ఆంధ్ర ప్రదేశ్

AP Curfew: అత్యవసర ప్రయాణికులకు ఊరట, రేపటి నుంచి ఏపీలో ఈ-పాస్‌ విధానం అందుబాటులోకి, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు, విజయవాడలో డీజీపీ గౌతం సవాంగ్ ఆకస్మిక పర్యటన

Hazarath Reddy

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్‌ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

Covishield Vaccines: విజయవాడకు చేరుకున్న 3లక్షల 60 వేల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు, 9 మందితో ఆక్సిజన్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి బయలుదేరిన 3లక్షల 60 వేల వ్యాక్సిన్లు ఆదివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్టుకు చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులను (Covishield Vaccines) అధికారులు రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలతో వ్యాక్సిన్లు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

AP Covid Report: ఏపీలో ఒక్క రోజులోనే 19,272 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో తాజాగా 20,065 మందికి కోవిడ్ పాజిటివ్, 96 మంది మృత్యువాతతో 8,615కి చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కరోనా గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి పాజిటివ్ (AP Covid Report) అని వెల్లడైంది. విశాఖ జిల్లాలో 2,525 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 2,370 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు గుర్తించారు.

Kavali Shocker: కరోనా సోకిందని భార్యను చంపేసిన భర్త, పోలీసుల వద్దకు వెళ్లి భార్యను హత్య చేశానని తెలిపిన నిందితుడు, నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా వచ్చిందని భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడాలని నిశ్చయించుకున్నారు. మద్యం మత్తులో భర్త తన భార్యను మణికట్టు కోయగా ఆమె (Husband Assassinated Wife) మరణించింది.

Advertisement

Bomb Blast in Kadapa: కడపలో ఘోర ప్రమాదం, 9 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, జిలిటెన్‌ స్టిక్స్‌ అన్‌లోడ్ చేస్తుండగా భారీ స్థాయిలో పేలుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం (Bomb Blast in Kadapa) చోటు చేసుకుంది. మామిళ్లపల్లె శివారులో ఉన్న గనిలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Criminal Case Against Chandrababu: చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు, కర్నూలులో ఎన్‌440కే కరోనా వేరియంట్‌ పుట్టిందని తెలిపిన టీడీపీ అధినేత, ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఫేక్ వార్తను ప్రచారం చేశాడనే ఆరోపణల మధ్య కర్నూలులో క్రిమినల్‌ కేసు (Criminal case against Chandrababu Naidu) నమోదైంది. కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసుపోగు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ కళా వెంకట్రమణ తెలిపారు.

Corona Curfew in AP: అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా రద్దు చేసిన ఏపీఎస్ఆర్టీసీ, కరోనా సెకండ్‌ వేవ్‌తో భారీగా తగ్గిన ఆదాయం, పార్సిల్‌ సర్వీసులు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Hazarath Reddy

అంతర్రాష్ట్ర సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా (cancels all interstate RTC buses) నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న డే టైం కర్ఫ్యూ నిబంధనలతో (Corona Curfew in AP) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే బస్సులకు అనుమతి ఉండటంతో ఆర్టీసీ (APSRTC) సర్వీసులను భారీగా తగ్గించింది.

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 17,188 పాజిటివ్ కేసులు నమోదు, కరోనాతో మరో 73 మంది మృతి; రాష్ట్రంలో కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలను మార్చిన ప్రభుత్వం

Team Latestly

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 2,260 కోవిడ్ కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం నుంచి 1868, తూర్పు గోదావరి నుంచి 1823 కేసుల చొప్పున నమోదయ్యాయి.....

Advertisement

Delhi Restrictions: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు, 14 రోజుల సంస్థాగత క్వారైంటైన్ వెళ్లాలని ఉత్తర్వులు జారీ

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చేవారు కచ్చితంగా 14 రోజుల పాటు తమ సంస్థాగత క్వారైంటైన్ కేంద్రాలకు వెళ్లాలని దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారు...

Andhra Pradesh: ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్; సంగం డెయిరీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నిలిపివేత, మరోవైపు సీఎం జగన్ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా

Team Latestly

. ఇక్కడ 56.86 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు ఫలితాలు వెల్లడించవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని కౌంటింగ్ కు ఏర్పాట్లు చేయడమే మిగిలి ఉంది....

Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో N440K వేరియంట్ కనుమరుగైంది.. రాష్ట్రంలో కొత్తగా 21,954 పాజిటివ్ కేసులు, 72 కోవిడ్ మరణాలు నమోదు, ఏపిలో 1,82,329కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

విపత్తు పరిస్థితుల్లో ప్రజలను మరింత భయపెట్టడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి అన్నారు. గతేడాది 2020 జూన్ మరియు జూలై నెలల్లో దక్షిణ భారతదేశం నుండి వచ్చిన నమూనాలలో ఎన్ 440కె (బి 1.36) వైరస్ కనుగొనబడింది. ఈ ప్రభావం గత డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరిలలో కనిపించింది. కానీ...

EC Defers By-polls: కరోనా ఉధృతి దృష్ట్యా ఉప ఎన్నికలను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా

Team Latestly

ఎన్నికలే దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని విమర్శలు ఉన్నాయి. మద్రాస్ హైకోర్ట్ అయితే నేరుగా తమిళనాడులో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణం అని నిందించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా

Advertisement

COVID Curfew in AP: ఆంధ్రప్రదేశ్‌లో పకడ్బందీగా కర్ఫ్యూ అమలు, తిరుమల వచ్చే భక్తులకు పాస్ చూపిస్తే అనుమతి, రాష్ట్రంలో వరుసగా రెండో రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

ఉత్తర్వుల ప్రకారం మే 18 వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూలో భాగంగా మధ్యాహ్నం ప్రతిరోజు 12 నుంచి ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దైవ దర్శనానికి తిరుమల వచ్చే భక్తులు మాత్రం తమ దర్శనానికి ....

AP Curfew Exemptions: ఏపీ కర్ఫ్యూ నిబంధనలో సవరణలు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు, యథాతథంగా కొనసాగనున్న బ్యాంక్‌ సేవలు, పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి, నేటి నుంచి ఈనెల 18 వరకు అమల్లోకి కర్ఫ్యూ

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ (Andhra Pradesh Partial curfew) అమలు కానుంది.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. కాగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది.

YSR Jagananna Colonies: జూన్ 1 నుంచి జగనన్న కాలనీ పనులు, కర్ఫ్యూ ఉన్నా పనులు ఆగకూడదని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ హౌజ్‌ నిర్మించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 1 నుంచి జగనన్న కాలనీల్లో (YSR Jagananna colonies) పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి (Andhra Pradesh CM Y S Jaganmohan Reddy) అన్నారు.

Tirupati: ఒక్క క్షణం లేటయితే ఆమె రైలు కింద పడిపోయేది, కదులుతున్న రైలు నుంచి దిగిన మహిళ, మెరుపు వేగంగా ఆమెను పక్కకు లాగిన రైల్వే కానిస్టేబుల్‌ సతీష్‌, వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజి

Hazarath Reddy

రైలు ప్లాట్‌ఫాంపై రైలు ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి ఫ్లాట్ పాం మీద పడిపోయింది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆమె రైలు కింద పడిపోయేది.

Advertisement

Curfew in Andhra Pradesh: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్, వస్తే మధ్యాహ్నం 12 గంటల్లోపే గమ్యం చేరాలి, నేటి నుంచి ఏపీలో 18 గంట‌ల కర్ఫ్యూ అమల్లోకి, కర్ప్యూ నుంచి మినహాయింపు పొందేవి ఏవో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

నేటి నుంచి ప‌గ‌టిపూట క‌ర్ఫ్యూ (Curfew in Andhra Pradesh) కూడా అమ‌ల‌ు చేస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్ర‌తిరోజూ 18 గంట‌ల చొప్పున క‌ర్ఫ్యూ (18-hour curfew from today in Anadhra Pradesh) అమ‌లు కానుంది. ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ (Day Time Curfew) అమ‌ల్లో ఉంటుంది.

Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, సర్పంచ్‌తో సహా నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి, సజ్జాపురం వద్ద అదుపు తప్పి చేపల చెరువులో పడిన ట్రాక్టర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం (Nellore Road Accident) జరిగింది. సజ్జాపురం- గొల్లకందుకూరులో సమీపంలోని చేపల గుంటలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో కూలీలు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా సజ్జాపురంలో పుచ్చకాయలను కోసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపు తప్పి పక్కనే చేపల చెరువులో బోల్తాపడింది.

Second Wave in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే 82 మంది మృతి, బుధవారం నుంచి మధ్యాహ్నం కర్ఫ్యూ అమలు, మద్యం అమ్మకాల వేళలు కుదింపు

Team Latestly

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు కూడా తిరగడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మద్యం దుకాణాలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి....

AP Cabinet Meeting Highlights: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్నీ బంద్, కేబినెట్ ఆమోదం పొందిన పలు నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement