రాష్ట్రీయం

Rains in Telugu States: వేడితో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త.. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలో కూడా..

Rudra

వర్షాకాలమైనా వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Good News For TSRTC Workers: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మరో డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం, సెప్టెంబర్ నెల వేతనంతోనే డీఏ చెల్లింపు

VNS

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC). మరో డీఏ (DA) ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏని చెల్లింపు చేయనుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేసింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను (DA) ఉద్యోగులకు చెల్లింపు చేయనుంది.

YS Sharmila: వైఎస్ఆర్ అభిమానులు అందరూ కాంగ్రెస్ పార్టీని క్షమించాలి - వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..

ahana

వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం ఉంది. వైఎస్ఆర్ చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ ప్రకారం రెండు కాలాలు దాటిపోయింది. కాబట్టి అవతలి వారిలో రియలైజేషన్ వచ్చినపుడు.. మనలో క్షమించే మనసు రావాలి.

Korutla Deepthi Murder Case: అక్కను నేనే చంపేశా..ఒప్పుకున్న చందన... వోడ్కా తాగించి, చేతులు కట్టేసి, ప్రియుడితో కలిసి అక్కను దారుణంగా హత్య చేసిన చెల్లెలు

ahana

కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన దీప్తి అనే యువతి హత్య కేసులో తన అక్కను తానే చంపినట్లు సోదరి చందన ఒప్పుకుంది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో ఒప్పుకోలేదని అందుకే అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు చందన పోలీసుల ముందు పేర్కొంది.

Advertisement

Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి

Rudra

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంకుకు చెందిన రూ.538 కోట్ల నిధులు స్వలాభానికి పక్కదారి పట్టించినట్టు గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.

Corning Investment in Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, భారత్‌లో తొలిసారి గొరిల్లాగ్లాస్ తయారీ కంపెనీ ఇన్వెస్టిమెంట్లు, తెలంగాణలో ఏకంగా రూ. 934 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన

VNS

రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు కార్నింగ్ కంపెనీ వెల్ల‌డించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ (Gorilla Glass) త‌యారీ ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని కార్నింగ్ (Corning Company) కంపెనీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కార్నింగ్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఒప్పందం కుదిరింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.

Heavy Rain Alert: రాబోయే వారంరోజులు తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీచేసిన ఐఎండీ, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

VNS

వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Andhra Pradesh Fire:విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మంటలు, ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాపులో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.

Andhra Pradesh: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్, వైసీపీ ఎంపీకి సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్, కోర్టుకు వచ్చి పాస్ పోర్ట్ తీసుకువెళ్లిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

సెప్టెంబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అదే మాదిరిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

MLA Kondeti Chittibabu Health Update: వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పి.గన్నవరం ఎమ్మెల్యే, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Hazarath Reddy

ఏపీలో కోనసీమ జిల్లా పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు

Video: తల్లి నిర్లక్ష్యానికి పాప ఎలా బలైందో వీడియోలో చూడండి, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారిని రోడ్లపై తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఇలా నిర్లక్ష్యంగా అసలే ఉండొద్దు. చిన్నారుల చేతులను తప్పకుండా పట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. వీడియో ఇదిగో...

Advertisement

YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 7,500, బటన్ నొక్కి కౌలు అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు నిధులను విడుదల చేశారు.వారి ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.

Ayyanna Patrudu Arrest: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, 41 ఏ నోటీస్ ఇచ్చిన పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుని శుక్రవారం విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే.

Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్తాన్ నుండి అక్రమంగా భారత్‌లోకి, ఆధార్ సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు

Hazarath Reddy

భార్య కోసం పాకిస్తాన్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా వచ్చిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్థాన్ యువకుడు అక్కడి నుండి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్షమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.

IT Notice to Chandrababu: రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని అభియోగాలు, చంద్రబాబుకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు మీద ఈ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Konda Raghava Reddy: వీడియో ఇదిగో, వైఎస్సార్‌ని చంపింది కాంగ్రెస్ పార్టీ, కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, షర్మిలతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం

Hazarath Reddy

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌ లో పాల్గొన్న వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఊహించని కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు.

Rakhi Pournami 2023: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన తోబుట్టువులు, ప్రగతి భవన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Hazarath Reddy

రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికయింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీమతి జయమ్మ, శ్రీమతి లలితమ్మ, చెల్లెలు శ్రీమతి వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టారు.

Gym Owner Sells Steroids in Hyd: కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్‌లు, ఇంజక్షన్లు అమ్మకం, జిమ్ ఓనర్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

స్టెరాయిడ్‌లు, కండలు పెంచేందుకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఇటీవల నగరంలో అరెస్టు చేశారు. నిందితులు స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు విక్రయించారని, ఇవి కండరాలను బలపరిచేందుకు, శక్తిని పెంచడానికి సహాయపడతాయని పోలీసులు తెలిపారు. 10 లక్షల విలువైన సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Hazarath Reddy

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు

Advertisement
Advertisement