Politics

Sabarimala & Rafale: మూడు కీలక తీర్పులు నేడే, శబరిమల, రాఫేల్, చౌకీదార్ చోర్ హై పిటిషన్లపై తుది తీర్పు, శబరిమలలో భద్రత కట్టుదిట్టం, అందరి కళ్లు ఈ తీర్పు పైనే..

Hazarath Reddy

య తీర్పు( historic verdict on the Ayodhya )ను వెలువరించిన సుప్రీంకోర్టు (Supreme Court ) రాజ్యాంగ ధర్మాసనం నేడు మరో మూడు కీలక తీర్పులను(Sabarimala & Rafale Review Petitions) ఇవ్వనుంది. వీటిలో ఒకటి హిందువుల మత విశ్వాసానికి చెందిన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించే అంశం కాగా. మిగతా రెండు రాజకీయ దుమారం రేపిన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినవి, వీటితో పాటు రాఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని మోడీపై రాహుల్‌ చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలు. ఈ మూడు పిటిషన్లపై దేశ అత్యన్నత న్యాయస్థానం తుది తీర్పును ఇవ్వనుంది.

JNU Students Protest: ఫీజుల పెంపుపై గర్జించిన జెఎన్‌యూ విద్యార్థులు, ఆందోళనలతో అట్టుడికిన వర్శిటీ, పాక్షికంగా వెనక్కి తగ్గిన జెఎన్‌యూ పాలక మండలి, ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పిన స్టూడెంట్స్ యూనియన్

Vikas Manda

మెస్ ఛార్జీలు, ఇతర సదుపాయాలు మరియు సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆందోళన విరమించేది లేదని జవహర్‌లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్...

Telangana RTC Strike -High Court: ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 18కి వాయిదా,  రోజులు గడుస్తున్నా ఏమి తేల్చలేకపోతున్న ఉన్నత న్యాయస్థానం, ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం

Vikas Manda

గత 40 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా సమ్మెపై హైకోర్ట్ ఎటూ తేల్చలేకపోతుంది. అక్టోబర్ 6న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 9-10 నుంచి విచారణ ప్రారంభమైంది....

AP GOVT Sensational Decision: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష, ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఇసుక వారోత్సవాలపై పలు సూచనలు, ఈ నెల14 నుంచి ఇసుక వారోత్సవాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఈ మధ్య రాజకీయాస్త్రంగా మారిన ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో అన్ని వార్తలకు ఒకేసారి చెక్ పెట్టారు. ఇసుక కొరతకు కారణమవుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Kawasi Lakhma: మా రోడ్లన్నీ హేమమాలిని చెంపల మాదిరిగా ఉంటాయి, చత్తీస్‌ఘడ్ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న బీజేపీ నేతలు, గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి

Hazarath Reddy

సీనియర్ కాంగ్రెస్ లీడర్, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా (Chhattisgarh Minister Kawasi Lakhma) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ్లను హేమామాలినీ(actress Hema Malini) చంపలతో పోల్చారు.

TSRTC Strike at Day 40: హైకోర్ట్ ప్రతిపాదనపై విముఖత వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీపై అత్యున్నత స్థాయి కమిటీ అవసరం లేదని అఫిడఫిట్ దాఖలు, ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ

Vikas Manda

నేటితో ఆర్టీసీ సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్ట్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేవని, ఇక ఆఖరి ప్రయత్నంగా సమస్య పరిష్కారం కొరకు మరియు సమ్మె చట్ట విరుద్ధమా, కాదా?...

Rafale,Chowkidar Chor Hai Verdicts: రాఫెల్‌ రివ్యూ పిటిషన్‌పై రేపు కీలక తీర్పు, చౌకీదార్ చోర్ హై పిటిషన్ పై కూడా తీర్పు వచ్చే అవకాశం, ఇప్పటికే దీనిపై సారీ చెప్పిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi )సారథ్యంలోని సుప్రీంకోర్టు (Supreme Court )ధర్మాసనం వచ్చే వారంలో 3 రోజుల్లో 3 కీలకమైన తీర్పులు ఇవ్వనుంది. రేపు రాఫెల్ రివ్యూ పిటిషన్ల(Rafale review petitions)కు సంబంధించి తీర్పును వెలువరించనుంది.

Karnataka Disqualified MLAs Case Verdict: కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు, ఆ 17 మందికీ ఉపఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు

Hazarath Reddy

కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌ (Disqualified Karnataka MLAs' Case )పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వారిపై అనర్హత వేటు వేస్తూ జూలైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వీరంతా 2023 వరకు సభాకాలం ముగిసేదాకా (current assembly ends in 2023) ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టేసింది.

Advertisement

SC's Vital Verdicts Today: ఈ రోజు మరో రెండు చారిత్రాత్మక తీర్పులు, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్ వస్తుందా..రాదా అనే దానిపై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు, కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత కేసుపై కూడా కీలక తీర్పు

Hazarath Reddy

అయోధ్య భూవివాదం కేసులో గత శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం మరో రెండు కీలక అంశంలో తీర్పునివ్వడానికి సిద్ధమైంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావించే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్‌లు ఎన్ వీ రమణ, డీ వై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నది.

Hawala Racket: దక్షిణాదిన హవాలా దందా, రూ.3,300 కోట్ల స్కాం వెలుగులోకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కేంద్రంగా హవాలా స్కామ్, ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా హవాలా స్కాం వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్‌(hawala racket)ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department)బయటకు తీసుకువచ్చింది.

George Reddy: పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను.., ముఖ్యమంత్రి అయ్యేవాడు! పవన్ కళ్యాణ్‌ను జార్జ్ రెడ్డితో పోల్చిన నాగబాబు, సినిమా కథపై ప్రశసంలు

Vikas Manda

జార్జ్ రెడ్డి కథ వినా, ఆయన గురించి మాట్లాడినా ఎంతో ప్రేరణ, ఉత్తేజం, స్పూర్థి కలుగుతాయి. అతణ్ని చూస్తే నాకు తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి వ్యక్తిత్వం, అతడి పోరాడే తత్వం, అతడి ఎమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్....

President's Rule: మహారాష్ట్రలో మళ్ళీ ఎన్నికలు? రాష్ట్రపతి పాలనకు రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం, సుప్తచేతనావస్తకు చేరిన అసెంబ్లీ

Vikas Manda

రాష్ట్రపతి పాలన విధించడం పట్ల శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మంగళవారం రాత్రి 8:30 వరకు సమయం ఉన్నా, ఈలోపే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు, కేంద్రం కుట్రపూరితంగా ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని సుప్రీంలో తేల్చుకుంటాం అని....

Advertisement

President's Rule In 'MAHA': రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర, గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు శివసేన, అత్యవసర మంత్రి వర్గ సమావేశం తరువాత బ్రెజిల్ విమానమెక్కిన ప్రధాని మోడీ

Hazarath Reddy

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు పుల్‌స్టాప్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బిజెపి,శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు.

Pranav Wins CM Pinarayi Heart: చేతులు లేవు..కాలుతో సెల్పీ, ఫిదా అయిన సీఎం పినరయి విజయన్, సోమరిపోతులకు ప్రణవ్ కథే ఓ గుణపాఠం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి సాయమందించిన ఆర్టిస్ట్ ప్రణవ్

Hazarath Reddy

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ స్టోరీనే నిదర్శనం, శరీరంలో అన్నీఅవయువాలు సక్రమంగా ఉండి సోమరిపోతుల్లా తిరుగుతున్న యువకులకు ఈ కథనే ఓ గుణపాఠం. పుట్టుకతోనే చేతులు కోల్పోయిన యువకుడు చూపించిన ఆత్మస్థయిర్యానికి కేరళ సీఎం (Kerala CM Pinarayi Vijayan) సైతం ఫిదా అయ్యారు.

Where Is Our Sidhu: 'మన సిద్ధూ ఎక్కడ'? అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్, నేడు గురునానక్ 550 జయంతి సందర్భంగా భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Vikas Manda

సిక్కు మత స్థాపకుడు, సిక్కులు పవిత్రంగా కొలిచే వారి మొదటి గురువు 'శ్రీ గురునానక్ దేవ్' యొక్క 550వ జయంతి ((Shri Guru Nanak Dev Birth Anniversery) నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ....

Sanjay Raut: ఆస్పత్రిలో శివసేన సీనియర్ నేత, ఛాతీ నొప్పితో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజయ్ రౌత్, ట్విస్టులతో సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు, ఇంకా వీడని అధికార ఏర్పాటు సస్పెన్స్

Hazarath Reddy

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ (Shiv Sena's Sanjay Raut) ఆసుపత్రిలో చేరారు. ఛాతీనొప్పి( chest pain)తో బాధపడుతున్న ఆయనకు ముంబయిలోని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital in Mumbai)లో చికిత్స అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రౌత్ ఛాతీనొప్పితో బాధపడుతున్నారని, చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Nara Lokesh Slams YCP: ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా, ఇదొక ఆబోతు ప్రభుత్వమంటున్న నారా లోకేష్, ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు

Hazarath Reddy

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీడీపీ యువనేత,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( TDP general secretary Nara Lokesh) అధికార పార్టీ వైసీపీ (YSR Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్‌ ప్రభుత్వం (Jagan Mohan Reddy government) వ్యవహరిస్తోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.

Ayodhya Ram Mandir: 30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్, వీహెచ్‌పీ వినతి మేరకు ఆకృతి చూపిన చంద్రకాంత్‌ సోంపురా , నగర శైలిలో ఆలయం, ఆరున్నర ఎకరాల్లో రామ మందిర్, ఇదే డిజైన్‌తో ఆలయం రూపుదిద్దుకునే అవకాశాలు

Hazarath Reddy

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి(Ram temple construction) సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితమే డిజైన్‌(Sompura's design) రూపొందించారు. గుజరాత్ వాసి చంద్రకాంత్‌ సోంపురా(Chandrakant Sompura) 1989లో నాటి విశ్వహిందూ పరిషత్‌ (Vishwa Hindu Parishad)చీఫ్‌ అశోక్‌ సింఘాల్‌ వినతి మేరకు రామాలయ నిర్మాణానికి డిజైన్‌ గీశారు.

Maharashtra Politics: మహారాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీకి ఆహ్వానం, శివసేన 3 రోజుల గడువును తిరస్కరించిన గవర్నర్, శివసేనకు కొత్త చిక్కు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపువైపు సాగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. మహాలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పడంతో మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor) శివసేనకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందుకు తగిన బలాన్ని నిరూపించుకోవాలని కోరారు.

High Court On TSRTC Strike: ఆర్టీసీ కార్మికులపై 'ఎస్మా' వర్తించదు, ఆర్టీసీ అత్యవసర సర్వీసుల్లోకి రాదని తెలిపిన హైకోర్ట్, సమ్మె చట్ట విరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్య, ప్రభుత్వానికి పూర్తి విరుద్ధంగా సాగుతున్న విచారణ, రేపటికి వాయిదా

Vikas Manda

సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాల్సింది ప్రభుత్వమా? ట్రిబ్యునలా లేక కోర్టులా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్మా చట్టం అత్యవసర సర్వీసులకు వర్తిస్తుందని హైకోర్ట్ తెలిపింది....

Advertisement
Advertisement