రాష్ట్రీయం

AP Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. వందల సంఖ్యలో క్షతగాత్రులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

Rudra

విజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

YS Jagan on Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సహాయ కార్యక్రమాలపై ఎప్పటికపుడు నివేదిక ఇవ్వాలని ఆదేశం

VNS

విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు (train accident) ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ (YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Narendra Modi on Train Accident: విజయనగరం రైల్ ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్బ్రాంతి, సహాయ కార్యక్రమాలపై రైల్వే మంత్రి తో మాట్లాడిన మోడి

VNS

సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో మాట్లాడారు ప్రధాని. ప్రమాద స్థలిలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు.

Andhra Pradesh Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇప్పటి వరకు ఆరుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

VNS

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం (Andhra Pradesh train accident) జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం (Andhra Pradesh train accident) ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Rail Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, ఢీకొన్న రెండు రైళ్లు, పట్టాలు తప్పిన మూడు బోగీలు..

ahana

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. వార్తా సంస్థ ANI రిపోర్ట్ ప్రకారం, విజయనగరం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలు మరొక ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

AP Train Accident: విజయనగరంలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన విశాఖ, రాయగడ ప్యాసింజర్

ahana

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో నిలిచినపోయిన విశాఖ - రాయగడ ప్యాసింజర్‌ రైలును, పలాస ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన మూడు ప్యాసింజర్‌ రైలు బోగీలు.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.

Telangana Elections 2023: అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదు - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అల్టిమేటం..

ahana

హైదరాబాద్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. తాము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదని తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. ఎల్లుండి మరోసారి రాష్ట్ర కార్య వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Massage Centre: నెలకు లక్ష జీతం అనగానే సంబురపడింది.. ఫిట్‌ నెస్ శిక్షకురాలిగా చేరింది.. అయితే, ఉద్యోగంలో కొనసాగాలంటే కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాలన్న యజమాని.. ఆ తర్వాత ఆ మహిళ ఏం చేసింది? హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఘటన

Rudra

ఉద్యోగంలో కొనసాగాలంటే సెంటర్ కు వచ్చిన పురుష కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాల్సిందేనని అప్పుడే ఉద్యోగంలో చేరిన ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.

Advertisement

Chandrababu Arrest: రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన నారా లోకేష్, భువనేశ్వరి

ahana

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 50 రోజులుగా జైల్లో బంధించారని, ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం వ్యవస్థలు నిర్వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. భువనేశ్వరితో కలిసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించిన లోకేష్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు.

Nalgonda Road Accident: నార్కట్‌పల్లిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..డ్రైవర్ మృతి, 8 మందికి తీవ్రగాయాలు

ahana

శనివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి మండలం లొంగోటం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.

MP Vijayasai Reddy: చంద్రబాబు చరిత్ర ముగిసింది, 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ లక్ష్యం...విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ahana

చంద్రబాబు చరిత్ర ముగిసిందని. లోకేశ్‌కు రాజకీయనేత లక్షణాలు లేవు. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారు. 175 స్థానాల్లో గెలవాలన్నదే వైసీపీ లక్ష్యమని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly Elections 2023: హీరో నితిన్ మామకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా భూపతి రెడ్డి, రాజీనామా బాటలో నగేష్ రెడ్డి

Hazarath Reddy

Advertisement

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, పాల్వాయి స్రవంతిని నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి, మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించిన హైకమాండ్

Hazarath Reddy

గత ఏడాది మునుగోడు ఉపఎన్నికల్లో స్రవంతికి రేవంత్ ఇచ్చిన వాగ్ధానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయిస్తామని.. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రచార సభ వేదికగా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Telangana Elections 2023: జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరణతో పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం, బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వార్నింగ్..

ahana

జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో విష్ణు ఆగ్రహంతో ఉన్నారు.

Onion Price Hike: నిన్నటివరకు టమోటా మోత, నేడు ఉల్లి ఘాటు.. 57 శాతం పెరిగిన రిటైల్‌ ఉల్లి ధర.. ధరాఘాతంతో విలవిలలాడుతున్న సామాన్యుడు

Rudra

ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు.

Cheetah Spotted Tirumala: తిరుమల మెట్లమార్గంలో మరోసారి చిరుత కలకలం, నడకదారి భక్తులకు మరోసారి అలర్ట్ జారీ, అప్రమత్తమైన టీటీడీ, చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు

VNS

అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah Spotted), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది.

Advertisement

TS Weather: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటూ ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న ఐఎండీ, తెల్లవారుజామున కనిష్టానికి ఉష్ణోగ్రతలు

VNS

తెలంగాణను చలి (Cold) వణికిస్తున్నది. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజులు చలి తీవ్రత (Cold wave) కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు ఏర్పడగా.. ఇందులో ఒకటి నైరుతి దిశలో తమిళనాడుకు దగ్గరలో ఉన్నది.

DIG Ravi Kiran on Chandrababu Security: చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ కీలక వ్యాఖ్యలు, మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని వెల్లడి

Hazarath Reddy

జైల్లో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని, తన ప్రాణాలకు హాని ఉందనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 45 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల, అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాలో బోథ్ నుంచి వెన్నెల అశోక్, ముథోల్ నుంచి నారాయణ్ రావు, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి మధన్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్ పోటీ చేయనున్నారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వరుస ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

Advertisement
Advertisement