రాజకీయాలు

Ashwathama Reddy: తెలంగాణాలో కొనసాగుతున్న సమ్మె సస్పెన్స్, 12వ తేదీ నుంచి అశ్వత్థామరెడ్డి నిరవధిక దీక్ష, ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేయి కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ జేఏసీ

Hazarath Reddy

తెలంగాణా(Telangana)లో ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Strike) 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతున్న సంగతి విదితమే. ఇటు ప్రభుత్వం కాని, అటు కార్మికులు కాని మెట్టు దిగడం లేదు. ఓ వైపు కోర్టులో కేసు నడుస్తోంది.

Terror Attack Alert: 3 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యూహ రచన, హెచ్చరికలు జారీ చేసిన నిఘా వర్గాలు, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, డార్క్‌వెబ్ వేదికగా సమాచార మార్పిడి

Hazarath Reddy

గత 10 రోజుల నుంచి బాబ్రీ మసీద్ -రామ్ జన్మభూమి కేసు (Babri Masjid- Ram Janmabhoomi case) మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం, సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగిపోయింది. దేశ వ్యాప్తంగా ఏమైనా దాడులు జరుగుతామయేమోనని ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే పాకిస్తాన్ కేంద్రంగా ఇండియాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు(Military Intelligence) హెచ్చరిస్తున్నాయి.

Karnataka Assembly Bypolls: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు, డిసెంబర్ 9న ఫలితాలు, రేపటినుంచి కోడ్ అమల్లోకి

Hazarath Reddy

కర్ణాటక(Karnataka )లో మళ్లీ ఎన్నికల నగారా మోగనుంది. అక్కడ 15 అసెంబ్లీ స్థానాలకు(15 Assembly Constituencies)సంబంధించిన ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ స్థానాలకు డిసెంబర్‌ 5(December)న పోలింగ్‌ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్‌ 9(December 9)న విడుదల కానున్నాయి.

MAHA CM Poster At Matoshree: ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్, శివసేన చీఫ్ ఇంటివద్ద ఫ్లెక్సీ బ్యానర్, గతంలో ఆదిత్య ఠాక్రే సీఎం అంటూ బ్యానర్లు, మహాలో రంజుగా సాగుతున్న రాజకీయం

Hazarath Reddy

ఫలితాలొచ్చి ఒక్కరోజు కూడా గడవక ముందే ‘భావి సీఎం ఆదిత్య ఠాక్రే’ అంటూ మహారాష్ట్ర అంతటా పోస్టర్లుతో సంచలనం రేకెత్తించిన శివసేన కార్యకర్తలు ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టర్లతో రాజకీయాల్లో మరింతగా వేడిని పుట్టిస్తున్నారు. ఇందులో భాగంగా శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనే మాకు సీఎంగా ఉండాలంటూ వెలిసిన ఓ బ్యానర్ మహా రాజకీయాల్లో మరింత వేడిని రాజేస్తోంది.

Advertisement

Sanjay Raut On 'MAHA' Episode: బీజేపీ విఫలమైతే శివసేన రెడీగా ఉంది, వ్యూహాంతో సిద్ధంగా ఉన్నాం, మా సీఎం ఎవరేనది అప్పుడే చెబుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఎవరు చేస్తారనే ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదు. ఎవరికి వారే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర(Maharashtra)లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని శివసేన (Shiv Sena) స్పష్టం చేసింది.

MAHA Govt Formation Deadline: క్లైమాక్స్‌లో మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్, సోమవారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు రావాలన్న గవర్నర్, బీజేపీ-శివసేన మధ్య తేలని పంచాయితీ, సీఎం కుర్చీపై కూర్చునేదెవరు ?

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ ఏర్పాటు (Maharashtra Govt Formation) అంతకన్నా ఆసక్తిగా మారింది. సీఎం సీటులో ఎవరు కూర్చుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ (BJP) దాని మిత్ర పక్షం శివసేన(Shiv Sena)ల మధ్య సీఎం సీటు విషయంలో ఇంకా పంచాయితీ నడుస్తూనే ఉంది.

Ram Janmabhoomi Nyas Design: అయోధ్యలో రామ మందిర్ న్యాస్‌ డిజైన్, 2024లోగా నిర్మాణం పూర్తి, ఏర్పాటు కాబోతున్న రామాలయ నిర్మాణ ట్రస్ట్, తీర్పు అందరికీ ఆమోద యోగ్యమన్న విశ్వహిందూ పరిషత్‌

Hazarath Reddy

అయోధ్య కేసు( Ayodhya Verdict)లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు (Supreme Court verdict in the Ayodhya case) ఇచ్చిన నేపథ్యంలో అక్కడ రామమందిర(Ram Temple) నిర్మాణానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పుకు రాజకీయ పార్టీ నాయకుల నుంచి గానీ, ముస్లిం మత పెద్దల నుంచి గానీ పెద్దగా సుప్రీం తీర్పు పట్ల నెగెటివ్ రియాక్షన్ రాలేదు. దీంతో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సున్నీ వక్ఫ్ బోర్డు సైతం ఆ నిర్ణయం నుంచి తప్పుకున్నట్లేనని తెలుస్తోంది.

PAPPU LAANTI ABBAYI In KRKR: ఎవరీ పప్పు లాంటి అబ్బాయి, కెఆర్‌కెర్‌లో మరో పాటను విడుదల కాంట్రవర్సీ డైరక్టర్ వర్మ, ఇప్పటికే పాల్ మీద సాంగ్ విడుదల, పాత్రలను యాదృచ్చికంగానే చూడాలంటున్న వర్మ

Hazarath Reddy

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి అందిరీ తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో మారో పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పప్పులాంటి అబ్బాయి..శుద్ధ పప్పు చిన్నారి..బాధ నేను పడుతున్నా..చెప్పుకోలేకున్నా..అంటూ సాగే ఈ పాటను పరమ బ్రహ్మ ముహూర్తం..2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం 9.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Chandrababu Naidu: అబ్దుల్ కలాం నా దగ్గరే విజన్ నేర్చుకున్నారు, విజన్-2020 పత్రాలతోనే దేశ ఆర్థిక విజన్‌పై పుస్తకాన్ని విడుదల చేశారు, చిత్తూరు మీటింగ్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

చిత్తురూ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు.

‘Ayodhya Verdict’ Closed Doors For BJP: రామమందిర నిర్మాణానికి తలుపులు తెరుచుకున్నాయి, బీజేపీకి డోర్స్ క్లోజ్ అయ్యాయి, సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్న అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ సమయంలో అన్ని పార్టీలు ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. అలాగే తమదైన శైలిలో బీజేపీ మీద వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sanjay Raut Cryptic Tweet: ఫస్ట్ మందిర్, తరువాత సర్కార్, శివసేన లీడర్ సంజయ్ రౌత్ ఆసక్తికర ట్వీట్, ‘మహా’లో తేలని పంచాయితీ, హోటల్ రీట్రీట్‌కు శివసేన ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతు అవసరం లేదన్న శివసేన

Hazarath Reddy

దశాబ్దాల నుంచి సాగుతూ వస్తున్న వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు (Ayodhya verdict) వెల్లడించింది. ఈ క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ (Shiv Sena Leader Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kartarpur Corridor: కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించిన మోడీ, పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ఇండియా పీఎం, గురు నానక్ దేవ్‌ అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలు

Hazarath Reddy

భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ (Kartarpur Corridor) ప్రారంభం ఎట్టకేలకు ప్రారంభం అయింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Modi ) కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించారు.

Advertisement

RTC Chalo Tank Bund: ఛలో ట్యాంక్‌బండ్‌తో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం,పోలీసుల అదుపులో అశ్వత్థామరెడ్డి, పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిఘా నీడలో ట్యాంక్‌బండ్

Hazarath Reddy

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్‌బండ్‌’కు ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ పిలుపుతో ట్యాంక్‌బండ్‌ పైకి భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Sunni Waqf Board On Supreme Court Judgment: తీర్పు నిరాశపరిచింది, అయినా తీర్పును గౌరవిస్తున్నాం, తీర్పు కాపీని మరింతగా పరిశీలించిన తరువాతనే భవిష్యత్ కార్యాచరణ, క్లయిమ్‌ని తిరస్కరించిన సున్నీ వక్ఫ్ బోర్డు

Hazarath Reddy

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సున్నితమైన అంశం అయోధ్యలో రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు లాయర్‌ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీర్పుతో సంతృప్తి చెందలేదు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Uddhav Thackeray On Ram Mandir: ఇది కేంద్రం ఘనత కానేకాదు, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని ఎప్పుడో కోరాం, ప్రభుత్వమే నిరాకరించింది, సుప్రీం తాజా తీర్పుతో ఏకీభవిస్తున్నామన్న ఉద్ధవ్‌ ఠాక్రే

Hazarath Reddy

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మీద శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

Ram Mandir In Ayodhya: అయోధ్యలో రామ‌మందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, మరో చోట కొలువుతీరనున్న బాబ్రీ మసీద్, మందిర నిర్మాణానికి 3 నెలల్లోగా ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు

Hazarath Reddy

దశాబ్దాల రామన్మభూమి వివాదానికి తెరపడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు(Ayodhya case Final Judgment)ను ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి (Ram Mandir In Ayodhya) మార్గం సుగమమైంది. కాగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం (Muslims to get alternate land) కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Advertisement

Ayodhya Case Final Judgment: అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి, బాబ్రీ మసీదుకు వేరే స్థలం కేటాయించాలి, ప్రభుత్వం 3 నెలల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేయాలన్న దేశ అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదం కేసుపే సుప్రీంకోర్టు ఈ రోజుల కీలక తీర్పును ఇచ్చింది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. సరిగ్గా 10:30 గంటలకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివి వినిపించారు.

Ayodhya Verdict @1528-2019: అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది?కోర్టు తీర్పులు ఎలా వస్తూ వచ్చాయి?రాజకీయాలకు కీలక అంశంగా ఎలా మారింది?

Hazarath Reddy

దశాబ్దాల అయోధ్య భూవివాదంపై నేడు చారిత్రాత్మక తీర్పు వెలువడబోతోంది. ఆది నుంచి ఎన్నో ట్విస్టులు, మరెన్నొ మలుపుల మధ్య ఈ కేసు అనేక ఉద్రిక్తతలకు కారణం అయింది. 1528 నుంచి మొదలుకొని 2019 వరకు ఎన్నో పరిణామాలు, మరెన్నో భావోద్వేగాల మధ్య ఈ అంశం నలుగుతూ వస్తోంది. ముఖ్యంగా దేశ యవనికపై రాజకీయాలకు కీలక అంశంగా మారింది.

Ayodhya Countdown: దేశ వ్యాప్తంగా హై అలర్ట్, చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేత, పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్‌, మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలు, మరికొద్ది క్షణాల్లో వెలువడనున్న చారిత్రాత్మక తీర్పు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసుపై మరికొద్ది క్షణాల్లో చారిత్రాత్మక తీర్పు రాబోతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు సుప్రీంకోర్టు ఈ రోజు చెక్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు. స్కూళ్లకు, కాలేజీలకు, విద్యసంస్థలకు ముందు జాగ్రత్తగా సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, యూపీ, జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు

RSS Chief Mohan Bhagwat: ఢిల్లీలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అమిత్ షాతో మంతనాలు, తదుపరి పార్టీ వ్యూహాలపై చర్చలు జరిపే అవకాశం

Hazarath Reddy

దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న అయోధ్య రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమి వివాదం కేసు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి వెళుతున్నారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించనున్న క్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ చేరుకున్నారు.

Advertisement
Advertisement