రాష్ట్రీయం
Telangana: మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్, బస్సులో సీటు లేదని కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు
Hazarath Reddyఅదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అజీం ఖాన్ అనే వ్యక్తి టికెట్ తీసుకోగా ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు లేదని కండక్టరుతో గొడవపడి చెంప కొరికాడు.
Telangana: సికింద్రాబాద్‌ రాష్ట్రపతి నిలయంలో వివిధ పర్యాటక ఆకర్షణలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫోటోలు ఇవిగో..
Hazarath Reddyసికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో వివిధ పర్యాటక ఆకర్షణలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ఆకర్షణలో చారిత్రక జెండా స్తంభం, చిట్టడవి ఉద్యానవనం మరియు పిల్లల ఉద్యానవనం, పునరుద్ధరించబడిన మెట్ల బావులు మరియు సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థలు, శివ మరియు నంది శిల్పాలు మరియు నాలెడ్జ్ గ్యాలరీలో కొత్త ఎన్‌క్లేవ్‌లు ఉన్నాయి.
Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా, ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభ‌మైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు స‌మావేశాలు కొనసాగిన‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు
Telangana Assembly Session 2023: తెలంగాణ విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session 2023) ఆరో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు.
Telangana Assembly Session 2023: విద్యుత్ ప్రాజెక్టులపై జ్యుడిషియల్ విచారణకు సిద్ధం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, విద్యుత్ బకాయిలపై హాట్ హాట్‌గా సాగిన సమావేశాలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరుగగా.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది
Pension Increased in Andhra Pradesh: అవ్వాతాతలకు జగన్ గుడ్ న్యూస్, పెన్షన్‌ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం అవ్వాతాతలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్‌ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్‌ అమలులోకి రానుంది. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
CM Jagan on TDP & Janasena: ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే, పేదలకు ఈ స్థాయిలో దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చుచేయలేదని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyగిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు.
Volunteer Salaries Hike: ఏపీ వాలంటీర్లకు గుడ్ న్యూస్, జనవరి నుంచి జీతం అదనంగా రూ.750 పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి కారుమూరి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి వాలంటీర్ల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి ఈ ప్రకనట చేశారు.
Singareni Elections: ఈ నెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyఎట్టకేలకు సింగరేణి ఎన్నికల నిర్వహణకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది
Happy Birthday Jagan: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, పాల్గొన్న పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.
Happy Birthday Jagan: సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ట్వీట్స్ ఇవిగో..
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు
Happy Birthday Jagan: వీడియో ఇదిగో, పుట్టిన రోజు సందర్భంగా మొక్కను నాటిన సీఎం జగన్, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
Hazarath Reddyసీఎం జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైఎ­స్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు.
Happy Birthday Jagan: జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు, సోషల్ మీడియాను ఊపేస్తున్న #HBDYSJagan హ్యాష్ ట్యాగ్, వెల్లువెత్తుతున్న జన్మదిన శుభాకాంక్షలు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎక్స్ (ట్విట్టర్) లో #Andhrapradesh, #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖులంతా ఏపీ ముఖ్యమంత్రికి ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. వీడియోలతో హోరెత్తిస్తున్నారు.
Mahalaxmi Scheme: 28వ తేది నుంచి రూ 500కే గ్యాస్ సిలిండర్.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
Rudraమహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది.
Dalit Bandhu: దళితబంధుకు బ్రేకులు? ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ.. విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ
Rudraతెలంగాణలో దళితబంధుకు బ్రేకులు పడ్డట్టు సమాచారం. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ విడతలో 50 వేల దరఖాస్తులు వచ్చాయి.
TDP Yuvagalam Navasakam: ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రా 30 ఏళ్లు వెన‌క్కు వెళ్లింది, రాబోయేది టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌న్న చంద్ర‌బాబు
VNSవైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏపీలో ధరలు విఫరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం కోసం కాదని, . ముఖ్యమంత్రి పదవుల కోసం తపించడం లేదని, రాష్ట్రంలో ఖూనీ చేయబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జత కడుతున్నామని పేర్కొన్నారు.
TTD: తిరుమ‌ల వెళ్లేవారికి అల‌ర్ట్! స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్లు ర‌ద్దు చేసిన టీటీడీ, ఈ నెల 22 నుంచి వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌న టోకెన్లు
VNSడిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా డిసెంబ‌రు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను ర‌ద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులు తిరుమ‌ల‌(Tirumala) లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని సూచించారు.
Telangana Assembly Session 2023: ప్రజలను తప్పుదోవ పట్టించేలా శ్వేత పత్రం, దీనిపై హౌస్‌ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్
Hazarath Reddyతెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారని తెలిపారు.
Telangana Assembly Session 2023: తెలంగాణ అప్పు రూ. 6,71,757 కోట్లు, అసెంబ్లీలో 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (Economic situation of state) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly Session 2023) శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు.
Telangana Assembly Session 2023: కాళేశ్వరంపై సీఎం రేవంత్, హరీష్‌ రావు మధ్య మాటల యుద్ధం, వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్
Hazarath Reddyకాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (BRS MLA Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.