రాజకీయాలు

Harish Rao:పంజాగుట్టలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని అందులో పేర్కొన్నారు.

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, రేపు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా

Arun Charagonda

మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. 11 రోజుల సస్పెన్స్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక సీఎం పదవిని ఆశీంచిన షిండేను బుజ్జగించడంలో బీజేపీ సక్సెస్ అయింది. దీంతో ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్‌ను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్‌ వేడుకల్లో సీఎం మాట్లాడారు.భాగ్యనగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు

AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

Hazarath Reddy

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

Advertisement

AP Cabinet Meeting: మరికొద్ది క్షణాల్లో ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం

Rudra

ఏపీ సచివాలయంలో మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగనున్నది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Vijaysai Reddy Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ

Hazarath Reddy

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి భేటి అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులు మీద ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

Andhra Pradesh: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీలో కీలక అంశాలు చర్చకు, కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు

Telangana: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

త్వరలోనే గ్రూప్‌-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 563 మంది గ్రూప్‌- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది.

Advertisement

Minister Sridhar babu: ట్యాంక్ బండ్ పై కారు భీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్.. స్వయంగా చక్కదిద్దిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద ఓ కారు భీభత్సం సృష్టించింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న ఓ కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకురావడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Maharastra CM Swearing-In Ceremony: డిసెంబర్ 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణం.. సీఎం రేసులో ముందంజలో ఫడ్నవీస్‌.. శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పోస్టులు

Rudra

మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎన్‌సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ వ్యాఖ్యల ప్రకారం బీజేపీకి ముఖ్యమంత్రి పదవి అని, ఎన్‌సీపీ, శివసేనలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అని స్పష్టమవుతున్నది.

Gautam Adani Indictment: అమెరికా నుంచి ఎలాంటి సమన్లు మాకు రాలేదు, గౌతం అదానీ లంచం ఆరోపణల్లో యూఎస్ సమన్లపై క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

లంచం ఆరోపణలో కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)తో పాటు, ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేశారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారంనాడు తోసిపుచ్చింది.

Jagan Districts Tour: ఇకపై రెండు రోజుల పాటు కార్యకర్తలతోనే, వైఎస్ జగన్ కీలక నిర్ణయం, సంక్రాంతి తర్వాత జిలాల పర్యటనకు శ్రీకారం

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.

Advertisement

Jagan Districts Tour: 16 నెలలు బెయిల్ కూడా ఇవ్వకుండా నన్ను జైల్లో పెట్టారు, మనలో పోరాటం ఆగకూడదు, వైసీపీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్‌ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.

Jagan Meeting With Party Leaders: కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి, ఇకపై కార్యకర్తలతోనే ఉంటానని స్పష్టం చేసిన వైఎస్ జగన్

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు

Smuggling Ration Rice in Kakinada: బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారు ? కాకినాడ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Balineni Slams YS Jagan: జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని, జగన్ హయాంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ..

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన పిఠాపురం వాసులు, వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం

Hazarath Reddy

రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తూ, పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగారు..సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఫాతిమా పై బాధితులు పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు .అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తుంది అంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు

AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)

Rudra

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టయ్యారు. వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేశారన్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు.

BRS Deeksha Diwas: నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్‌’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది.

Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన

Hazarath Reddy

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిరిసిల్ల కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల ఐఏఎస్‌ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్‌ ఆరోపణలు సరికాదంటూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఖండించింది.

Advertisement
Advertisement