ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Assembly Polls 2024: 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. నేను చేసినదాంట్లో 10 శాతమైనా చేశానని చెప్పగలడా..? మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ధ్వజం..

sajaya

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ ఉన్నాడని తెలిపారు.

Gunny Bags in Tirumala: తిరుమలలో కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులు.. కారణం ఏంటో తెలుసా?

Rudra

తిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. కొండపై ఎండ తీవ్రత విపరీతంగా పెరుగడమే దీనికి కారణం.

QR Code at Vijayawada Railway Station: క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు.. విజయవాడ రైల్వేస్టేషన్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ

Rudra

నగదుతో పని లేకుండానే నేరుగా ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు కొనుగోలు చేయడానికి రైల్వే శాఖ క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Andhra Pradesh Elections 2024: నేను సీఎం అయితే ఏపీ రూ. 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుంది, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు, విశాఖను వాషింగ్టన్ చేస్తానని హమీ

Hazarath Reddy

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 7 ప్రధాన అంశాలతో ఎన్నికలకు వెళ్తున్నామని, మంచి పాలన కావాలనుకునే వాళ్లంతా ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని కోరారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: కడప జిల్లా నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన వైఎస్ షర్మిల, యాత్రలో పాల్గొన్న వైఎస్ వివేకా కూతురు సునీత, అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపు

Hazarath Reddy

కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ... కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు

Skill Development Scam: ఎన్నికల వేళ చంద్రబాబు మెడకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం ఉచ్చు, ఏ1గా టీడీపీ అధినేతను పేర్కొంటూ 41 మందిని నిందితులగా పేర్కొన్న సీఐడీ

Hazarath Reddy

ఏ1గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా మాజీ కార్మిక శాఖా మంత్రి అచ్చెన్నాయుడు (Chandrababu A1, Achennaidu A2), ఏ3గా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, ఏ4గా ఎపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ,సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌, పీవీఎస్‌పీ స్కిలర్‌ సంస్థల అధికారులను ప్రధాన నిందితులుగా సీఐడీ చార్జిషీట్‌లో పేర్కొంది.

First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి

Rudra

తొలి తెలుగు న్యూస్ యాంకర్, దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు.

Chandrababu Slams CM Jagan: వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు, కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, పెన్సన్ కోసం వెళ్లిన వృద్ధులు చనిపోవడంపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పార్టీ ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీద మండిపడ్డారు.

Advertisement

Amanchi Krishna Mohan Quits YCP: వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్, ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని వెల్లడి

Hazarath Reddy

ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు.

CM Jagan Speech in Naidupeta: మళ్ళీ అధికారంలోకి వస్తే తొలి సంతకం వాలంటీర్‌ వ్యవస్థ పైనే, నాయుడుపేట మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్

Hazarath Reddy

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు

Andhra Pradesh Road Accident:నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నెల్లూరు నుండి కావలికి వెళుతున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఇసుక లారీ డీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి, బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురికి గాయాలు కాగా మిగతా ప్రయాణికులకి పెను ప్రమాదం తప్పింది.

HC On Vizag Steel Plant Privatization: ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, కేంద్రాని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, సీఎం జగన్‌ లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశాలు

Hazarath Reddy

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

Advertisement

HC On Pension Distribution: ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, పెన్సన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు

Hazarath Reddy

ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈసీ ఇచ్చిన ఉత్వర్వులను సమర్థించింది.

Rain Forecast for Telangana: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్! రెండు రోజుల పాటూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న ఐఎండీ, ఏయే జిల్లాల్లో వ‌ర్షాలున్నాయంటే?

VNS

గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి.

Heatwave Warning: బీ అల‌ర్ట్! రాబోయే ఐదు రోజుల పాటూ అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రండి, ఏపీలోని ప‌లు జిల్లాలో వ‌డ‌గాల్పులు వీస్తాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌

VNS

ఏపీలో వడగాలులు (Heat Wave) వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Shah Rukh In Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రేపు సాయంత్రం వరకు అక్కడే..

Hazarath Reddy

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. వైఎస్సాఆర్ స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ముంబాయి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు.

Advertisement

Andhra Pradesh: పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి, కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒకేసారి వెళ్లిన టీడీపీ, వైసీపీ నేతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వజ్రమ్మ (80) అనే వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి జోగి రమేశ్, టీడీపీ నేత బోడె ప్రసాద్ ఒకేసారి వెళ్లారు.

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan Speech in Memantha Siddham Puthalapattu) మాట్లాడారు.

Andhra Pradesh: ఒకటో తేదీ ఇంటికి రాని పెన్సన్, ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి, ఎక్స్ వేదికగా ప్రతిపక్షాలపై వైసీపీ ఫైర్

Hazarath Reddy

కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు.కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

Memantha Siddham: ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, మదనపల్లి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని వెల్లడి

Hazarath Reddy

మదనపల్లిలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’ అన్నారు.

Advertisement
Advertisement