రాష్ట్రీయం
Jagananna Suraksha Programme: ధ్రువీకరణ పత్రాల జారీకి నో సర్వీసు చార్జీలు , జూలై 1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.
Gadapa Gadapaku Mana Prabutvam: 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాల్సిందే, నేతలకు సీఎం జగన్ ఆదేశాలు, గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష
Hazarath Reddyతాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Transgenders Murdered in Hyd: అక్రమ సంబంధం అనుమానాలు, అర్థరాత్రి హిజ్రాలను కత్తులతో నరికి చంపిన దుండగులు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సౌత్‌ జోన్‌ డీసీపీ కిరణ్‌
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వివిద ప్రాంతాల్లో రెండు జంట హత్యలు కలకలం రేపాయి. టపాచబుత్ర పీఎస్‌ పరిధిలో ఇద్దరు హిజ్రాలను దుండగులు దారుణంగా (Transgenders Murdered in Hyd) హతమార్చగా..రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు.
Hyderabad Shocker: పెళ్లికి ఒప్పుకోలేదని టీకి పిలిచి యువతి గొంతు కోసిన యువకుడు, ముఖం, చేతులపైనా తీవ్ర గాయాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని నార్సింగి పీఎస్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మహిళా సాఫ్ట వేర్ ఇంజనీర్ పెళ్లికి నిరాకరించందనే కారణంతో ఓ యువకుడు ఆమె గొంతు కోసి దారుణంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పుప్పాలగూడ టీ గ్రిల్‌ హోటల్‌ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
Gaddar Praja Party: గద్దర్‌ ప్రజా పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ, రిజిస్ట్రేషన్ కోసం ఈసీ ఆఫీసుకు వెళ్లిన ప్రజా గాయకుడు గద్దర్
Hazarath Reddyతెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరింది. తూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన, ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీగా ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును విప్లవ సింగర్ అనౌన్స్‌ చేశారు.
Flyover Slabs Collapsed in LB Nagar: ఎల్బీ నగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం, కుప్పకూలిన పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్‌, తొమ్మిది మందికి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం
Hazarath Reddyహైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లో నిన్న అర్ధరాత్రి కొంత భాగం కూలిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
T Cong Joinings: పొంగులేటి, జూపల్లి చేరిక ఖరారు, కాసేపట్లో ఇరువురు నేతలతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి, ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఇరువురు నేతలు, త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిసే అవకాశం
VNSమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) లు త్వరలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నుంచి బయటకు వచ్చిన తరువాత వారిద్దరూ ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Flyover Ramp Collapse: ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం, నిర్మాణం మధ్యలోనే కుప్పకూలిన ఫ్లై ఓవర్, 10మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
VNSప్లై ఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది(Flyover Ramp Collapse). ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని కబురు, రాగల మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. మంగళవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
Hyderabad: నెలకి రూ.300 బిల్లు వచ్చే ఇంటికి రూ. 8 లక్షలు కరెంట్ బిల్లు వేసిన అధికారులు, లబోదిబోమంటూ తలలు పట్టుకున్న ఇంటి యజమాని
Hazarath Reddyఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడువేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడువందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది.
Man Sets His Bike on fire: పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, పోలీసులను దుర్భాషలాడి మరీ నిప్పు..
Hazarath Reddyశంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చాలన్ కట్టాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఫసియుద్దీన్ అనే యువకుడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడి తన యాక్టివా బండికి నిప్పు పెట్టిన యువకుడు.
Vijayawada Rain Video: వీడియో ఇదిగో, విజయవాడను కుమ్మేసిన భారీ వర్షం, రెండు గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వాన
Hazarath Reddyభగ భగ మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దాదాపు రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో నగర వాసులకు ఊరట లభించింది. భారీ వర్షం నేపథ్యంలో నగరంలోని పలు రోడ్లు జలమయ్యాయి.
Telangana: మళ్లీ అధికారం మనదే, హ్యట్రిక్ కొట్టబోతున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని స్పష్టం
Hazarath Reddyతెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే పాలమూరు పూర్తి కావాల్సిందని, పుణ్యాత్ములు కాంగ్రెసోళ్ల వల్లే ఆలస్యమైందని తెలిపారు.
Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం
Hazarath Reddyఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.
Jagananna Animutyalu: విద్యార్థులకు భరోసా, మీకు జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం జగన్, టాపర్లకు బహుమతులు ప్రదానం చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyమంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారు.
Double Bedroom Houses: ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ
Hazarath Reddyఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది.
Ajit Pawar on CM KCR: కేసీఆర్‌కు మహారాష్ట్రలో అంత సీన్ లేదు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు, ఆ ప్రచార డబ్బంతా ఎక్కడిది అంటూ విమర్శలు
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తన స్థావరాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆయన సఫలం కాలేడని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar on CM KCR) సోమవారం అన్నారు
Mahesh Bank Case: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు, జులై 7లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Hazarath Reddyమహేష్ బ్యాంకు కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ వాటాదారులు కోర్టుకు వెళ్లారు.
Mudragada Letter to Pawan Kalyan: లెటర్ ఇదిగో, ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశావో చెప్పు, పవన్ కళ్యాణ్‌కి ఘాటు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలని... వీధి రౌడీలా మాట్లాడటం ఎంత వరకు సబబని లేఖలో ఆయన ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో తాట తీస్తా, నార తీస్తా, గుండు గీయిస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా అంటూ పదేపదే అంటున్నారని... ఇప్పటి వరకు ఎంత మందిని ఇలా చేశారో చెప్పాలని అన్నారు.
Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.