ఆంధ్ర ప్రదేశ్
CM Jagan on AP Election Results: వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్
Hazarath Reddyఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.
CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.
Tirumala Car Fire Video: తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారులో మంటలు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో బయటపడిన భక్తులు
Hazarath Reddyతిరుపతి: తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో కారులో మంటలు చెలరేగాయి; డ్రైవర్ అప్రమత్తం కావడంతో భక్తులు సురక్షితంగా వాహనం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ambati Rambabu: చంద్రబాబు పంచన నాలుగో కూటమిగా పోలీసులు చేరినా జగనన్నదే విజయం, ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyకూటమిలో నాలుగవ పార్ట్ నర్ గా పోలింగ్ రోజున పోలీసులు చేరి ఫైట్ చేసినా... జగన్ అన్నదే విజయం అని ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు చెప్పారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా పోలీసుల తీరుపై అంబటి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
Post-Poll Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ రక్తపాతం, సీరియస్ అయిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ & డీజీపీకి సమన్లు జారీ
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు
Chittoor: వ‌రిగ‌డ్డితో వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్, ఎదురుగా వెళ్తున్న మ‌రో లారీని డీకొట్ట‌డంతో న‌లుగురు మృతి, చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం
VNSచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బంగారుపాళ్యం (BangaruPalyam) మండలం మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా (4 Dead), మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయపడిన వారిని పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Andhra Pradesh Elections 2024: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు, పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించారని ఆరోపణలు
Hazarath Reddyనిన్న జరిగిన ఎన్నికల్లో ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులు చేసింది.
Andhra Pradesh Elections 2024: దారుణం, వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు, అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు వేసిందన్న కారణంతో మద్యం మత్తులో కన్న తల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు ఓ కసాయి కొడుకు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, భూమా అఖిలప్రియ బాడీగార్డును కారుతో ఢీకొట్టిన దుండగులు, పరిస్థితి విషమం
Hazarath Reddyగత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్‌ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
White Tiger Died: నెహ్రూ జూ పార్క్ లో రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్ మృతి, అరుదైన వ్యాధితో క‌న్నుమూసిన తెల్ల‌పులి
VNSహైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్ (White Tiger) మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి (Tiger) గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.
Palnadu Road Accident: ప‌ల్నాడులో ప్రైవేట్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు, ఆరుగురు స‌జీవ ద‌హ‌నం, ఓటు వేసి తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా విషాదం
VNSపల్నాడు జిల్లాలో (Palnadu) అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది (Accident). దీంతో క్షణాల్లో బస్సులో అగ్నికీలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ ప‌ర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నిక‌ల సంఘం
VNSగత రాత్రి వరకు పోలింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు లైనులో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏపీలో మొత్తం 81 శాతం వరకు ఓటింగ్ నమోదైంది
Andhra Pradesh Elections 2024: వీడియోలు ఇవిగో, రణరంగంలా మారిన పల్నాడు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంబటి రాంబాబు మండిపాటు, ఈసీకీ ఫిర్యాదు
Hazarath Reddyఏపీ ఎన్నికల వేళ నరసరావుపేట (Narasaraopet)లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు (YCP Leaders) ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.ఈ నేపథ్యంలో నరసరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Andhra Pradesh Elections 2024: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దుండుగుల దాడి, పరిస్థితి అదుపులోనే ఉంది, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపిన ఎస్పీ
Hazarath Reddyఏపీలో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ సాయంత్రం దాడి జరిగింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు పులివర్తి నాని ఇవాళ వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Hazarath Reddyఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
CM Jagan UK Visit: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి, ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు మన్నించింది.
Andhra Pradesh Elections 2024: ఏపీలో ఇంకా క్లారిటీ రాని పూర్తి స్థాయి పోలింగ్ శాతం, గత ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదు, ఈ సారి దాన్ని క్రాస్ చేసిన ఓటింగ్ శాతం
Hazarath Reddyఏపీలో మునుపెన్నడూ చూడని రీతిలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దాంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో, కొన్ని పోలింగ్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ జరగడంతో పోలింగ్ శాతం పెరిగింది.
Hyderabad: చంద్రబాబు సీఎం కావాలంటూ వెంకటేశ్వరస్వామి ముందు నాలుక కోసుకున్న వీరభక్తుడు, గతంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఇలాంటి పనే..
Hazarath Reddyఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విజయాన్ని కాంక్షిస్తూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బ్లేడుతో నాలుకను తెగ్గోసుకునే ప్రయత్నం చేశాడు. పశ్చిమ గోదావరికి చెందిన చెవల మహేశ్ స్థానిక వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బ్లేడుతో నాలుక కోసుకున్నాడు
Chandrababu on PM Modi: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, గత 10 సంవత్సరాలలో ఆయన బాగా పనిచేశారని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇది చారిత్రాత్మక సందర్భం.. పవిత్ర స్థలం.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని.. గత 10 సంవత్సరాలలో ఆయన చాలా బాగా పనిచేశారని అన్నారు. బీజేపీ కూటమికి 400 సీట్లు రావాలి.