రాష్ట్రీయం

Pawan Kalyan Meets JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు

Hazarath Reddy

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో భేటీ అయ్యారు.ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం.

'No Caste' and 'No Religion': దరఖాస్తుల్లో విద్యతో పాటు నో క్యాస్ట్‌ , నో రిలీజియన్‌ కాలమ్‌ తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం కోసం పెట్టుకునే దరఖాస్తులో కులం, మతం వద్దనుకునేవారికి వీలుగా ఓ కాలమ్‌ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

BJP Leaders House Arrest: జైళ్లు సిద్ధం చేసుకోండి కేసీఆర్..మేమంతా రెడీ, బీజేపీ నేతల హౌస్ అరెస్టుపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

ఛలో బాట సింగారం నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్‌తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఈటల రాజేందర్ నివాసాలకు పోలీసులు భారీగా చేరుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Video: వీడియో ఇదిగో, సైకిల్ పోవాలి అంటూ మళ్లీ నోరు జారిన టీడీపీ నేతలు

Hazarath Reddy

టీడీపీ నేతలు మళ్లీ నోరు జారారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ టీడీపీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇక్కడే వారు సైకో బదులుగా సైకిల్ అంటూ నోరే జారేస్తున్నారు.

Advertisement

Hyderabad Weather Update: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు, ప్రమాదంలో పడితే 9000113667 నెంబర్ కు కాల్ చేయండి, హైదరాబాద్ వాసులకు మేయర్ విజ్ఞప్తి

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Telangana Weather Update: తెలంగాణకు అతి భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్ జారీ, భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి

Hazarath Reddy

తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని హెచ్చరించింది.

Hyderabad: నేపాలీ ముఠా దోపిడి గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, పనిమనుషులుగా ఇంట్లో చేరి బంగారం, నగదుతో పరార్

Hazarath Reddy

హైదరాబాద్ లో సంచలనం రేపిన బంగారం, నగదు దోపిడీ కేసులో కీలక వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. రాంగోపాల్‌పేట పీఎస్‌ పరిధిలోని సింధీ కాలనీలోని సింధీ కాలనీలో నేపాలీ కార్మికుల ముఠా 5 కోట్ల విలువైన ఆభరణాలు , 49 లక్షల నగదును దోచుకెళ్లారు

Hyderabad Rains: వీడియోలు ఇవిగో, భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లపై నిలిచి పోయిన వరద నీరు, తీవ్ర అంతరాయం ఎదుర్కుంటున్న ప్రయాణికులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీవర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వీడియోలు ఇవిగో..

Advertisement

Double Bedroom Houses: త్వరలోనే హైదరాబాద్‌ లో డబుల్ పండుగ, 65వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

VNS

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగర పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను (Double Bedrooms) అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ (Double Bedroom Houses) ప్రారంభిస్తామని,

TSRTC Tracking APP: ఇక ఆర్టీసీ బస్సు ఎక్కడుందో లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు! 3800 బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ

VNS

నగరంలోని బస్సు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్టీసీ (RTC) యాజమాన్యం దృష్టి సారించింది. ప్రైవేటు రవాణా నుంచి పబ్లిక్‌ రవాణా విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి బస్సు ప్రయాణికులకు తెలిసేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా నగర ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Holidays For Schools: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు, భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటూ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

VNS

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు (Holiday) ప్రకటించింది విద్యాశాఖ. సీఎం కేసీఆర్ (Cm KCR) ఆదేశాల మేరకు రెండు రోజుల పాటూ సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Andhra Pradesh: ముస్లిం మత పెద్దలతో సీఎం జగన్ భేటీ, మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను మత పెద్దలు తెలిపారు.

Advertisement

Telangana: ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌, తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లు బదిలీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి, హోంగార్డు డీఐజీగా అంబారి కిషోర్‌, మేడ్చల్‌ డీసీపీగా శబరీస్‌, పర్సనల్‌ అడిషనల్‌ డీజీగా సౌమ్యామిశ్రా బదిలీ అయ్యారు.

Telangana: పొలంలో నాటు వేస్తుండగా పాత బోరు బావిలో ఇరుక్కుపోయిన మహిళ కాలు, బోరు గొయ్యి చుట్టూ గుంత తీసి కేసింగ్ పైపు కోసి రక్షించిన అధికారులు

Hazarath Reddy

యాదాద్రి - బొమ్మలరామారంలో సోలిపేటలో ఓ రైతు పొలంలో కూలీలు నాటు వేస్తుండగా పద్మ అనే మహిళ కాలు ప్రమాదవశాత్తు పాతబోరులో ఇరుక్కుపోయింది. ప్రొక్లెయిన్ సాయంతో బోరు గొయ్యి చుట్టూ గుంత తీసి కేసింగ్ పైపు కోసి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.

Padmavati Express Derailed At Tirupati: తిరుపతిలో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్

kanha

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్‌ ఫారంలో ఎక్స్‌ప్రెస్‌లోని ఒక భోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

Godavari Water Level Rising: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి, భక్తులు స్నానాలు చేసే సమయంలో లోతుకు వెళ్లవద్దని హెచ్చరికలు

Hazarath Reddy

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 320 అడుగులు ఉన్న నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 28.9 అడుగులకు చేరుకుంది.

Advertisement

Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఎన్నికల అధికారులను నియమించిన ఈసీ 

Hazarath Reddy

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. అదే విధంగా 33 జిల్లాలకు డిస్ట్రిక్‌ ఎలక్టోరల్‌ అధికారులను సైతం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Weather Update: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.

Rains in Telangana: తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు, స్కూల్స్ మూతపడే అవకాశం, పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Hazarath Reddy

ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ వాతా వరణ కేంద్రం తెలిపింది.

AP Shocker: ఏపీలో దారుణం, గిరిజన యువకుడి నోట్లో పురుషాంగం పెట్టి మూత్రం పోసిన దుండగులు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులో గిరిజన యువకుడి నోట్లో దుండగులు మూత్రం పోశారు. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ దొంగతనాలు చేసే పాత నేరస్థులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తగా నవీన్‌ను.. అంజి మద్యం తాగుదామని కిమ్స్ ఆసుపత్రి వెనకాల వైపు తీసుకువెళ్ళాడు.

Advertisement
Advertisement