రాజకీయాలు

MH Elections 2019: మహారాష్ట్రలో ఎగిరేది మళ్ళీ కాషాయ జెండానే! ఓపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించిన సీ-ఓటర్ సర్వే, బిజేపీ- శివ్ సేన పార్టీలకు అత్యధిక సీట్లు, కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రతిపక్ష స్థానానికే పరిమితమవుతుందన్న సర్వే

Vikas Manda

మహారాష్ట్ర ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 2014 వరకు మూడు పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి అధికారాన్ని చెలాయించింది. అయితే 2014 ఎన్నికల సమయంలో ఈ కూటమి రెండుగా విడిపోయి విడివిడిగా పోటీచేసి ఘోరంగా నష్టపోయాయి.

TSRTC Strike- Day 14: సమ్మె తీవ్రం.. ఫలితం శూన్యం. టీఎస్ ఆర్టీసీ సమ్మె రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుందా? సమ్మె పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? వివరణాత్మక కథనం

Vikas Manda

ఉద్యోగ సంఘాల నేతలు కూడా రేపు ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వారికి ఇతర సంఘాల నుంచి మద్ధతు దక్కదన్న భయంతోనే అనివార్య పరిస్థితుల్లో మద్ధతిస్తున్నాయే తప్పా, అయ్యో పాపం ఆర్టీసీ కార్మికులు అని ఎవరూ ముందుకు రావడం లేదు....

One Rupee Registrstion: రూపాయికే 2 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్, పేదలకు బంపరాఫర్ ఇచ్చిన జగన్ సర్కారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు, మంత్రులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పరిపాలనలో ఏపీ సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ తాజాగా పేదల కోసం మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు.

YSR Navodayam: ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం, ఆర్థిక తోడ్పాటు కింద రూ.10 కోట్ల రూపాయలు, రూ.4వేల కోట్ల రుణాలు వన్ టైమ్ రీస్ట్రక్చర్, అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల గడువు

Hazarath Reddy

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ నవోదయం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Indus Waters Treaty: పశ్చిమ జలాలపై మొదలైన వార్, హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లవన్న పీఎం మోడీ, మాకు హక్కులు ఉన్నాయంటున్న పాకిస్తాన్, ఇది దురాక్రమణ చర్య కిందకే అంటున్న దాయాది దేశం

Hazarath Reddy

హిమాలయ సానువుల నుండి పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న మూడు నదీ జలాలపై వేడి రాజుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

AP Formation Day: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యథాతథం, జూన్ 2కు బై బై, నవంబర్ 1న అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నవ నిర్మాణ దీక్షలుగా మార్పు చేసింది.

Ashwatthama's Strike: కేసీఆర్ నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటే కుదరదు, సీఎం పదవి శాశ్వతం కాదు, రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది, సంచలన వ్యాఖ్యలు చేసిన అశ్వత్థామ రెడ్డి

Vikas Manda

మంత్రులు ఆర్టీసీ కార్మికులను విమర్శించి తర్వాత ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారని అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె విషయంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేంధర్, జగదీశ్ రెడ్డి లాంటి వారు మౌనం వీడాలని ఆయన కోరారు...

Huzur Nagar War: హుజూర్ నగర్‌లో గెలుపెవరిది? తెరాస- కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ, రేపు కేసీఆర్ బహిరంగ సభ, తారుమారవుతున్న అంచనాలు, గెలుపెవరిదనే దానిపై భారీగా బెట్టింగ్స్

Vikas Manda

అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతుండటంతో, ఇక్కడ పరిస్థితి ఏమైనా మారుతుందా అని ఆసక్తి నెలకొంది. గెలుపు ఎవరిదనేదానిపై ఉత్కంఠ నెలకొనడంతో బుకీలు కూడా రంగంలోకి దిగారు, ఎవరు గెలుస్తారు? మెజారిటీ ఎంతవస్తుంది, ఎవరి డిపాజిట్లు గల్లంతవుతాయి అనే వాటిపై కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

EC Bans Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌పై పూర్తి నిషేధం, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు, అక్టోబర్ 21న 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు, అక్టోబర్‌ 24న ఫలితాలు విడుదల, ట్విట్టర్లో తెలిపిన ఈసీఐ అధికార ప్రతినిధి ఎస్.శరణ్

Hazarath Reddy

మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలు, పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై పూర్తి నిషేధం విధించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ దృష్ట్యా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

Telugu Trend in 'Maha' Election: మహారాష్ట్రలో 'రావాలి జగన్, కావాలి జగన్' పాటను పోలిన శివసేన ఎన్నికల ప్రచార గీతం, తెలుగు రాష్ట్రాల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట్ర రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం

Vikas Manda

సక్తికరమైన విషయం ఏమిటంటే ఇదివరకే ఎన్నికలు పూర్తిచేసుకుని ప్రస్తుతం అధికారం చేపట్టిన తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ మరియు ఏపీలో వైసీపీ ప్రచార సరళిని శివసేన అనుకరిస్తున్నట్లు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిల్లోకి తీసుకెళ్లేలా శివసేన పార్టీ...

Kalam Hotline Call: ఆ ఫోన్ కాల్‌కి కలాం లొంగి ఉంటే నేడు భారత్ పరిస్థితి ఏమై ఉండేది? అణురంగంలో విప్లవాత్మక మార్పులు జరిగేవా? డూ ఆర్ డై వెనుక ‘మిస్సైల్ మ్యాన్’ పడిన కష్టంపై విశ్లేణాత్మక కథనం

Hazarath Reddy

అబ్దుల్ కలాం.. మిస్సైల్ టెక్నాలజీలో ఈ పేరు ఓ వైబ్రైషన్.. బుడి బుడి అడుగుల భారత పరిశోధన శక్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మిస్సైల్ మ్యాన్. అణు, స్సేస్ రంగంలో ప్రపంచ దేశాలకు భారత్ సవాల్ విసురుతోందంటే అది అబ్దుల్ కలాం చలవేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

PMC Depositor Dies: నిండా ముంచిన పీఎంసీ బ్యాంకు, తట్టుకోలేక గుండెపోటుతో ఖాతాదారుడు మృతి, బ్యాంకు స్కాంలో దిమ్మతిరిగే రహస్యాలు ఎన్నో.., త్వరలోనే సంక్షోభాన్ని పరిష్కరిస్తామంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి

Hazarath Reddy

పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు.

Advertisement

Naadu-Nedu In AP: జగన్ మరో సంచలన నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లు!, దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రయోగం, నాడు-నేడు పథకం పూర్తి వివరాలు మీకోసం

Hazarath Reddy

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

YSR Rythu Bharosa: నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా, స్కీం అమలుకోసం రూ.5వేల 510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అక్టోబర్ 15న నెల్లూరుకి ఏపీ సీఎం జగన్, ప్రధానికి అందిన ఆహ్వానం

Hazarath Reddy

పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన వైయస్సార్సీపి అధినేత, ఏపీ సీఎం జగన్ (Ap CM Jagan Mohan Reddy) ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకాన్ని ప్రవేశపెట్టారు.

Ayodhya Deadline: తుది దశలో రామజన్మభూమి- బాబ్రీ మసీద్ కేసు విచారణ, రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్, నవంబర్ 17న తుది తీర్పు, గత విషయాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..

Hazarath Reddy

దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది.

Modi Acupressure Roller: ఆ పరికరం గుట్టు విప్పిన ప్రధాని మోడీ, దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌, వ్యాయామానికి బాగా ఉపయోగపడుతుంది, నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిందన్న నమో

Hazarath Reddy

మహాబలిపురం బీచ్‌లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్‌లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

PM Modi Challenge: ఆర్టికల్ 370ని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలరా? ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన ప్రధాని మోడీ, మహారాష్ట్రలో ఊపందుకున్న రాజకీయం

Hazarath Reddy

త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న సంగతి తెలిసిందే. బిజెపి కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా వేడెక్కాయి.

Kartarpur Corridor: ప్రధాని మోడీ చేతుల మీదుగా కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవం, పాకిస్తాన్ వెళ్లే ప్రసక్తే లేదన్న పంజాబ్ సీఎం, నవంబర్ 8న లోధి వద్ద ప్రధాని మోడీ ప్రార్థనలు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్రమంత్రి

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న పాక్తిస్తాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవంపై ఎట్టకేలకు ఓ నిర్ణయం వెలువడింది. కర్తార్‌పూర్ కారిడార్‌‌ను భారత ప్రధాని మోడీ వచ్చేనెల 8న ప్రారంభించనున్నారు.

Telangana Udyamam 2.0: మరో తెలంగాణ ఉద్యమంలా టీఎస్ ఆర్టీసీ సమ్మె, చలించేది లేదన్న సీఎం కేసీఆర్, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? తాజా పరిణామాలపై ఒక విశ్లేషణ

Vikas Manda

యానా ఉద్యమ నాయకుడైన నేటి సీఎం కేసీఆర్ ఈ సమ్మెను ఒక రాజకీయ అంశంగానే పరిగణిస్తున్నారు తప్ప, ప్రజాఉద్యమంలా దీనిని భావించడం లేదు. అందుకు తగినట్లుగానే సమ్మెకు కౌంటర్ గా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది....

TSRTC Driver Died: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, అపోలో హాస్పిటల్ వద్ద భద్రత కట్టుదిట్టం, ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తుతున్న నినాదాలు

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Advertisement
Advertisement