Festivals & Events
Happy Dussehra 2020: అందరికీ దసరా శుభాకాంక్షలు, నవరాత్రి ప్రత్యేకత ఏంటి? వివిధ రాష్ట్రాల్లో శరన్నవరాత్రిను ఎలా జరుపుకుంటారు, తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలు ఎలా ఉంటాయి? దసరాపై స్పెషల్ కథనం మీకోసం
Hazarath ReddyDashahra, Dasara, Navaratri, Durga Puja and Ramlila,Dussehra in India,Dussehra,Dussehra 2020 Date,Dussehra 2020 Date in India, Dussehra Images,Happy Dussehra 2020, Wishes, Messages and Quotes, King Ravana, Lord Ram,COVID-19, Vijayadashami,‎Etymology, ‎Ramayana, ‎Mahabharata,dussehra festival 2020,Dussehra Messages 2020,Dussehra 2020 messages and quotes, Happy Dussehra wishes, happy Dussehra images, photos, Happy Dussehra Wishes 2020, Happy Vijaya Dashami,Best Dussehra Wishes ideas, Happy Dussehra, Dussehra Meaning, History of Dussehra, Dussehra History
Google’s 22nd Birthday: Google 22వ పుట్టినరోజు, ప్రత్యేక డూడుల్‌ని విడుదల చేసిన గూగుల్, ల్యాప్‌టాప్ ముందు కూర్చుని గూగుల్ వీడియో కాల్ చేస్తున్నట్లుగా డూడుల్
Hazarath Reddyఈ రోజు Google 22 వ పుట్టినరోజు! (Google’s 22nd birthday) ఈ ప్రత్యేకతను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ ని రూపొందించింది. కాగా గూగుల్ అధికారికంగా సెప్టెంబర్ 8, 1998 న ప్రారంభమైంది, కాని సంస్థ తన పుట్టినరోజును సెప్టెంబర్ 27 న జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పుట్టినరోజున (Google 22nd birthday) గుర్తుగా, సెర్చ్ ఇంజిన్ యొక్క 22 వ పుట్టినరోజు కోసం ప్రత్యేక గూగుల్ డూడుల్ ఉంది. గూగుల్ యొక్క 22 వ పుట్టినరోజు కోసం గూగుల్ డూడుల్ (Google Doodle) వీడియో కాల్ చేస్తున్న ల్యాప్‌టాప్ ముందు కూర్చున్న ‘జి’ లోగోను కలిగి ఉంది.
Arati Saha's 80th Birthday: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ, జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ గుర్తింపు పొందిన ఆరతి గుప్తా నీ సాహా
Hazarath Reddyఆరతి గుప్తా నీ సాహా (సెప్టెంబర్ 24, 1940 - ఆగష్టు 23, 1994) ఇంగ్లీషు ఛానెల్ ను (English Channel)ఈదిన తొలి భారతీయ మహిళగా (Arati Saha) గుర్తింపు పొందింది. ఈమె జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళగా చెప్పుకుంటారు. ఆరతి గుప్తా తన నాల్గవ యేట నుండే ఈతను ప్రారంభించారు. ఆమె ప్రతిభను "సచిన్ నాగ్" అనే కోచ్ గుర్తించారు. 1945 నుండి 1951 వరకు ఆమె ఆలిండియా రికార్డు (1949) తో పాటు 22 పోటీలలో పాల్గొన్నది. ఆమె ఇంగ్లీషు ఛానెల్ ఇదిన భారతీయ స్విమ్మర్ అయిన మిహిర్ సేన్ కు ప్రభావితురాలైంది. సెప్టెంబర్ 29 1959 న ఇంగ్లీషు ఛానెల్ ఈది భారతదేశంలో ప్రథమ మహిళగా నిలిచింది.
Thank You Coronavirus Helpers: కరోనావైరస్ సహాయకులకు ధన్యవాదాలు, ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గూగుల్ డూడుల్, థాంక్యూ కరోనావైరస్ హెల్పర్స్ అంటూ ట్వీట్
Hazarath Reddyప్రపంచం కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడుతూనే ఉంది, వైద్యులు, నర్సులు, డెలివరీ సిబ్బంది, రైతులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పారిశుద్ధ్య కార్మికులు, కిరాణా కార్మికులు మరియు అత్యవసర సేవల కార్మికులు మరియు ఇతరులతో సహా కరోనావైరస్ పోరాటంలో ముందున్న ప్రతి ఒక్కరికీ గూగుల్ కృతజ్ఞతలు (To all the corinavirus helpers thank you) తెలుపుతూ ఒక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. కరోనా సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటంగా జరుపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది.
Rafale Induction: భారత వాయుసేనలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు, రెండు వైపులా నీటి ధారలతో అపూర్వ స్వాగతం, ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న గగనతల విన్యాసాలు, అద్భుతమనిపించే ఆ దృశ్యాలు మీకోసం
Team Latestlyప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా సర్వమత ప్రార్థనలు (Sarva Dharma Puja) నిర్వహించారు. అనంతరం రాఫెల్, సు -30 మరియు జాగ్వార్లచే నిర్వహించిన అద్భుతమైన గగనతల విన్యాసాలు చూపరులను రోమాలు నిక్కబొడిచేలా చేశాయి......
Teachers Day 2020: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్లే హీరోలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ, అమిత్ షా, ఇతర రాజకీయ నాయకులు
Hazarath Reddyఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ఇక ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.
#YSRVardhanthi: దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ప్రతి అడుగులోనూ నాన్నే నాకు తోడు అంటూ సీఎం జగన్ ట్వీట్, వై.యస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రపై ప్రత్యేక కథనం
Hazarath Reddy#వైయస్సార్.. ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది.నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది.అలాంటి మహానేత చేసిన పాదయాత్ర (YSR's Praja Prasthanam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలి పాదయాత్రగా లిఖించబడిన ఓ ప్రస్థానం. 53 ఏళ్ల వయసులో దాదాపు 1470 కి.మీ సాగిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచింది.
WCS Awards 2020: తెలంగాణ అటవీశాఖకు రెండు జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పురస్కారాలు, వైల్డ్ లైఫ్ సొసైటీ ఫోటోగ్రఫీ పోటీల్లో రెండవ, మూడవ స్థానాలు గెలుచుకున్న తెలంగాణ అటవీ శాఖ అధికారులు
Team Latestlyవైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (WCS) జాతీయ స్థాయిలో ఈ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. అదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర రావు, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటో కు బెస్ట్ సెకండ్ ప్లేస్ విన్నర్ గాను, అలాగే....
Rottela Panduga 2020 Cancelled: రొట్టెల పండుగ రద్దు, 20 మందితో గంధ మహోత్సవం, నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ, కరోనావైరస్ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని తెలిపిన కలెక్టర్ చక్రధర్ బాబు
Hazarath Reddyఏటా ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ ఈ సారి రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు (Rottela Panduga 2020 Cancelled) చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక రొట్టెల పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవంను కూడా 20 మందితో జరపాలని తెలిపారు. కాగా మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ (Rottela Panduga) జరిగేది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
Telugu Language Day 2020: తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవమే ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం, మహనీయుని జీవిత విశేషాలు మీకోసం
Hazarath Reddyవ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా (Telugu Language Day 2020) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని (Kaloji Narayana Rao) తెలంగాణ భాషా దినోత్సవంగా (Telangana Telugu Language Day) జరుపుకుంటున్నారు.
Khairathabad Ganesh 2020: ధన్వంతరి నారాయణుడిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేష్! కరోనా మహమ్మారి నేపథ్యంలో ధన్వంతరి అవతారం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోండి
Team Latestlyఆసక్తికరంగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు ధన్వంతరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. మరి ఈ ధన్వంతరి ఎవరు? ధన్వంతరి గణేషుడి యొక్క విశిష్టత ఎంటో తెలుసా? అయితే చదవండి....
Ganesh Chaturthi 2020: వినాయక చవితి..ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకతలేంటీ? శివుడు వినాయకునికి చెప్పిన మంత్రం ఏమిటి? వినాయక మహత్యం గురించి ఆసక్తిర కథనం మీకోసం
Hazarath Reddyవినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా (Ganesh Chaturthi 2020) జరుపుకుంటారు. ఈ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.. కైలాసములో పార్వతీ దేవి శివుని (Lord Shiva) రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని (Ganesha) రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.
Ganesh Chaturthi 2020: వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి
Hazarath Reddyఏపీలో వినాయక చవితి వేడుకలపై వైయస్ జగన్ సర్కారు ( YS Jagan Govt) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్ధితులపై సాధారణ పరిపాలనశాఖ, పోలీస్‌, వైద్యశాఖతో లోతుగా సమీక్ష నిర్వహించిన తర్వాత బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం (Govt issues guidelines) ఈ ఏడాది రోడ్లపై వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఆంక్షలు ఉల్లంఘించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Happy Independence Day 2020 Greetings: భారత స్వాతంత్ర్య దినోత్సవం, అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..
Hazarath Reddyఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. దేశాన్ని రాబందుల కబంధ హస్తాల నుండి రక్షించుకోవడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కుల మత బేధాలు లేకుండా ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్నదమ్ముళ్ల లాగా కలిసి జీవిస్తున్నాం. ఈ రోజు భారతీయలకు నిజంగా గొప్ప పండుగ. భారత స్వాతంత్ర్య దినోత్సవం (Happy Independence Day 2020) రోజున అందరూ జాతీయ జెండా వందనం చేసి బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు (74th Independence Day 2020 Greetings) చెప్పుకుంటారు.
Indian Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం, మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం..
Hazarath Reddy1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిస‌త్వం నుంచి విముక్తి పొందింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా (Indian Independence Day), జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి eswn పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ( jawaharlal nehru) తొలిసారి ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Mdi జెండాను ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
Krishna Janmashtami 2020: కృష్ణాష్టమి పండుగ గొప్పతనం ఏమిటి ? కృష్ణ జన్మాష్టమి రోజున ఏం చేయాలి ? శ్రీ కృష్ణ లీలలు గురించి ఎవరికైనా తెలుసా ? గోకులాష్టమి పండుగపై పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyసృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమినే... గోకులాష్టమి (Gokulashtami 2020) అని కూడా అంటారు. భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ (Krishna Janmashtami) జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని (Krishna Janmashtami 2020) ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని (Happy Krishna Janmashtami) జరుపుకుంటున్నాం. అంటే 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు ఈ పంచాంగం చెబుతోంది.
Ratha Yatra (Puri): పూరి జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి, జగన్నాథుడు రేపు బయటకు రాకుంటే 12 ఏళ్లు యాత్రకు దూరం అవుతాడని కోర్టుకు తెలిపిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా
Hazarath Reddyఎట్టకేలకు పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు లేకుండా రథయాత్ర (Puri Rath Yatra 2020) జరుపుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పూరీ రథయాత్ర విషయంలో రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెలువరించింది.
Happy Father's Day 2020: పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం
Hazarath Reddyఅంతర్జాతీయ పితృ దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని (Happy Father's Day 2020) పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం (Happy Mother's Day) ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది.
#TelanganaFormationDay: తెలంగాణ ప్రజలకు ప్రధానితో పాటు పలువురు నేతల శుభాకాంక్షలు, ఆరేళ్ల తెలంగాణలో విజయాలు, సర్కారు విస్మరించిన అంశాలపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day) ఆవిర్భవించింది. నేటికి సరిగా ఆరేళ్లు పూర్తయి 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో కరోనా (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day 2020) సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్‌ (CM K Chandrasekhar Rao) నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు.
Telangana Formation Day 2020: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఈ ఏడాది సాదాసీదాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు , కోవిడ్-19 నేపథ్యంలో అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ ప్రభావిత రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ వేడుకలను (Telangana Formation Day 2020) నిరాడంబరంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి అవరతణ దినోత్సవ వేడకలు అంగరంగం వైభవంగా జరగగా ఈ ఏడాది కోవిడ్ 19 దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రావతరణ వేడుకలను (Telangana formation day) నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు.