ఆంధ్ర ప్రదేశ్

Cheddi Gang Members Arrested: ఎట్టకేలకు గుజరాత్ లో చిక్కిన చెడ్డీ గ్యాంగ్ ముఠా, ఇద్దర్ని అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు, మిగిలిన వారి కోసం కొనసాగుతున్న వేట

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో వరుస దొంగతనాలతో ప్రజలను హడలెత్తించిన విషయం విదితమే. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 7వ తేదీ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్‌ ఐదు ప్రాంతాల్లో దొంగతనాలకు యత్నించడంతో, శివారు ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుల ఆగడాలకు ఎట్టకేలకు విజయవాడ పోలీసులు (Vijayawada police) అడ్డుకట్ట వేశారు

AP Bus Accident: బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Rs 5 Lakh Ex-Gratia for Kin of Deceased) అందించాలని అధికారులను ఆదేశించారు

Balakrishna Visit Kanaka Durga Temple: మల్టీస్టారర్‌ చేయడానికి నేను రెడీ, దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపిన బాలకృష్ణ, విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర బృందం

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ ఘన విజయంతో దూససుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'అఖండ' చిత్ర బృందం విజయవాడ కనక దుర్గమ్మను (Kanaka durga Temple in Vijayawada) దర్శించుకుంది.

Andhra Pradesh:ఘోర ప్రమాదం.. ఏపీలో అదుపుతప్పి జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 8 మంది ప్రయాణికులు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు 

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో (8 Killed in RTC Bus fell Into jalleru River) పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా... ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, అదుపుతప్పి జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 8 మంది ప్రయాణికులు మృతి, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో (8 Killed in RTC Bus fell Into jalleru River) పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా... ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

CM YS Jagan VC Highlights: ఏపీ ప్రజలకు కొత్త ఏడాది నాడు ప్రభుత్వం వరాల జల్లులు, పెన్సన్ రూ. 2500 కు పెంపు, రైతుభరోసా మూడో విడత నిధులు, ఈబీసీ నేస్తం చెల్లింపులు జనవరిలో విడుదల

Hazarath Reddy

రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు.

Cinema Ticket Prices Row: సినిమా టికెట్‌ ధరల జీవోని కొట్టివేసిన హైకోర్టు, తీర్పును సవాల్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం, ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

Hazarath Reddy

ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలు (Cinema Ticket Prices) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది.

Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 132 మందికి కరోనా, శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు, విశాఖ జిల్లాలో 19 కేసులు, ఇంకా 1,823 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,228 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 132 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 19 కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

New Medical Colleges in AP: ఏపీలో మూడు కొత్త మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, రాజ్యసభలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్‌ వెల్లడి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు (New Medical Colleges in AP) ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్‌ (Health Minister Dr Bharati Pawar) తెలిపారు

Waqf Tribunal at Kurnool: కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తే మీకొచ్చే నష్టమేంటి, పిటిషనర్ ని ప్రశ్నించినఏఫీ హైకోర్టు, జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16 (implementation of GO 16 ) అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

O Antava OO Antava Song: ఊ అంటావా సాంగ్ మీద హైకోర్టులో కేసు, మగాళ్లు కామంతో ఉంటారా అంటున్న పురుషుల అసోసియేషన్, దీపాలన్నీ ఆర్పేశాక అందరు మగాళ్లదీ వంకర బుద్దేపై అభ్యంతరం

Hazarath Reddy

అల్లు అర్జున్ నటించిన పుష్ప(Allu Arjun's Pushpa) సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన సమంత ఐటం సాంగ్ ఊ అంటావా మావ.. (O Antava OO Antava Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు ఆ పాట వివాదంలో చిక్కుకుంది

CM YS Jagan Review: ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్, త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, ఆరోగ్యశ్రీ సేవలను సమర్థంగా ఉపయోగించుకొనేందుకు ప్రత్యేక యాప్‌

Hazarath Reddy

వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ డబుల్‌ డోస్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (New Variant Omicron) వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Advertisement

PRC Report: 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిపార్సు చేసిన కమిటీ, ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి రూ. 10వేల కోట్ల భారం, పీఆర్సీ నివేదికను సీఎం జగన్ కు అందజేసిన కమిటీ

Hazarath Reddy

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పీఆర్సీ నివేదికను సీఎస్ కమిటీ (CS Committee Submitted PRC Report) అందజేసింది. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు తదితరులు హాజరై కమిటీ నివేదికను అందజేశారు.

Corona in AP: రెండు జిల్లాలో తాజాగా జీరో కేసులు నమోదు, ఏపీలో కొత్తగా 108 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 21,010 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 108 మందికి పాజిటివ్ గా (Andhra Pradesh) నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు (Corona in AP) వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Andhra Pradesh: నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా, ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్, ప్ర‌భుత్వం జ‌రిపే మ‌ద్యం అమ్మ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉందా అని విమర్శలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జ‌గ‌న్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధికార వైసీపీ, జ‌న‌సేన‌ మ‌ధ్య పోర్ పతాక స్థాయికి చేరింది. గతంలో చిత్రసీమ అంశం మీద వైఎస్ జగన్ మీద విరుచుకుపడని పవన్ కళ్యాణ్ (JanaSena chief Pawan Kalyan ) మరోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Corona in AP: మూడు జిల్లాల్లో నిన్న జీరో కేసులు, ఏపీలో గడచిన 24 గంటల్లో 160 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 37 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,859 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 37 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 29, కృష్ణా జిల్లాలో 19 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం, కడప, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Advertisement

Corona in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 146 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,625 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

Omicron Case In Andhra Pradesh: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు, విజయనగరం జిల్లా వాసిగా గుర్తింపు, వైద్యారోగ్యశాఖ హై అలర్ట్

Krishna

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తెలిపింది.

Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందించిన మంత్రి పెద్దిరెడ్డి, స్వగ్రామానికి చేరుకున్న సాయితేజ పార్థివదేహం, సైనిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు..

Krishna

సాయితేజ కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు సాయితేజ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్ ను అందజేశారు.

Students Drowned: గుంటూరు జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లిన ఆరుగురు వేదపాఠశాల విద్యార్దులు మృతి, కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే ప్రమాదమని స్థానికుల ఆరోపణ

Naresh. VNS

గుంటూరు(Guntur) జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణానది(Krishna River)లో ఈత(Swimming)కు వెళ్లిన ఆరుగురు వేదపాఠశాల విద్యార్ధులు దుర్మరణం(Six students drowned) పాలయ్యారు. అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ స‌మీపంలోని శ్వేత శృంగాచ‌లం(Sweatha Srungachalam) వేద పాఠ‌శాల విద్యార్థులు న కృష్ణాన‌దిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కానీ ఈత రాక‌పోవ‌డంతో నీట మునిగిపోయారు.

Advertisement
Advertisement