేయలేరన్న చంద్రబాబు, రాజీనామాకు సిద్ధమంటూ సవాల్, ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్, అన్నీ అమలు చేసి తీరుతామన్న ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్(Andhra pradesh) అసెంబ్లీ శాసన సభ సమావేశాలు రెండో రోజూ(AP Assembly Session 2nd Day) యుద్ధాన్నే తలపించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra babu)గతంలో సీఎంగా ఉన్న సమయంలో రైతులను నిలువునా ముంచారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అలాగే చంద్రబాబు తనయుడు లోకేష్ (Nara lokesh)ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే సెటైర్లు వేశారు.
Uddhav Thackeray: లోక్‌సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇవ్వం, పౌరసత్వ సవరణ బిల్లుపై స్వరం మార్చిన శివసేన, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే బిల్లుకు మద్ధతు, వెల్లడించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
Hazarath Reddyబీజేపీ (BJP) ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకు వస్తున్న పౌరసత్వ బిల్లుపై(Citizenship Amendment Bill 2019) శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభలో తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు.
Polavaram Project: కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలి, రాజ్యసభలో ఎంపి కెవీపీ రామచంద్రరావు, పోలవరంపై తెలుగులో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్,ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌
Hazarath Reddyపార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు(YCP MP KVP Ramachandra rao), బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(BJP MP GVL Narasimha rao) రాజ్యసభలో(Rajyasabha) పోలవరం(Polavaram Project) అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.
Adhir Ranjan Chowdhury: ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, రేప్ ఇన్ ఇండియా, ప్రధాని మోడీ మహిళా నేరాల గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు, దేశం లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందన్న అధిర్ రంజన్ చౌదరి
Hazarath Reddyదేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఫైర్ అయ్యారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్‌ ఇండియా దిశగా కాకుండా రేపిన్‌ ఇండియా(Make In India To Rape In India) వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు.
Military Plane Missing: 38 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, అసలేం జరిగింది ?
Hazarath Reddyచిలీ (chile) దేశ‌ వైమానిక ద‌ళానికి చెందిన విమానం అదృశ్య‌మైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేదు. అంటార్కిటికా వెళ్తున్న‌రూట్లో ఆ విమానం (Military Plane Missing)ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సీ-130 హెర్క్యూల్స్(C-130 Hercules) ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్ స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం ఆరు గంట‌ల‌కు విమానం మిస్సైంది.
Woman Lives In Toilet: మరుగుదొడ్డే ఆమె నివాసం, నలుగురు కూతుర్లకు అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది ?, ఒడిశాలో ఓ మహిళ ఆవేదన, మేము ఏమీ చేయలేమంటున్న సర్పంచ్
Hazarath Reddyదేశం ఆర్థికంగా ముందుకు వెళుతున్నా సామాన్యలు జీవితాల్లో ఎటువంటి మార్పు కానరావడం లేదు. నాయకుల హామీల మూటలు పేపర్లకే పరిమితమవుతున్నాయి. కనీసం కూడు గూడు అనేవి కూడా వారికి గగనం అయ్యే పరిస్థితులు కళ్ళముందు కదలాడుతున్నాయనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒడిశా(odisha)లోని ఒక గిరిజన మహిళ (tribal woman)ఉండటానికి ఇల్లు లేక, కొనేందుకు డబ్బులు లేకపోవడంత మూడేళ్లపాటు మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది.
Quality Rice Distribution In AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, అసెంబ్లీలో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి, నాలెడ్జ్ అంశం మీద ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కొడాలి నాని కౌంటర్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ రెండో రోజు శీతాకాల సమావేశాల్లో సన్నబియ్యంపై(Quality Rice) చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ (TDP vs YCP)సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట తప్పిందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (MLA Acchem Naidu) ప్రశ్నించారు. ముందు సన్న బియ్యం అన్నారు.
US Commission On CAB 2019: పౌరసత్వ సవరణ బిల్లుపై యూఎస్ ఫెడరల్ కమీషన్ ఆందోళన, అమిత్ షా సహా భారత అగ్ర నాయకత్వంపై అమెరికా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని సూచన
Vikas Mandaతమ అంతర్గత వ్యవహారాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని మోదీ సర్కార్ గతంలోనే చాలా సార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు USCIRF చేసిన ఆరోపణలను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మత స్వేచ్ఛపై సమీక్ష చేసేందుకు భారత్ వస్తామని తెలిపిన USCIRF సభ్యులకు పలు మార్లు వీసా ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది....
Speaker vs TDP: అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు, సభ్యుల గొంతు నొక్కితే ఊరుకోను, ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంలో నేను భాగమే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వంశీకి సీటు కేటాయిస్తాం, టీడీపీ ఆరోపణలపై మండిపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly Winter Session 2019) రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ(Assembly)ని వైఎస్సార్‌సీపీ సభ్యులు పార్టీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని, ప్రజలు ఎన్నుకొని ఇక్కడికి పంపించారని తెలిపారు.
Citizenship Amendment Bill 2019: పౌరసత్య సవరణ బిల్లు లోక్‌సభలో అర్ధరాత్రి ఆమోదం, అసలు పరీక్ష రాజ్యసభలో, తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన బీజేపీ, ఈశాన్య రాష్ట్రాల్లో తారాస్థాయికి నిరసనలు
Vikas Mandaఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రాలలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (NESO) మరియు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈశాన్యంలో చాలా చోట్ల బంద్ కు పిలుపునిచ్చారు....