రాష్ట్రీయం
Andhra Pradesh Cylinder Explosion: వీడియో ఇదిగో, నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, ఇద్దరు మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు.
APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyకుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఫ్లైఓవర్పై అతి వేగంగా వెళ్తూ కరెంటు పోలును, డివైడరును ఢీకొన్న బైక్, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు ఢీకొంది.
Telangana: వీడియో ఇదిగో, విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఘటన
Hazarath Reddyఅశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో కొంతమంది రాజకీయ నాయకులు ఓ మహిళపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. బాధిత మహిళ, ఓ నాయకుడికి మధ్య జరిగిన గొడవలో సదరు వ్యక్తితో పాటు పక్కనే ఉన్న మరి కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.
Road Accident: హైదరాబాద్ మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదేండ్ల కూతురు మృతి, తండ్రికి గాయాలు (వీడియో)
Rudraహైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన రోడ్లు వెరసి రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రమాదాల నివారణకు అటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్
Rudraఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది.
Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్ లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)
Rudraమైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
No Night Shows For Minors: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను సినిమా థియేటర్లకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది.
Padma Awards Controversy in Telangana: తెలంగాణలో పద్మ అవార్డులపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం, బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyతెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో పద్మ అవార్డుల ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు కూడా పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు.
Nellore Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్ షాకిచ్చిన కార్యకర్తలు, టీడీపీ పార్టీని వదిలి వైసీపీలో చేరిన 200 మంది ఎమ్మెల్యే మద్దతుదారులు
Hazarath Reddyనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.31వ డివిజన్కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.
Andhra Pradesh: సూపర్ సిక్స్ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన
Hazarath Reddy2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై (Niti Aayog Report) చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు.
Kishan Reddy Met Balakrishna: బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు భాలయ్య పూర్తిగా అర్హులంటూ అల్లు అర్జున్ ట్వీట్
Hazarath Reddyకేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిసి, పద్మభూషణ్ అవార్డును అందుకున్నందుకు అభినందించారు. ఇక నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
TGSRTC JAC Issue Strike Notice : 21 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ, లేకుంటే సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరికలు
Hazarath Reddyతమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ (TRC JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులపై ఉండటంతో బస్భవన్ లోపల ఈడీ మునిశేఖర్కు కార్మిక సంఘాలు సోమవారం నాడు నోటీసు (TGSRTC Strike Notice) ఇచ్చారు. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు (TGSRTC JAC issue strike notice) అందజేశాయి.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో మహిళను జుట్టు పట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన
Hazarath Reddyవిశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.
CM Revanth Reddy Slams PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని గజనీ మహమూద్తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని గెలిపించాలని వినతి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముహమ్మద్ ఘజినీతో పోల్చారు. అలాగే బీజేపీని "బ్రిటిష్ జనతా పార్టీ" అని అభివర్ణించారు.మహౌలో జరిగిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ'లో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
Telangana: తెలంగాణలో అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలు అమలు, రైతుభరోసా కింద తొలి విడతగా రూ. 6 వేలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు
Hazarath Reddyనారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డుల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు
SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి
Hazarath Reddyఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Telangana: వీడియో ఇదిగో, గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి కిరీటం, శఠగోపం ఎత్తుకెళ్లిన దొంగలు, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో ఘటన
Hazarath Reddyనిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఆలయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది.
Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.