Politics

PM Modi: అభివృద్ధి గెలిచింది...మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్..కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ప్రధాని ట్వీట్

Arun Charagonda

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌ చేశారు . ఎన్నిక‌ల్లో బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మ‌హారాష్ట్రలోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు ముఖ్యంగా యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు..మ‌హారాష్ట్ర అభివృద్ధికి మ‌హాయుతి కూట‌మి ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందన్నారు. జార్ఖండ్‌లో విజ‌యం సాధించిన జేఎంఎం నేతృత్వంలోని కూట‌మికి అభినంద‌న‌లు తెలిపారు మోదీ.

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Arun Charagonda

వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ...తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజల వ్యక్తిగా మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను అన్నారు. మీ కోసం పోరాడుతాను అని వెల్లడించారు.

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Arun Charagonda

ప్రియాంక గాంధీ...రికార్డు తిరగరాశారు. వయనాడ్ ఎంపీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు ప్రియాంక. దాదాపు 4,08,036 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సత్యన్ మొకేరిపై విజయం సాధించారు ప్రియాంక. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు.

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Arun Charagonda

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని మట్టికరిపిస్తూ ఎన్డీయే కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, శరద్ పావ్, ఉద్దవ్ ఠాక్రేలకు ఘోర పరాజయం ఎదురుకాగా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు సీఎం ఏక్‌నాథ్ షిండే. అయితే సీఎం పదవిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Advertisement

Jharkhand Election Results: జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా, 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి..మేజిక్ ఫిగర్‌ను దాటిన జేఎంఎం

Arun Charagonda

జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 81 స్థానాలకు గాను 50కి పైగా స్థానాల్లో జేఎంఎం కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా జేఎంఎం కూటమి దూసుకెళ్తోంది.

Sanjay Raut: ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్న శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ప్రజలు ఈ తీర్పును అంగీకరించని కామెంట్

Arun Charagonda

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు శివసేన( ఉద్దవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్. ఇది ప్రజా నిర్ణయం కాదని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. ప్రజలు ఈ నిర్ణయాన్ని అమోదించరన్నారు. అజిత్ పవార్, షిండే వర్గం చేసిన మోసంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మాకు తెలుసు అన్నారు.

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Rudra

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్‌, వయనాడ్‌ లోక్‌ సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబరు 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి.

Advertisement

Chandrababu: వీడియో ఇదిగో, నేను ఐదోసారి సీఎం అవుతా, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Hazarath Reddy

AP రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు.

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

Hazarath Reddy

ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులకు ఏపీ శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. దీంతో పాటుగా చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది.

Balakrishna on YS Sharmila: వైఎస్ షర్మిల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని వెల్లడి

Hazarath Reddy

.అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

Hazarath Reddy

కెనడాలో నేర కార్యకలాపాలతో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వివరణ ఇచ్చింది.

Advertisement

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Hazarath Reddy

ప్రజా పద్దుల కమిటీ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

Pawan Kalyan Hugs Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్సను కౌగిలించుకున్న పవన్ కళ్యాణ్, పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పీఏసీ ఎన్నిక ఓటింగ్ వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ క్రమంలో పవన్‌ను బొత్స ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్,లిస్టు ఇదిగో..

Hazarath Reddy

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు(Delhi Assembly Elections) జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ 11 మంది అభ్య‌ర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇటీవ‌ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురికి తొలి జాబితాలో చోటు క‌ల్పించారు

Andhra Pradesh Assembly Session: పీఏసీ చైర్మన్‌ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నామినేషన్ టైంలో అసెంబ్లీలో హైడ్రామా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పీఏసీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామా నడిచింది.

Advertisement

YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం

Hazarath Reddy

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం

Arun Charagonda

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా దేశం...మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.

AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Jharkhand Exit Poll Result 2024: జార్ఖండ్‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారంటున్న సర్వేలు

Hazarath Reddy

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి.

Advertisement
Advertisement