రాష్ట్రీయం
Ugadi 2024: ఉగాది సందర్భంగా సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం, తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది.
Delhi Excise Policy Case: కవితకు కోర్టులో దక్కని ఊరట, జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ 14 రోజుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్న జనసేనాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం గృహప్రవేశం చేశారు
Hyd Student Murder in US: ఓహియోలో శవమై కనిపించిన హైదరాబాద్ విద్యార్థి, మూడు నెలల క్రితం కిడ్నాప్ చేసిన దుండగులు, 1200 డాలర్లు ఇవాలని డిమాండ్, చివరకు..
Hazarath Reddyఈ ఏడాది మార్చి నుంచి తప్పిపోయిన భారతీయ విద్యార్థి అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శవమై కనిపించినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మంగళవారం తెలిపారు.
Ugadi Asthanam at Tirumala: తిరుమలలో కన్నుల పండువగా ఉగాది ఆస్థాన వేడుకలు
Rudraతిరుమలలో(Tirumala) శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని(Ugadi Asthanam) టీటీడీ(TTD) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది.
Vigilance DG Rajeev Ratan Passes Away: గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత
Rudraసీనియర్‌ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు.
Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Rudraషడ్రుచుల సమ్మేళనమే ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి.
Royal Challengers Bengaluru Greetings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరూ చూడండి!
Rudraరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు
Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు
Rudraతెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Andhra Pradesh Elections 2024: సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసిన టీడీపీ, దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో రూపకల్సన, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు
Hazarath Reddyఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ మేనిఫెస్టోని రద్దు చేసి దాని స్థానంలో ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. కూటమి ఆధ్వర్యంలో త్వరలో కొత్త మేనిఫెస్టో ఉంటుందని ప్రజలు సలహాలు ఇవ్వాలని వర్ల రామయ్య తెలిపారు
Andhra Pradesh: రోడ్డు లేకపోవడంతో రాని అంబులెన్స్, నడిరోడ్డు మీదే ఆడశిశువును ప్రసవించిన గిరిజన మహిళ, భారీగా రక్తస్రావం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది.
Inner Ring Road Scam: హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారనే వార్తలు ఫేక్, రూమర్స్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఐడీ
Hazarath Reddyఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ వస్తున్న కథనాలను ఏపీ సీఐడీ ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh Elections 2024: జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి, భావోద్వేగాలకు గురైన పవన్ కళ్యాణ్
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.
Andhra Pradesh Elections 2024: వైసీపీకి మాజీ మంత్రి శమంతకమణి రాజీనామా, వైసీపీ టికెట్ రాకపోవడంతో కుమారుడితో కలిసి పార్టీకి రాజీనామా
Hazarath Reddyఅనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు. శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్‌లో పవన్‌కు బిగ్‌ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్‌, ఏ పార్టీలోకి వెళతారంటే..
Hazarath Reddyజనసేన పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పోతిన వెంకట మహేష్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఓ లేఖ విడుదల చేశారు. జనసేనకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు పోతిన మహేష్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారు
Telangana: తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు, చావు ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపిన తండ్రి, వీడియో ఇదిగో..
Hazarath Reddyసిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది.కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.
Hyderabad Horror: హైదరాబాద్ ప్రగతినగర్‌ లో దారుణం.. యువకుడిని చంపి ఇన్‌ స్టాలో సెల్ఫీ వీడియో పోస్ట్.. పాత కక్షల నేపథ్యంలో దారుణం
Rudraహైదరాబాద్ ప్రగతినగర్‌ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరణ
Rudraఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్‌ కోసం ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.
Viral Video: నమస్కారం పెట్టి.. మస్కా కొట్టి ఏకంగా అమ్మవారి నగలే నొక్కేశాడు.. ఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో వీడియో వైరల్
Rudraఏలూరులోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దొంగతనం కలకలం రేగింది. రాత్రిపూట అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దొంగ అమ్మవారికి దండం పెట్టి.. పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పారిపోయాడు.
BRS Ex MLA Shakeel Son Raheel Arrested: ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ అరెస్ట్‌… దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు
Rudraబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.