Politics

Exit Poll Results: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్, రెండు చోట్ల అధికారం బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి...

Huzur Nagar Bypoll: హుజూర్ నగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్, 79 శాతానికి పైగా పోలింగ్ నమోదు, ఇంకా క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికల సిబ్బంది, పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం

Vikas Manda

నియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓట్లర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల కమీషన్ 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు...

J&K Governor Warning: పాకిస్థాన్ లోపలికి చొచ్చుకు వస్తాం! ఈసారి భారత ఆర్మీ సరిహద్దు దాటి దాడులు చేస్తుందని పాకిస్థానీ టెర్రరిస్టులను హెచ్చరించిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్

Vikas Manda

భారత చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్, ఇరుదేశాలకు మధ్య పోస్టల్ సేవలను నిలిపి వేసింది. దీంతో ఇకపై భారత్ నుంచి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు పాకిస్థాన్ లోకి అనుమతించబడవు.

YS Jagan New Decession: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన జగన్

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఇప్పటివరకు ఉన్న వారిని వేరేచోటుకు మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.

Advertisement

Do Or Die In Huzurnagar Bypoll: హుజూర్ నగర్‌లో 144 సెక్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్, బెదిరింపులకు భయపడమంటున్న కాంగ్రెస్ నేత, పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది.

Polling Update: రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయమంటున్న ప్రధాని మోడీ, సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం

Hazarath Reddy

మినీ ఎన్నికల సమరం ప్రారంభం అయింది. మహారాష్ట్ర, హర్యానాలోలోని అసెంబ్లీ స్థానాలకు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

Polling Day 2019: నేడే పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్, పోలింగ్ బూత్‌ల దగ్గర 144 సెక్షన్, ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం, ఈ నెల 24న ఫలితాలు విడుదల

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం అయింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది.

TSRTC Strike : సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్స్, చర్చలపై ప్రభుత్వం నుంచి ఇంకా రాని ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.

Advertisement

Sharad Pawar In Satara: తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న శరద్ పవార్, జోరు వానలో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగం, సతారాలో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందంటూ స్పీచ్, వెలువెత్తుతున్న ప్రశంసలు

Hazarath Reddy

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, ఎన్‌సీపీ పార్టీలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించకోవాలని కసిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు.

Rahul Gandhi: బిజీగా ఉండే రాహుల్ గాంధీ బ్యాట్ పట్టాడు, నేను కొడితే సిక్స్ అని అంటున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ క్రికెట్ వీడియో, హర్యానా ఎన్నికల్లో ప్రధానిపై విమర్శలు

Hazarath Reddy

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ సరదాగా బ్యాట్ పట్టారు. హర్యానాలోని రేవారిలో విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడారు.

Telangana Bandh Effect: తెలంగాణా బంద్, బస్సులన్నీ ఎక్కడికక్కడే.., ముఖ్య నేతలంతా అరెస్ట్, అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్ధతు, కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిందే అన్న హైకోర్ట్, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది ?

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు అన్ని రాజకీయ పార్టీల వైపు నుంచి మద్దతు లభిస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా, ఉద్యోగ సంఘాలు సైతం సంఘీభావం తెలిపాయి.

Bank Strike: అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె, బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా నిరసన, ఇది కేంద్ర ప్రభుత్వ విఘాతమైన చర్య అంటున్న ఉద్యోగులు, సమ్మెలోకి 2 లక్షల ఉద్యోగులు..

Hazarath Reddy

అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వీరంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వారంతా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.

Advertisement

CM Jagan Master Plan: ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపుగా ఏపీ అడుగులు, ఆరు సూత్రాల ఫార్ములాతో ముందుకు వెళుతున్న ఏపీ సీఎం, అధికారులతో సచివాలయంలో ఉన్నత సమీక్ష

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్రతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఆరు సూత్రాలు నిర్ణయించారు. ఈ ఫార్ములాతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

Telangana Bandh: నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, బంద్‌కు రాజకీయ మరియు ఉద్యోగ సంఘాల మద్ధతు, తామూ బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించిన ఆటో యూనియన్స్, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు

Vikas Manda

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు మరియు కార్మికులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని తమ సమ్మెకు మద్ధతివ్వాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పిలుపునిచ్చారు...

MH Elections 2019: మహారాష్ట్రలో ఎగిరేది మళ్ళీ కాషాయ జెండానే! ఓపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించిన సీ-ఓటర్ సర్వే, బిజేపీ- శివ్ సేన పార్టీలకు అత్యధిక సీట్లు, కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రతిపక్ష స్థానానికే పరిమితమవుతుందన్న సర్వే

Vikas Manda

మహారాష్ట్ర ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 2014 వరకు మూడు పర్యాయాలు ఇక్కడ కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి అధికారాన్ని చెలాయించింది. అయితే 2014 ఎన్నికల సమయంలో ఈ కూటమి రెండుగా విడిపోయి విడివిడిగా పోటీచేసి ఘోరంగా నష్టపోయాయి.

TSRTC Strike- Day 14: సమ్మె తీవ్రం.. ఫలితం శూన్యం. టీఎస్ ఆర్టీసీ సమ్మె రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుందా? సమ్మె పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? వివరణాత్మక కథనం

Vikas Manda

ఉద్యోగ సంఘాల నేతలు కూడా రేపు ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వారికి ఇతర సంఘాల నుంచి మద్ధతు దక్కదన్న భయంతోనే అనివార్య పరిస్థితుల్లో మద్ధతిస్తున్నాయే తప్పా, అయ్యో పాపం ఆర్టీసీ కార్మికులు అని ఎవరూ ముందుకు రావడం లేదు....

Advertisement

One Rupee Registrstion: రూపాయికే 2 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్, పేదలకు బంపరాఫర్ ఇచ్చిన జగన్ సర్కారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు, మంత్రులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పరిపాలనలో ఏపీ సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ తాజాగా పేదల కోసం మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు.

YSR Navodayam: ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం, ఆర్థిక తోడ్పాటు కింద రూ.10 కోట్ల రూపాయలు, రూ.4వేల కోట్ల రుణాలు వన్ టైమ్ రీస్ట్రక్చర్, అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల గడువు

Hazarath Reddy

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ నవోదయం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Indus Waters Treaty: పశ్చిమ జలాలపై మొదలైన వార్, హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లవన్న పీఎం మోడీ, మాకు హక్కులు ఉన్నాయంటున్న పాకిస్తాన్, ఇది దురాక్రమణ చర్య కిందకే అంటున్న దాయాది దేశం

Hazarath Reddy

హిమాలయ సానువుల నుండి పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న మూడు నదీ జలాలపై వేడి రాజుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

AP Formation Day: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యథాతథం, జూన్ 2కు బై బై, నవంబర్ 1న అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నవ నిర్మాణ దీక్షలుగా మార్పు చేసింది.

Advertisement
Advertisement