ఆంధ్ర ప్రదేశ్

Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?

Rudra

పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీ ధరకు అందిస్తున్న భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభిస్తున్నది.

Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం

Rudra

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

Avanigadda YCP In-Charge Change: అవనిగడ్డ వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి తప్పుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, కొడుకు సింహాద్రి రామ్‌చరణ్‌‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ఐదో జాబితాలో అవనిగడ్డ నుంచి ఇంఛార్జిగా అవకాశం అందుకున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

MP Vijayasai Reddy on Telangana Govt: తెలంగాణలో అబద్దపు హామీలతో వచ్చిన కాంగ్రెస్ త్వరలోనే కూలిపోతుంది, లోక్‌సభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొందరలోనే కుప్ప కూలిపోతుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Chandrababu Slams CM Jagan: జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ. 8 లక్షలు నష్టపోయింది, రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రికు ఏబీసీడీలు కూడా తెలియవంటూ రా కదలిరా సభలో మండిపడిన చంద్రబాబు

Hazarath Reddy

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనకాపల్లి జిల్లా జిల్లాలోని మాడుగులలో ‘రా.. కదలిరా' (Ra Kadali Ra) బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ మీద (Chandrababu Slams CM Jagan) విరుచుకుపడ్డారు.

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు రా కదలిరా సభాస్థలి వద్ద బాంబు కలకలం, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్‌

Hazarath Reddy

ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్న ‘రా.. కదలిరా’ సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. హెలిప్యాడ్‌ వద్ద సిగ్నల్‌ బజర్‌ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు

Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రేపటికి వాయిదా, ఈనెల 8 వరకూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ముగిసిన బీఏసీ సమావేశం

Hazarath Reddy

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Seetharam) నేతృత్వంలో బీఏసీ (BAC Meeting) సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

Andhra Pradesh Assembly Session 2024: విద్యా రంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు, అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, ప్రారంభమైన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (State Governor Justice Abdul Nazir) ప్రసంగిస్తున్నారు.

Advertisement

Andhra Pradesh Budget Session 2024: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ వారు నిరసన వ్యక్తం చేశారు

Andhra Pradesh: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలో పాల్గొన్న 30 మంది రష్యన్ భక్తులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన సాంస్కృతిక పూజా కార్యక్రమంలో, ఫిబ్రవరి 5, సోమవారం నాడు 30 మంది రష్యన్ భక్తులు పవిత్రమైన రాహుకేతు పూజలో నిమగ్నమయ్యారు. వార్తా సంస్థ ANI ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఒక వీడియో రష్యన్ భక్తులను ఆధ్యాత్మికతలో మునిగిపోయి, వాతావరణం ఆలయం యొక్క సమగ్రతను ప్రదర్శిస్తుంది.

AP Assembly Budget Session: ఇవాల్టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు, మూడు రోజుల పాటూ వాడి వేడిగా కొన‌సాగ‌నున్న సెష‌న్స్

VNS

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) ఇవ్వాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account) సమావేశాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో సమావేశాలకు అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి.

MP Balashowry joins Janasena: జనసేన తీర్థం పుచ్చుకున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచుకున్నారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

Advertisement

Chandrababu Naidu, Pawan Kalyan Meeting: సీట్ల సర్దుబాటుపై ముగిసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో తుది కసరత్తు

sajaya

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 4 (ఆదివారం) నివాసంలో కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ-జేఎస్పీ కూటమి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం, ఇతర రాజకీయ పరిణామాల కోసం ఇద్దరు నేతలు సీట్ల పంపకాల ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం అందుతోంది.

Rahul Gandhi Supports YS Sharmila: వైయ‌స్ ష‌ర్మిల‌కు అండ‌గా నిలిచిన రాహుల్ గాంధీ, సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులను తీవ్రంగా ఖండించిన రాహుల్

VNS

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila), సునీతా రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య.

AP Inter Exams: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మార్చి 1 నుంచి ఎప్ప‌టి వ‌ర‌కు అంటే?

VNS

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు

Yatra2 Trailer Video: ఇచ్చిన మాట కోసం యుద్ధానికైనా సిద్ధం అంటూ యాత్ర 2 సినిమా ట్రైలర్ విడుదల..వీడియో ఇక్కడ క్లిక్ చూడండి..

sajaya

రెండవ భాగం ట్రైలర్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాబల్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదగడంపై కథను దృష్టి పెట్టారు. తన తండ్రి మరణంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు ప్రేరేపించిన అంశాలతో పాటు ఆయన తన యాత్రను కొనసాగించకుండా అడ్డుకునేందుకు ఆయన వెనుక జరిగిన కుట్రలను వివరిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

Advertisement

Denduluru YSRCP Siddham Meeting: జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు.. దేవుడు, ప్రజలే నా తోడు, బలం.. ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర.. నాది అర్జునుడి పాత్ర-సీఎం వైఎస్‌ జగన్‌

sajaya

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల సన్నాహక సభ సిద్ధంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ ద్వారా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా..? వైసీపీని మరోసారి గెలిపించడానికి సిద్ధమా..? అని-సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Viral Video: దెందులూరు సిద్ధం సభకు స్వయంగా బస్సు నడుపుతూ కనిపించిన పేర్ని నాని వైరల్ వీడియో మీ కోసం..

sajaya

తెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆయన మచిలీపట్నం అసెంబ్లీ ఇంచార్జి పేర్ని కిట్టు, పార్టీ కార్యకర్తలతో కలిసి స్వయంగా బస్సు నడుపుతూ కనిపించారు.

INS Sandhayak Survey Vessel: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌, జాతికి అంకితమిచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

Hazarath Reddy

ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ (INS Sandhayak)’ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) శనివారం జాతికి అంకితం ఇచ్చారు.ఈరోజు విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ నౌకను (INS Sandhayak Survey Vessel) జాతికి అంకితమిచ్చారు

AP TET: ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్.. 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ

Rudra

ఎల్లుండి (5న) టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది.

Advertisement
Advertisement