రాష్ట్రీయం
Telangana Weather: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్‌.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
sajayaగత వారం వేడిగాలులు వీచిన నేపథ్యంలో, రాబోయే మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల వాసులకు ఉపశమనం లభించినట్లు కనిపిస్తోంది.
APPSC Group 2 Results: ఉత్కంఠ‌కు తెర! గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ, ఎల‌క్ష‌న్ కోడ్ కార‌ణంగా ఫ‌లితాలు వాయిదా ప‌డుతాయ‌ని ఊహాగానాలు
VNSఎట్టకేలకు గ్రూప్‌ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్‌ ఫలితాలను (Prelims Exam Results) ఏపీపీఎస్సీ (APPSC) బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్‌ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు.
Posani Comments on CBN: జ‌య‌ప్ర‌ద జీవితాన్ని చంద్ర‌బాబు నాశ‌నం చేశాడు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన పోసాని కృష్ణ‌ముర‌ళి
VNSవాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) అన్నారు. అందుకే నిమ్మగడ్డతో (Nimmagadda) ఫిర్యాదు చేయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో పోసాని మాట్లాడారు.
BRS Secunderabad Cantonment Candidate: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన కేసీఆర్, మ‌ళ్లీ ఆ కుటుంబానికే అవ‌కాశం
VNSతెలంగాణలోని కంటోన్మెంట్ (Secunderabad Cantonment) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత (Niveditha) పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదితను (Niveditha) అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
Andhra Pradesh Elections 2024: హిందూపురంలో వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌
Hazarath Reddyవైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోబుధవారం టీడీపీలో చేరారు. ఇక్బాల్ కు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
Andhra Pradesh Elections 2024: వాలంటీర్ల పేర్లు వింటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి, పల్నాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyమనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు.ప్రతిపక్షాలు జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ సీఎం మండిపడ్డారు. జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జై చంద్రబాబు అనకుండా జై జగన్ అనేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక్కసారిగా షాక్ తిన్న తెలుగుదేశం కార్యకర్తలు
Hazarath Reddyకర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు
Telangana Phone-Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ ఏప్రిల్‌ 12 వరకు పొడిగింపు, కేసుపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది. ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీపై అప్‌డేట్, ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు (AP Inter Results 2024) రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు
Student Committed Suicide: ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyనిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. అయినా కూడా వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన పోతిన మహేష్, విజయవాడ వెస్ట్‌లో జనసేనకు బిగ్ షాక్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనకు షాక్‌ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్‌ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే.
Andhra Pradesh Elections 2024: గేదెను ఢీకొట్టిన కారు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్‌కి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాణ్యం మండలం తమ్మరాజు పల్లి గ్రామం వద్ద టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ కీ ప్రమాదం తప్పింది.. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తుండగా అడ్డొచ్చిన గేదెని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది..కారు బెలూన్ ఓపెన్ అవ్వడంతో స్వల్ప గాయాలతో నంద్యాల టీడీపీ అభ్యర్ధి ఫరూఖ్ బయటపడ్డారు.
YSRCP Memantha Siddham Bus Yatra: 12వ రోజు 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. గంటావారిపాలెం నుంచి జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం..
sajayaమేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైయ‌స్ఆర్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు.
TOEFL Exams In AP: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పాటు టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు..పాల్గొంటున్న 21 లక్షల మంది పాఠశాల విద్యార్థులు
sajayaవిద్యార్థులను ఇంగ్లిష్ లో, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ కు సంబంధించిన ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్షలు నేడు నిర్వహించనున్నారు.
Hyderabad Shocker: ఆన్లైన్ గేమ్ లకు బానిసై కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త
sajayaఆన్లైన్ గేమ్ లకు బానిసై కుటుంబాన్ని చంపేసిన భర్త. సన్‌సిటీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ముందు తన భార్య, వారి ఐదేళ్ల కొడుకును హత్య చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.
Tamanna Simhadri : పవన్ కళ్యాణ్‌పై పోటీకి పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి
sajayaట్రాన్స్‌జెండర్ అయిన సింహాద్రి తమన్నా వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భరత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తరపున పోటీ చేయనున్నారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా తమన్నా ఎన్నికల్లో పోరాడనుంది.
Heatwave Warning For AP: ఏపీలో వచ్చే రెండు రోజులు 145 మండలాల్లో వడగాడ్పులు, బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ, మండలాల లిస్టు ఇదిగో..
Hazarath Reddyబుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Delhi Excise Policy Case: నన్ను భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు, తీహార్‌ జైలు నుంచి నాలుగు పేజీల లేఖను విడుదల చేసిన కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీహార్‌ జైలు నుంచి నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా.. తాను చెప్పదల్చుకున్న విషయాల్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె అన్నారు.
Senior IPS Rajiv Ratan Dies: ఉగాది పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం, గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyఉగాది పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.