ఆంధ్ర ప్రదేశ్
Corona in AP: మాస్క్ లేకుండా ఉద్యోగానికి వెళితే కంపెనీలకు రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి
Hazarath Reddyకార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు (Masks) లేని వారిని అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా (impose a fine of Rs 10,000 to Rs 25,000) విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
AP ECET 2021 Exam Date: ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు బీ అలర్ట్, సెప్టెంబర్‌19న ఏపీ ఈసెట్‌, ఆగష్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు, వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం
Hazarath Reddy2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్‌ (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిప్లొమా హోల్డర్స్‌ అండ్‌ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌) పరీక్ష సెప్టెంబర్‌19న (AP ECET 2021 Exam Date) నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది.
Corona in AP: ఏపీలో 22 వేల దిగువకు వచ్చిన కరోనా యాక్టివ్‌ కేసులు, తాజాగా 2,058 కేసులు నమోదు, 24 గంటల్లో 2,053 మంది కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్‌ కేసులు, కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు ఏపీ ప్రభుత్వం చేయూత
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 78,992 పరీక్షలు నిర్వహించగా.. 2,058 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,66,175 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 23 మంది బాధితులు (23 deaths) ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,377కి చేరింది.
Chandrababu on Devineni Uma Arrest: టీడీపీతో పెట్టుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు, దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గం, మీడియాతో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు
Hazarath Reddyదేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు.
Fire Accident in Guntur: అగ్ని కీలల్లో 6 గురు ఒడిశా కూలీలు సజీవ దహనం, మావనతా దృక్పథంతో స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్, మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఏపీలో రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో (Fire Accident) ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు (Financial Assistance family odisha labourers) రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
AP Shocker: తూర్పు గోదావరి జిల్లాలో 300 కుక్కలకు విషం ఇచ్చిన చంపిన అధికారులు, అమానుష ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్, బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyఏపీలొ పశ్చిమ గోదావరి జిల్లాలో కుక్కలపై అధికారులు ప్రదర్శించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఆ జిల్లాలోని లింగపాలెం పంచాయతీ అధికారులు 300 మూగజీవాలను విషపు ఇంజక్షన్లతో (Over 300 Stray Dogs Poisoned by Panchayat Officials)చంపేశారు. వాటిని చంపేసి . గుంతలో అలా పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు.
Andhra Pradesh Shocker: అక్రమ సంబంధం వద్దన్న మామ, కావాలన్న కోడలు, ఆగ్రహంతో కోడలిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మామ, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, తూర్పుగోదావరిజిల్లా మకిలిపురం మండలంలో ఘటన
Hazarath Reddyఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మకిలిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం వద్దని చెప్పినా వినకపోవడంతో కోడలిని మామ దారుణంగా హత్య (Man Murders daughter in Law) చేశాడు.
Clash Between Hijras: ఉలిగమ్మ ఉత్సవంలో హిజ్రాల మధ్య గొడవ, పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు, అనంతపురంలో ఘటన
Hazarath Reddyఅనంతపురంలో రెండు రాష్ట్రాల హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ టెన్షన్ రేపుతోంది. రాయలసీమ – బెంగళూరు హిజ్రాల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం (Clash Between Hijras) పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
Case Filed Against JC Prabhakar Reddy: రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు..జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాడిపత్రిలో రెండో వైస్‌ చైర్మన్‌‌గా ఎన్నికైన టీడీపీ మద్దతుదారు
Hazarath Reddyటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు (Case Filed Against JC Prabhakar Reddy) చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై (TDP leader former MLA JC Prabhakar Reddy) కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Vishakha Turns to IT Hub: విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు జగన్ సర్కారు కసరత్తు, ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కూడా అందుబాటులోకి
Hazarath Reddyఇప్పటిదాకా సంక్షేమ పథకాల అమలుతో దూసుకువెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తన దృష్టిని ఐటీ వైపు మళ్లించింది. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా పలు ఐటీ కంపెనీలు తమ యూనిట్లను విశాఖపట్నంలో (Vishakha Turns to IT Hub) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
COVID19 Curfew Extended in AP: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు
Team Latestlyరాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారికి 100 రూపాయల జరిమానా విధించే అధికారాన్ని సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా పోలీసు అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2107 కోవిడ్ కేసులు, 20 మరణాలు నమోదు మరియు 1807 మంది రికవరీ, రాష్ట్రంలో 21 వేల ఎగువకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,807 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,27,438 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,279 ఆక్టివ్ కేసులు...
Vidya Deevena Funds Release: ఏపిలో 'జగనన్న విద్యాదీవెన' రెండో విడత నిధులను విడుదల చేసిన సీఎం జగన్, 2020-21 విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ; సెలవుల్లో ఫీజులెందుకని బీజేపి విమర్శలు
Team Latestlyపిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే, తల్లిదండ్రులు తమ ప్రతి అడుగులోనూ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. మన పిల్లలు బాగా చదవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటారు. ఇందుకోసమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చినట్లు...
Andhra Pradesh: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు, 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు; శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను పెంచిన తిరుమల తిరుపతి దేవస్థానం
Team Latestly2007 తర్వాత శ్రీశైలం గేట్లు జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఈ ఆహ్లదకర దృశ్యాన్ని సందర్శించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు....
Devineni Uma: రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ, 14 రోజులు రిమాండ్ విధించిన మైలవరం జడ్జి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వైసీపీ నేతపై దాడి చేశారని ఆరోపణలు
Hazarath Reddyహనుమాన్‌ జంక్షన్‌ సీఐ ఆఫీసులో జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను (Devineni Uma Maheshwararao ) హాజరుపర్చారు. దేవినేని ఉమకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ (Devineni Uma remanded for 14 days) విధించారు. రాజమహేంద్రవరం జైలుకు (Rajahmundry jail) తరలించాలని మైలవరం జడ్జి షేక్ షేరిన్ ఆదేశించారు.
Corona In Andhra pradesh: ఏపీలో తగ్గుతున్న కేసులు, కొత్తగా 2,010 మందికి కోవిడ్, 24 గంటల వ్యవధిలో 1,956 మంది బాధితులు డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధారణ (Corona In Andhra pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,59,942 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,312కి చేరింది.
AP CM Review on Covid: టీచర్లకు త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయండి, అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, కరోనావైరస్‌ నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనావైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM Review on Covid) నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై (CoronaVirus Prevention) సమీక్షించారు.
Father-Son Chief Ministers: తండ్రీ కొడుకులిద్దరూ సీఎంలే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలలో సీఎంలుగా తండ్రి కొడుకులు, పూర్తి లిస్ట్ పై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyకర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మాయ్ బుధవారం ప్రమాణస్వీకారం (Basavaraj Bommai is new Karnataka CM) చేశారు. ఆయన తండ్రి కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బసవరాజ్ బొమ్మాయ్ సీఎం కావడంతో తండ్రీ, కొడుకులు సీఎంలుగా (Father-Son Chief Ministers) చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.
Devineni Uma Arrest: నందివాడ పీఎస్‌కు దేవినేని ఉమా తరలింపు, ఆందోళనలు జరగకుండా నందివాడ గ్రామ సరిహద్దులను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు, మాజీ మంత్రికి కోవిడ్ పరీక్షలు చేయనున్న వైద్యులు
Hazarath Reddyకృష్ణా జిల్లా జీ.కొండూరు వివాదంలో అరెస్ట్ (Devineni Uma Arrest) అయిన టీడీపీ మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావును బుధవారం నందివాడ పోలీసు స్టేషన్‌కు (Nandivada police station) తరలించారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగా.. నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మీడియాతో సహా సాధారణ ప్రజలను సైతం గ్రామంలోకి వెళ్లనివ్వలేదు.
Devineni Uma Arrest: దేవినేని ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు, ముందస్తు ప్లాన్‌లో భాగంగానే దేవినేని ఉమ అక్కడికి వెళ్లారు, మీడియాతో ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌
Hazarath Reddyటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గత రాత్రి అరెస్ట్ (Devineni Uma Arrest) చేసిన పోలీసులు తాజాగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతోపాటు 307 కింద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. గత రాత్రి ఉమను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.