రాజకీయాలు
Sharmila Slams PM Modi: మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
Hazarath Reddyప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
Kolkata Rape-Murder Case: మోదీజీ..కామాంధులకు వెంటనే శిక్ష పడేలా కఠినమైన చట్టం తీసుకురండి, ప్రధాని మోదీకి దీదీ లేఖ
Hazarath Reddyకోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనపై నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ (CM Mamata Banerjee writes to PM Modi) రాశారు
Jagan Slams CM Chandrababu: మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు.
Defamation Case: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీపై ప్రజల్లో అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయంటూ పిటిషన్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది.
TVK Flag Hoisting Ceremony: తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్, పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు..వీడియో మీరు చూసేయండి
Arun Charagondaతమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.
Jharkhand Politics: దేశ యవనికపై మరో కొత్త పార్టీ, వారం రోజుల్లో కొత్త రాజీకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్
Hazarath Reddyజార్ఖండ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరనుంది. వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వచ్చాయి.
Botsa Meet YS Jagan: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను అభినందించిన వైఎస్ జగన్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేత
Hazarath Reddyవైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు.
Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన ఎగ్ పఫ్స్ అంశం, టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య వార్, ఎవరేమంటున్నారంటే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎగ్ పఫ్స్" కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
Delhi Liquor Scam Case: కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలకు ఆదేశాలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది.
Kavitha Bail Petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
Rudraఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Raksha Bandhan 2024: వీడియో ఇదిగో, విద్యార్థులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న మోదీ డ్రస్
Hazarath Reddyదేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi) సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Seethakka Tie Rakhi to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు (వీడియో వైరల్)
Rudraనేడు రాఖీ పౌర్ణమి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు.
Champai Soren: జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం, బీజేపీలో చేరనున్న మాజీ సీఎం చంపై సోరైన్, పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి!
Arun Charagondaజార్ఖండ్లో రాజకీయ సంక్షోభం తలెత్తె దిశగా పరిణామాలు కనిపిస్తున్నారు. జేఎంఎం సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంపై సోరెన్తో పాటు కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. సోరెన్ బృందం ఢిల్లీకి బయల్దేరారు. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగా హేమంత్ సోరేన్ సీఎంగా ఉన్నారు. ఇటీవల ఈడీ కేసులో హేమంత్ సోరేన్ జైల్లో ఉన్నపుడు సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
BJP Membership Drive: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సభ్యత్వాలే బీజేపీ టార్గెట్, రాష్ట్రాల వారీగా ఇంఛార్జీలు నియామకం,2025లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు
Arun Charagondaమూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. రెండు సార్లు బీజేపీకి వార్ వన్ సైడ్ అనేలా ప్రజలు తీర్పు ఇవ్వగా గత ఎన్నికల్లో మాత్రం సంకీర్ణ పార్టీల భాగస్వామ్యంతో మోడీ 3.0 ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా...మెంబర్ షిప్ డ్రైవ్పై కీలక సూచనలు చేశారు.
Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్
Arun Charagondaరైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ఇదిగో, మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు
Hazarath Reddyమొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత మూడు పర్యాయాలుగా కొనసాగుతోంది.
Jammu and Kashmir Assembly Elections 2024: జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు
Hazarath Reddyదేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది.జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Assembly Elections 2024 Schedule: మోగిన ఎన్నికల నగారా, జమ్మూ కశ్మీర్ , హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూకశ్మీర్, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు
KTR Apologies To Womens: మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్, అక్కాచెల్లెళ్లను కించ పరిచే ఉద్దేశం లేదని కామెంట్
Arun Charagondaతెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్..తన వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు.
Assembly Elections 2024 Schedule: మళ్ళీ మోగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల నగారా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే, నేడే షెడ్యూల్ ప్రకటన
Hazarath Reddyలోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) నేడు షెడ్యూల్ విడుదల కానుంది.మధ్యాహ్నం 3 గంటలకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది.