Politics

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన

Hazarath Reddy

ఆయనపై జనసేన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీసులను కోరారు.

Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నాయి. జాతుల మధ్య వైరంతో గతేదాడి నుంచి అక్కడ కల్లోల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను బందీలుగా పట్టుకుపోయారు.

Kailash Gehlot Joins BJP: వీడియో ఇదిగో, బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఆప్ నేత కైలాశ్‌ గహ్లోత్‌, ఈడీ, సీబీఐ కేసుల నుంచి రక్షణ కోసమే మోదీ చెంత చేరారని ఆమ్ ఆద్మీ మండిపాటు

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే.

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ శాసనమండలిలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు.

Advertisement

PM Modi: నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ

Arun Charagonda

నైజీరియా దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ పురస్కారాన్ని అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1969లో క్వీన్ ఎలిజబెత్‌కు నైజీరియా ఈ అవార్డును ప్రధానం చేసింది. ఈ అవార్డుతో విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వది.

Kailash Gehlot Resigns AAP: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో ప్రస్తావించారు కైలాష్ గెహ్లాట్. కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కువ సమయం కేటాయించిందని, ఈ క్రమంలో ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.ఢిల్లీ ప్రజలు కనీస సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు అని ఆరోపించారు.

CM Chandrababu Delhi Tour: అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.

PM Modi: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం..జార్ఖండ్ నుండి ఢిల్లీకి రావడంలో ఆలస్యం

Arun Charagonda

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీకి చేరడానికి ఆలస్యమైంది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన అనంతరం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. జార్ఖండ్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

Advertisement

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌పై నవ్వులు పూయించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ట్రిపుల్ ఆర్‌కు.. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.

Raghurama Krishna Raju: వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Hazarath Reddy

రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Hazarath Reddy

రాష్ట్రలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.

Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి

Hazarath Reddy

జగన్‌ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది

Advertisement

Anitha Slams YS Jagan: రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అనిత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు.

YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్న షర్మిల తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. బడ్జెట్ మీద జగన్ ప్రసంగించిన తరువాత ఆమె వైసీపీ అధినేత వ్యాఖ్యలపై మండిపడింది.

YS Jagan on Sharmila: చెల్లి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ..

Hazarath Reddy

అసెంబ్లీకి వెళ్లనప్పుడు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసింది కదా అని అడిగిన మీడియా ప్రతినిధికి జగన్ సమాధానమిస్తూ.. చెల్లి షర్మిల గురించి, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

AP Assembly Session: అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా, స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు సవాల్ విసిరిన వైసీపీ అధినేత వైఎస్ జగన్

Hazarath Reddy

జగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు

Advertisement

YS Jagan Slams CM Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు నటన ముందు NTR నటన నథింగ్, సూపర్ సిక్స్ అడుగుతారని ఇన్ని రోజులు బడ్జెట్ సాగదీశారని మండిపాటు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి మండిపడ్డారు.

Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

Hazarath Reddy

బీహార్‌లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jharkhand Elections 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు,ఓటేసిన ప్రముఖులు..తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

Arun Charagonda

జార్ఖండ్ తొలి విడత ఎన్నికల సమరం ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్‌ నమోదు కాగా జార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. రాంచీలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గవర్నర్ సంతోష్​ కుమార్ గంగ్వార్.

Vijayasai Reddy Slams CM Chandrababu: అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

ఏపీలో కూటమి సర్కార్‌ పాలన తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు . సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Advertisement
Advertisement