ఆంధ్ర ప్రదేశ్

RGV on JD Tweet: 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి వచ్చేది బానిసత్వమే, బానిసలుగా మారకండి అంటూ జేడీ చేసిన ట్వీట్‌పై స్పందించిన వర్మ

Hazarath Reddy

బానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా?

Aarogyasri Scheme Upgraded: పేదవాడికి ఖరీదైన వైద్యం కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన, వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు..

Hazarath Reddy

ఏపీలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంను (Aarogyasri Scheme Upgraded) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు.

Andhra Pradesh Boat Capsize: ఏపీలో విషాదకర ఘటన, రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా పడి ఒకరు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని రేవుపోలవరం తీరంలో పడవ బోల్తా పడటంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయవరం పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు ఈ ఘటనను ధృవీకరించారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలు, బాధితురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

CBN Meets Pawan Kalyan: టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై సుధీర్ఘ చర్చ, పవన్ కల్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు

VNS

భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్‌ దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. చక్కటి పరిపాలన అందించడానికి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎలా కలిసి పనిచేయాలి? పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మంచి భవిష్యత్‌ ఉండే విధంగా ఈ చర్చలు సంతోషకరంగా జరిగాయి.

Advertisement

AP Weather: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, నైరుతి బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఎఫెక్ట్

VNS

వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange alert) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది.

YCP Sitting MLAs Issue: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్న జగన్.. దాదాపు 40-50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదా నో టికెట్

Rudra

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.

Weather Forecast: చెన్నైని ఇంకా వీడని వర్షాలు, ఏపీలో నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్, తెలంగాణను వణికిస్తున్న చలి, ఈ రోజు వాతావరణం పూర్తి అప్‌డేట్స్ ఇవిగో..

Hazarath Reddy

మిచౌంగ్‌ తుఫాన్‌ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం (Heavy rain lashes Tamil Nadu's Chennai) కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.

New Bangkok Flight From Vizag: ఏపీ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త, విశాఖట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్, వారంలో ఈ మూడు రోజులు మాత్రమే సర్వీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా శుభవార్తను అందించింది. ఏపీ ఫైనాన్సియల్ క్యాపిటల్ కాబోతున్న విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్‌ ఎయిర్‌ ఏషియా

Advertisement

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, ఎట్టకేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు, చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు

Hazarath Reddy

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.వీడియో ఇదిగో..

AP Cabinet Meeting Highlights: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం, పెన్షన్‌తో పాటు 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Andhra Pradesh state cabinet meeting) ముగిసింది. అమరావతిలోని సచివాలయంలో గల మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై (AP Cabinet Meeting Highlights)చర్చించారు.

Andhra Pradesh: సీఎం జగన్‌తో మిచౌంగ్‌ తుపాను కేంద్ర బృందం భేటీ,పంట నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడి

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Andhra Pradesh: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. 30 లక్షలు చెక్ అందించిన సీఎం జగన్

Hazarath Reddy

విధి నిర్వహణలో ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్‌ సత్యకుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్‌ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అన్నారు.

Advertisement

Shaik Sabjee Dies: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

AP 10th & Inter Exam Date 2024: ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చిలోనే అన్ని పరీక్షలు, వివరాలను వెల్లడించిన మంత్రి బొత్సా సత్యానారాయణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు, పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పలాస బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు.

Andhra Pradesh: అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్, వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.

Advertisement

CM Jagan Slams Pawan Kalyan: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా నీకు రాలేదు పవన్, పలాస సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, విశాఖకు నేను వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారంటూ మండిపాటు

Hazarath Reddy

తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు (Even votes that came to Sister Barrelakka) కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు.

YSR Sujaladhara Project: వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులని ప్రారంభించిన సీఎం జగన్‌, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. వైఎస్ఆర్ సుజ‌ల ధార డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు

Visakhapatnam Fire Video: వీడియో ఇదిగో, విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు, మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

విశాఖ జగదాంబ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్‌ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన రోగులు.. పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఆసుప్రతి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్మివేశాయి.

Times Now ETG Survey: ఫ్యాన్‌ తుపాన్‌లో ప్రతిపక్షాలు గల్లంతు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపిన టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వే

Hazarath Reddy

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ ఈటీజీ తాజా సర్వేలో వెల్లడైంది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు కొట్టుకుపోతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 24–25 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుంటుందని ప్రకటించింది.

Advertisement
Advertisement